India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
➤ శ్రీకాకుళం: JBNP అభ్యర్థిగా రాగోలు నాగశివ ➤ ఇచ్ఛాపురం: స్వతంత్ర అభ్యర్థిగా సుగ్గు చక్రవర్తి ➤ ఆమదాలవలస: BCYP అభ్యర్థిగా సిపాన శ్రీనివాసరావు ➤ JBNP అభ్యర్థిగా బురిడీ గౌరి శంకర్ ➤నరసన్నపేట: TDP అభ్యర్థిగా బగ్గు రమణ మూర్తి నామినేషన్లు వేశారు.
NOTE: జిల్లా మొత్తంగా శనివారం నాలుగు నియోజకవర్గాల నుంచి నామినేషన్లు వేశారు.
జిల్లా వ్యాప్తంగా శనివారం ఒంగోలు పార్లమెంట్ స్థానానికి, మిగిలిన నియోజకవర్గాలకు 14 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి కార్యాలయం ప్రకటించింది. ఒంగోలు పార్లమెంటుకు 4 నామినేషన్లు, యర్రగొండపాలెంలో 1, దర్శికి 2, ఒంగోలుకు 1, కొండపికి 4, గిద్దలూరుకు 2 చొప్పున నామినేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు నామినేషన్ సమర్పిస్తున్న సందర్భంగా ఆయా కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో భాగంగా మూడవ రోజైన శనివారం జిల్లాలో మొత్తం 13 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి ఒక నామినేషన్ దాఖలవ్వగా .. గన్నవరం అసెంబ్లీ స్థానానికి 04, మచిలీపట్నంకు 03, పెడనకు 02, పెనమలూరుకు 1, పామర్రుకు 1, గుడివాడకు1 నామినేషన్ దాఖలైనట్టు అధికారులు తెలిపారు. అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్, దక్షిణ నియోజకవర్గ నాయకుడు మద్ది రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించడమే తమ ధ్యేయమని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కందుల నాగరాజు, వార్డు అధ్యక్షుడు అర్జున్, నాయకులు పాల్గొన్నారు.
శ్రీ కాళహస్తి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ముని కుమారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మునికుమారి తన భర్తతో బైక్పై వెళ్తుండగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబేడు క్రాస్ రోడ్డు వద్ద లారీ ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మునికుమారి అక్కడికక్కడే మృతి చెందగా.. మృతురాలి భర్తకు కాలు విరగడంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
సంజామల మండల వ్యాప్తంగా మరి కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు చెట్లు, టవర్లు, పోల్స్, పొలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని APSDMA స్పష్టం చేసింది.
➤ నియోజకవర్గం: గుంటూరు వెస్ట్
➤ అభ్యర్థి: విడదల రజిని(YCP)
➤ భర్త: కుమారస్వామి
➤ విద్యార్హతలు: B.SC
➤ చరాస్తి విలువ: రూ.1.25కోట్లు
➤ భర్త చరాస్తి విలువ: రూ.53.03కోట్లు
➤ కేసులు: లేవు
➤ అప్పులు: లేవు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.5 లక్షలు
➤ బంగారం: 600గ్రాములు, భర్తకు 300గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.
బైకును లారీ ఢీకొని మహిళ అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల ప్రకారం.. ఆర్టీసీ ఉద్యోగి మునికుమారి(45), భర్త హరితో కలిసి బైక్పై వెళ్తుండగా పెళ్లకూరు మండలం చెంబేడు క్రాస్ రోడ్డు వద్ద లారీ ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మునికుమారి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త హరికి గాయాలయ్యాయి.
అధికారంలోకి రాగానే గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇవాళ గూడూరులోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా కేంద్రానికి వెళ్లడం ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ తెలపడంతో ఆయన ఈ హామీ ఇచ్చారు.
సినిమా నటులు చెప్పే మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. శనివారం ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన పలువురు కాపు నేతలు ముద్రగడ పద్మనాభంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాపు ఉద్యమాన్ని అణచివేసిన చంద్రబాబుకు పవన్కళ్యాణ్ మద్దతు పలకటం సిగ్గుచేటని అన్నారు. వైసీపీకి ఘన విజయం అందించాలని పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.