Andhra Pradesh

News April 20, 2024

పార్వతీపురం: మే 11న జాతీయ లోక్ అదాలత్

image

వచ్చే నెల 11న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రెండో అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు తెలిపారు. శనివారం కోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోర్ట్ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమంలో కక్షిదారులు పాల్గొని.. తమ కేసులను రాజీ చేసుకోవచ్చన్నారు.

News April 20, 2024

ఫార్మ్-6, 8లను 22వ తేదిలోపు పరిష్కరించాలి: కలెక్టర్

image

పోలింగ్ కేంద్రాల్లో పీడబ్ల్యూడీ, సీనియర్ సిటిజన్ ఓటర్లు క్యూలో వేచి ఉండకుండా ఓటు వేసేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. జి.సృజన రిటర్నింగ్ అధికారులను అదేశించారు. శనివారం పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన మౌలిక వసతులు, ఫార్మ్ డిస్పోజల్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫార్మ్-6, 8ను 22వ తేదిలోపు పరిష్కరించాలన్నారు.

News April 20, 2024

కాకినాడ: విద్యార్థులు సస్పెండ్.. నారా లోకేశ్ స్పందన ఇదే

image

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం సూరంపాలెం ఆదిత్య కాలేజ్‌కు చెందిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల సస్పెన్షన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. సూరంపాలెం వద్ద జగన్ బస్సు ఆపి విద్యాదీవెన, వసతి దీవెన అందుతున్నాయా అని విద్యార్థులను అడగ్గా, అందడం లేదని వారు సమాధానమివ్వడమే నేరమైందని అన్నారు. తక్షణమే కళాశాల యాజమాన్యం సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

News April 20, 2024

విజయవాడ: పవన్ కళ్యాణ్‌పై పోతిన మహేశ్ ఫైర్

image

జనసేన పార్టీ ఎకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పాలని వైసీపీ నేత పోతిన మహేశ్ అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరిలో పార్టీ ఆఫీస్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాను నాలుగేళ్ల నుంచి విడుదల చేయకుండా తన బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు పవన్ వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

News April 20, 2024

వెంకటాచలం : 22న కాకాణి నామినేషన్

image

సర్వేపల్లి వైసీపీ అభ్యర్థిగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఏప్రిల్ 22న నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు వెంకటాచలం మండల పరిషత్ కార్యాలయంలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ సమర్పిస్తారని కాకాణి కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.

News April 20, 2024

కాకినాడ: వర్మ రుణం తీర్చుకుంటాను: పవన్ కళ్యాణ్

image

కాకినాడ జిల్లాలోని కొత్తపల్లిలో టీడీపీ నేతలతో జనసేన అధినేత పవన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పిఠాపురం TDP ఇన్‌ఛార్జి వర్మ నియోజకవర్గ నాయకులను పరిచయం చేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. పిఠాపురంలో వర్మతో కలిసి పనిచేస్తున్నానని.. ఆయన రుణం తీర్చుకుంటానన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమనే మద్దతిచ్చానని తెలిపారు. నేడు సాయంత్రం కోరుకొండ సభలో ఆయన పాల్గొననున్న విషయం తెలిసిందే.

News April 20, 2024

తూ.గో.: ఈ పెళ్లి పత్రిక DIFFERENT.. ఏంటో చూసేయండి

image

రాజమండ్రికి చెందిన అలికాని సత్యశివకుమార్, దుర్గాభవానీల వివాహం ఈ నెల 21న జరగనుంది. కాగా వారి వివాహ వేడుకకు ఆహ్వానపత్రికను వినూత్నంగా సిద్ధం చేశారు. నిశ్చితార్థం మొదలుకొని 16 రోజుల పండగ వరకు సుమారు 45 ఘట్టాలు, వాటి విశిష్టతను 40 పేజీల శుభలేఖలో పొందుపరిచారు. పత్రి ఘట్టానికి ఓ క్యూఆర్ కోడ్ రూపొందించి శుభలేఖలో ముద్రణ చేయించారు. కోడ్ స్కాన్ చేస్తే ఆ ఘట్టాన్ని ఎవరైనా చూడొచ్చు.
– మీరు చూశారా ఇలాంటివి.

News April 20, 2024

విశాఖ: ‘ఎన్నికల వ్యయాలను ఖచ్చితంగా లెక్కించాలి’

image

ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల వ్యయాల వివరాలను ఖచ్చితంగా లెక్కించాలని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం వ్యయ పరిశీలకులు రెంగ రాజన్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల వ్యయ పరిశీలకులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. అభ్యర్ధులు ఖర్చు చేసే ప్రతి పైసా కూడా ఎన్నికల వ్యయంలోకే వస్తుందని, అందువలన వాటిపై ఏఈఓలకు పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు.

News April 20, 2024

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బేతంచెర్ల చిన్నారికి చోటు

image

బేతంచెర్లకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గుండా గోపాల్ మనుమడు గుండా ఆయాన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. 4వ తరగతి చదువుతున్న ఆయాన్ 100 నుంచి ఒకటి వరకు వెనక వైపు నుంచి అంకెలను 37 సెకండ్లలో చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థిని పలువురు అభినందించారు.

News April 20, 2024

తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర తేదీలు మార్పు

image

తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను వారం రోజుల పాటు మార్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో మే 7 నుంచి 15వ తేదీ వరకు జరిగే జాతరను నిర్వహించాల్సి ఉంది. అయితే ఎన్నికల నియమావళి ప్రకారం ఇబ్బందులు లేకుండా అవిలాల జాతర ఆలస్యం కావడంతో మే 14 నుంచి 22వ తేదీకి మార్చారు. ఆలయం ఏర్పాటైన తర్వాత ఇదే తొలిసారి ఇలా జరగడం.