India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాలకొండ డివిజన్ కేంద్రంలో పురటాల పోలమ్మ ఆలయం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వీరఘట్టం మండలం విక్రమ్పురం గ్రామానికి చెందిన వివాహిత అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాలకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
టీడీపీ నరసాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉండి MLA మంతెన రామరాజును నియమిస్తూ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు నరసాపురం పార్లమెంట్ అధ్యక్షురాలిగా ఉన్న సీతారామలక్ష్మిని పొలిట్ బ్యూరో సభ్యురాలు, ఉమ్మడి ప.గో జిల్లా ఎన్నికల సమన్వయకర్తగా నియమించారు. ఉండి టీడీపీ టికెట్ రఘురామకృష్ణరాజుకు కేటాయించడంతో మంతెన రామరాజును నరసాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించారు.
ఉదయగిరి టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు నెల్లూరులోని ఓ హోటల్లో సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడి అభ్యర్థి కాకర్ల సురేశ్ విజయానికి చేయాల్సిన కృషిపై సమాలోచనలు జరిపినట్లు పైకి చెబుతున్నా ఆ సమావేశంలో అభ్యర్థి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజులుగా సీనియర్ నేతలందరూ కాకర్లపై గుర్రుగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీ ఉదయగిరి రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం ఉదయం మోహినీ అలంకారంలో రాముల వారు జగన్ మోహన కారుడిగా దర్శనమిచ్చారు. స్వామివారి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు, చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారి ఊరేగింపు జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
టీడీపీ ప్రచారంలో బాలుడిని వినియోగించిన ఘటనపై అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 18వ తేదీ టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గళ్లా మాధవి ఆధ్వర్యంలో అమరావతి రోడ్డు వేళంగిని నగర్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆరు సంవత్సరాల బాలుడిని ప్రచారంలో ఉపయోగించారని, దీనిపై ఎంసీసీ టీమ్ ఇన్ఛార్జ్ ఝాన్సీరాణి ఫిర్యాదు చేయడంతో టీడీపీ గళ్లా మాధవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రికెట్ బెట్టింగ్లకు బానిసై అప్పులు పాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెంటాడ మండలంలో జరిగింది. పెద మేడపల్లి గ్రామానికి చెందిన కిల్లాడ ఈశ్వరరావు గతంలో రూ.4 లక్షలు వరకు బెట్టింగ్లో ఓడిపోయాడని, ఇటీవల మళ్ళీ రూ.లక్ష వరకు బకాయి పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు, వ్యసనాలకు బానిసై విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై దేవి తెలిపారు.
తిరుపతి జిల్లా పరిధిలో ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ తొలగించారు.ఈ మేరకు తిరుపతి జిల్లా SP కృష్ణకాంత్ పటేల్ ఉత్తర్వులు విడుదల చేశారు. చంద్రగిరిలో గంజాయి ముఠా అరెస్ట్ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ పురుషోత్తం నాయుడు, లంచం అడిగిన భాకరాపేట కానిస్టేబుల్ వెంకటరమణపై వేటు వేశారు. అలాగే మద్యం తాగి రైటర్తో గొడవపడిన పాకాల హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేశారు. తాజాగా వీరిపై సస్పెండ్ ఎత్తేశారు.
ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ నెల 23వ తేదీ ఉదయం నిర్వహించడానికి దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయించింది. చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని 23వ తేదీ మంగళవారం ఉదయం 5.55 గంటలకు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే ప్రదక్షిణలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఊరేగిస్తారు.
జిల్లాకు చెందిన రవి(38), శ్రీనివాస్, రాజులు తెలంగాణ రాష్ట్రంలో బేల్దారి పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో చేవెళ్లలో ఉన్న లక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయ పుష్కరిణిలో ఈతకు దిగారు. రవి పుష్కరిణి లోపలికి వెళ్లగా, శ్రీనివాస్ ఒడ్డున మునిగి బయటకు రాగా, రాజు నీటిలోకి దిగలేదు. ఎంతసేపటికీ రవి బయటకు రాకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం పోలీసులు వచ్చి గాలింపు చర్యలు చేపట్టినా రవి ఆచూకీ తెలియలేదు.
ఆదోని మండలంలోని మధిర క్రాస్ నుంచి ఎల్ఎల్సీ కెనాల్ మధ్య ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.