India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
CM సెప్టెంబర్ మొదటి వారంలో అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం పర్యటన కోసం అనంతపురం పరిధిలోని SK యూనివర్సిటీ వద్ద అనంతపురం- కదిరి జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలాన్ని కలెక్టర్, జిల్లా ఎస్పీ జగదీశ్ పరిశీలించారు.
ప్రతి నెల 3వ శుక్రవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం తెలిపారు. ఎంప్లాయిస్ గ్రీవెన్స్ సెప్టెంబరు 19న కలెక్టరేట్లో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ సమస్యలపై ఈ గ్రీవెన్స్లో ధరఖాస్తులను అందజేయవచ్చునని సూచించారు.
బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిన దృష్ట్యా రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. పిజిఆర్ఎస్ అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలకు పంట నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చెరువులు, కాల్వల గట్లు పటిష్టంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండల స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో PGRS కార్యక్రమం సోమవారం జరిగింది. కలెక్టర్ అంబేద్కర్, అధికారులు వినతులు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు అత్యధికంగా 68 వినతులు అందగా పంచాయతీశాఖకు 10, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డిఆర్డిఏకు 40 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 07, విద్యా శాఖకు 12, హౌసింగ్కు 02, వైద్య శాఖకు 05, విద్యుత్ శాఖకు 07, మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి.
పొగాకు కొనుగోళ్లలో సమతుల్యం పాటించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. జిల్లాలో పొగాకు కొనుగోళ్లపై బోర్డు రీజనల్ మేనేజర్ రామారావు, ఐటీసీ మార్కెటింగ్ మేనేజర్ రాజుదొరైలతో సోమవారం ఒంగోలులోని తన కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు. కొనుగోళ్లకు సంబంధించి పొగాకు కంపెనీలు ఇచ్చిన ముందస్తు రిక్వైర్మెంట్స్, జిల్లాలో పొగాకు ఉత్పత్తిపై కలెక్టర్ ఈ సందర్భంగా ఆరా తీశారు.
మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్లో ఆదివారం సముద్ర స్నానం చేస్తూ ఓ యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మొగల్తూరు మండలం కొత్తపాలెంకు చెందిన శ్రీహర్ష(17) తన కుటుంబ సభ్యులతో కలిసి సముద్రంలో స్నానం చేస్తున్నాడు. ఈక్రమంలో అలల ఉద్ధృతికి లోపలికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సోమవారం శ్రీహర్ష మృతదేహం లభ్యమైంది. మృతదేహన్ని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు,
నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుంచి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించిన రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరులపై జిల్లా పోలీసులు దృష్టిపెట్టారు. అతని ప్రధాన అనుచరులు జగదీశ్తో పాటు భూపతి, సురేంద్రను వేదయపాలెం పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాంత్ గ్యాంగ్పై పోలీసులు సీరియస్గా దృష్టి పెట్టిన నేపథ్యంలో మరి కొంతమందిని అరెస్టు చేసే అవకాశాలున్నాయి.
ప్రకాశం జిల్లా పునర్విభజన నేపథ్యంలో తెరపైకి సరికొత్త డిమాండ్ వచ్చింది. శ్రీశైలం మండలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని కోరుతూ సంతకాలు సేకరించారు. ‘మార్కాపురానికి దగ్గర శ్రీశైలం ఉంది. ఇక్కడి గిరిజనులకు మార్కాపురంతో అనుబంధం ఉంది. వెలిగొండ, శ్రీశైలం ప్రాజెక్టులతో భవిష్యత్తులో నీటి వివాదాలు వస్తాయి. వీటికి పరిష్కారంగా శ్రీశైలాన్ని మార్కాపురంలో కలపాలి’ అని TDP నేత కందుల రామిరెడ్డి కోరారు.
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారిపై అత్యాచారాలు, హత్యలు ఎక్కువయ్యాయన్నారు. కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులే వీటిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని విమర్శించారు.
నిడదవోలులో QR కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి కందుల దుర్గేశ్ అధికారులతో కలిసి కార్డుల పంపిణీని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అనర్హులను తొలగించి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టిందని,అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు అందజేస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.