India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నామినేషన్ తిరస్కరణకు గురికాకుండా అభ్యర్థులు రెండు మూడు సెట్లతో పాటు డమ్మీలు వేస్తుంటారు. ఇలా తాజా ఎన్నికల్లో పెద్దిరెడ్డి కుటుంబం నుంచి 8 నామినేషన్లు పడ్డాయి. పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2, ఆయన భార్య 2 నామినేషన్లు దాఖలు చేశారు. ఆయన సోదరుడు ద్వారకనాథ రెడ్డి తంబళ్లపల్లెలో 2 సెట్లు, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా కుమారుడు మిథున్ రెడ్డి 2 సెట్ల నామినేషన్ వేశారు.
కూర్మన్నపాలెం ఉక్కు శిబిరం వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు కమిటీ కో కన్వీనర్ అయోధ్య రామ్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంశాన్ని అన్ని పార్టీలు ప్రధాన అజెండాగా చేర్చాలని కోరుతూ.. ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఉదయం 9:30 గంటలకు నిరసన ప్రారంభం అవుతుందన్నారు.
వెంకటగిరి టీడీపీ MLA అభ్యర్థిగా కురుగొండ్ల రామకృష్ణ పోటీలో ఉండనున్నారు. ఈమేరకు మంగళగిరికి వచ్చి బీఫారం తీసుకెళ్లాలని ఆయనకు TDP కేంద్ర కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఈ సీటును ఆయన కుమార్తె లక్ష్మీసాయిప్రియకు కేటాయించారు. ఇప్పటికే ఆమెతో పాటు రామకృష్ణ నామినేషన్ వేశారు. ఆయన అయితేనే అనుకూల వాతావరణం ఉంటుందని వచ్చిన నివేదికల మేరకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు సమాచారం.
ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఈనెల 23న నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 23న ఉదయం 9 గంటలకు ఏలూరు పాత బస్టాండ్ నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.
పుట్టపర్తి మండలంలోని దిగువ చెర్లోపల్లికి చెందిన ఆకుల వీరప్ప పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. శనివారం సాయంత్రం మేకలను మేపుకొని ఇంటికి వస్తుండగా వర్షం రావడంతో వీరప్ప మర్రిచెట్టు కిందకి వెళ్ళాడు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో ఆకుల వీరప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
☞ అభ్యర్థి: కోలగట్ల వీరభద్రస్వామి
☞ నియోజకవర్గం: విజయనగరం
☞ పార్టీ: వైసీపీ
☞ చరాస్తులు: రూ.6.48
☞ కేసులు: 2
☞ బంగారం: 1KG
☞ స్థిరాస్తి: రూ.15.34
☞ అప్పులు: రూ.7.49 కోట్లు
☞ భార్య పేరిట చరాస్తులు: రూ.2.97 కోట్లు
☞ భార్య పేరిట స్థిరాస్తి: రూ.4.60 కోట్లు
☞ భార్య పేరిట బంగారం: 2KG
☞ కార్లు: లేవు
➠ కోలగట్ల వీరభద్రస్వామి శనివారం నామినేషన్ దాఖలు చేయగా, ఆఫిడవిట్లో ఈ వివరాలను వెల్లడించారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జగ్గంపేటలో పర్యటించనున్నట్లు ఆపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. చంద్రబాబు రోడ్ షోలో భాగంగా శనివారం హెలీప్యాడ్ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. గోకవరం రోడ్డులో కోడూరి రంగారావుకు చెందిన స్థలం వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఏలూరులోని అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఆశ్రం)కు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్డాండర్డ్రైజేషన్ (ఐఎస్ఓ) గుర్తింపు దక్కినట్లు డైరెక్టర్ జి.రతీదేవి తెలిపారు. ఆశ్రంలో అందుబాటులోకి తెచ్చిన ప్రపంచస్థాయి సౌకర్యాలు, వైద్య సేవలు, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలు, శక్తి, పర్యావరణ అనుకూల వ్యవస్థకు ఐఎస్ఓ 5 సర్టిఫికెట్లు అందించిందన్నారు.
ఎన్నికల రోజున విధుల్లో ఉన్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇస్తారని తూ.గో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవిలతా తెలియజేశారు. అవసరమైన వారు దీనిని ఉపయోగించుకోవచ్చని అన్నారు. జిల్లాలో సుమారు 6 వేల మందికి పైగా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోనున్నారని వెల్లడించారు. జిల్లాలో ఉద్యోగ నిర్వహణలో ఉన్నవారు 12D ద్వారా పోస్టల్ ఓటు నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు.
గాలివీడులో ముగ్గురు పిల్లలతో వివాహిత నాగమణి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భర్త మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే విషయంపై ఏడాదికి పైగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త విక్రమ్కు వేరే మహిళతో ఓ బిడ్డ పుట్టిందని తెలియడంతో.. తీవ్ర మనస్తాపంతో నాగమణి వెలుగల్లి జలాశయం వద్దనున్న గండిమడుగు వద్దకు వెళ్లి పిల్లలతో ఆత్మహత్య చేసుకుంది.
Sorry, no posts matched your criteria.