Andhra Pradesh

News September 20, 2024

కడప జిల్లా ఆర్థికాభివృద్ధికి ప్రణాళికను రూపొందించండి

image

స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా ఆర్థికాభివృద్ధికి ప్రణాళికను రూపొందించుకుని, వాటి లక్ష్య సాధనకు పటిష్ఠమైన కార్యాచరణ సిద్ధం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీరాబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షించారు. జిల్లాను అభివృద్ధిపథంలో నడిపించాలని చెప్పారు.

News September 20, 2024

ఐదేళ్ల ప్రణాళికలతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలి: కలెక్టర్

image

వంద రోజులు, వార్షిక, ఐదేళ్ల ప్రణాళికలతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడారు. 2024 నుంచి 2029 వరకు ఒక విజన్‌తో కూడిన నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి శాఖ వికసిత 2047 లక్ష్యసాధనలో నిర్ణాయక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.

News September 20, 2024

15 శాతం వృద్ధిరేటు సాధించాలి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో రానున్న కాలంలో అన్ని రంగాల్లో దాదాపుగా 15% వృద్ధిరేటు సాధించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం వంద రోజుల ప్రణాళిక అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర @2047 లక్ష్య సాధనలో భాగంగా జిల్లా, మండల స్థాయి ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, మానవ వనరులు, వైద్య విధానం, తదితర వాటిలో అభివృద్ధి ప్రణాళికలు ఉండాలన్నారు.

News September 20, 2024

వెలగపూడి: రాష్ట్రంలో రూ.6585 కోట్లు మంజూరు: మంత్రి

image

రాష్ట్రంలో 384 కి.మి. మేర 7 జాతీయ రహదారుల అభివృద్దికి రూ.6,585 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసినట్లు మంత్రి బి.సి.జనార్థన రెడ్డి తెలిపారు. గురువారం వెలగపూడి లోని సచివాలయంలో ఆయన్ విలేకరులతో మాట్లాదారు. కేంద్ర  రోడ్డు రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ ఘడ్గరీ తో పలు మార్లు సంప్రదింపులు జరపడం వల్లే  ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. 

News September 20, 2024

త్వరలో నరసాపురానికి వందే భారత్ రైలు: మంత్రి

image

కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ విజయవాడ రైల్వే డివిజన్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులు, భద్రతా పనులపై చర్చించామన్నారు. అలాగే నరసాపురం రైల్వే స్టేషన్‌కు వందే భారత్ రైలును ఏర్పాటు చేసే విధంగా కార్యచరణ చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News September 20, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా హ్యాండ్ బాల్ జట్లు

image

ఈనెల 20, 21వ తేదీల్లో కడప జిల్లా వేంపల్లిలో జరిగే 38వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల హ్యాండ్ బాల్ జట్లను హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రతినిధి చిన్న సుంకన్న ప్రకటించారు. గురువారం కర్నూలు డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా జట్టుకు ఎంపికైన హ్యాండ్ బాల్ సబ్ జూనియర్స్ క్రీడాకారులకు టీషర్టులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యాయవాది శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.

News September 19, 2024

సింహాచలం ఈవోగా వి.త్రినాథరావు

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానమునకు కార్యనిర్వహణ అధికారిగా వి.త్రినాథరావును నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఉత్వర్వుల జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈవోగా పని చేస్తున్నారు. ఇక్కడ పనిచేసిన ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి తన మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు తిరిగి వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో త్రినాథరావు వచ్చారు.

News September 19, 2024

క‌ర్నూలు నుంచి విజ‌య‌వాడ‌కు రైలు సౌక‌ర్యం క‌ల్పించండి: మంత్రి టీజీ భరత్

image

కర్నూలు నుంచి విజయవాడ జంక్షన్‌కు రైలు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని రైల్వేశాఖ స‌హాయ మంత్రి వీ.సోమ‌ణ్ణ‌ను రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సోమ‌ణ్ణ‌ను భ‌ర‌త్ క‌లిసి రైల్వే స‌మ‌స్య‌ల‌పై విన‌తిప‌త్రం అందించారు. క‌ర్నూలు నుంచి విజ‌య‌వాడ‌కు ప్ర‌తి రోజూ రైలు, క‌ర్నూలు నుంచి ముంబైకి వారంలో ఒక‌టి లేదా రెండు సార్లు రైలు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని కోరారు.

News September 19, 2024

ప.గో: అమెరికాలో గుండెపోటుతో విద్యార్థి మృతి

image

నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంకి చెందిన తెలుగు విద్యార్థి ముత్తిన రమేశ్ గురువారం అమెరికాలో గుండెపోటుతో మృతి చెందారు. అమెరికాలో ఎంఎస్‌ చదివేందుకు రమేశ్ వెళ్లారు. అతని మరణ వార్త తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గడిచిన నాలుగు నెలల కాలంలో ఇదే నియోజకవర్గానికి చెందిన ముగ్గురు ఎంఎస్‌ విద్యార్థులు మృతి చెందారు.

News September 19, 2024

నంద్యాల: సీఎం సహాయ నిధికి రూ.2.22 కోట్ల విరాళం

image

శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు అందించిన విరాళాలు రూ.2,22,70,749ను సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అందజేశారు. మంగళగిరిలో సీఎం చంద్రబాబుకు ఈ మొత్తాన్ని అందజేశారు. నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, వ్యాపారవేత్తలు, పొదుపు మహిళలు, విద్యార్థులు అందించిన మొత్తం సొమ్మును లెక్క చూపి ఆయనకు అందజేశారు. ప్రజలకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.