Andhra Pradesh

News April 18, 2024

కృష్ణా జిల్లాలో తొలి రోజు నామినేషన్లు వేసింది వీరే

image

జిల్లాలో తొలి రోజు 05 నామినేషన్లు దాఖలయ్యాయి. గన్నవరం అసెంబ్లీ స్థానానికి TDP అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ 2 సెట్లు, ఆయన సతీమణి జ్ఞానేశ్వరి ఒక సెట్, పామర్రు అసెంబ్లీ స్థానానికి TDP అభ్యర్థి వర్ల కుమార్ రాజా, మచిలీపట్నం అసెంబ్లీకి పిరమిడ్ పార్టీ నుంచి వక్కలగడ్డ పావని ఒక సెట్ చొప్పున నామినేషన్ దాఖలు చేశారు. బందరు MP, అవనిగడ్డ, పెడన, పెనమలూరు, గుడివాడ MLA స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలవ్వలేదు.

News April 18, 2024

ధర్మవరం వైసీపీ అభ్యర్థిగా వెంకటరామిరెడ్డి నామినేషన్

image

ధర్మవరం వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన అనుచరులతో కలిసి సాదాసీదాగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ధర్మవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.

News April 18, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురి నామినేషన్

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో గురువారం అసెంబ్లీ స్థానానికి పలువురు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరఫున నరసరావుపేట-చదలవాడ అరవిందబాబు, మంగళగిరి- నారా లోకేశ్ ఉన్నారు. వైసీపీ తరఫున బాపట్ల- కోన రఘుపతి ఉన్నారు. పిరమిడ్ పార్టీ వినుకొండ-రమణ, పెదకూరపాడు-మల్లిఖార్జున రావు, కాంగ్రెస్ తరఫున-నాగేశ్వరరావు, జాతీయ జనసేన పార్టీ నరసరావుపేట-గోదా రమేశ్, టీడీపీ నరసరావుపేట ఎంపీగా శ్రీకృష్ణ దేవరాయలు.

News April 18, 2024

ఒంగోలు పార్లమెంట్‌కు నామినేషన్ వేసిన క్రాంతి కుమార్

image

రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రకాశం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఒంగోలు పార్లమెంట్ కు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బొడ్డు క్రాంతి కుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేష్ కుమార్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈమేరకు కలెక్టర్ ఆ పత్రాలను పరిశీలించి ఆఫిడవిట్ అందజేశారు.

News April 18, 2024

ఎంబీఏ లాజిస్టిక్ సప్లయ్ చైన్ మేనేజ్మెంట్లో ప్రవేశాలు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీఏ లాజిస్టిక్స్ సప్లయ్ చైన్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రెండేళ్ల కాల వ్యవధి తో నిర్వహించే ఈ కోర్సులో ప్రవేశాలకు జూన్ 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల పరిశీలించి జూన్ 20న ప్రవేశాలు కల్పిస్తారు. రక్షణ రంగాల్లో పనిచేసే వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రవేశాల ప్రాధాన్యత ఇస్తారు. కోర్సు ఫీజుగా ఏడాదికి రూ.60 వేలు చెల్లించాలి.

News April 18, 2024

ఏళ్ళు గడుస్తున్నా సాలూరు రాని రైలు బండి..!  

image

కొన్నేళ్లుగా సాలూరు ప్రాంత వాసులకు ఊరిస్తున్న రైలుబండి ఇంకెన్నేళ్లకు పట్టాలెక్కుతుందో అని సాలూరు ప్రజలు మండి పడుతున్నారు. గతంలో వచ్చే రైలు బస్‌కు బదులు సాలూరు నుంచి విశాఖపట్నం వరకు 6 బోగీలతో రైలు దసరాకు ప్రారంభిస్తారని పట్టాలు సరిచేసి, విద్యుత్ లైన్ వేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో పట్టాల మధ్య పిచ్చి మొక్కలు పెరిగి స్టేషన్ పరిసరాలు చీకటి పనులకు అడ్డాగా మారిందంటున్నారు.

News April 18, 2024

అన్న వైసీపీ అభ్యర్థిగా అబ్దుల్ సత్తార్ నామినేషన్

image

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి భార్గవ తేజ్‌కు ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న వైసీపీ, టీడీపీలను కర్నూలు ప్రజలు చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు.

News April 18, 2024

ఎన్నికల బాధ్యతలు చేపట్టిన ముఖ్య అధికారులు

image

సార్వత్రిక ఎన్నికల ఖర్చుల పరిశీలనకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారులను నియమించడంతో గురువారం వారు బాధ్యతలు చేపట్టారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సాదిక్ అహ్మద్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్ పరిశీలకులుగా యోగేష్ కుమార్, పెద్దాపురం, కాకినాడ, జగ్గంపేట నియోజకవర్గాలకు ఏ.ఆషీఫ్ నియమితులయ్యారు. గురువారం కలెక్టర్ జే.నివాస్ ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు.

News April 18, 2024

బాబు పర్యటనతో నామినేషన్ తేదీ మార్పు

image

20వ తేదీన గూడూరు పట్టణంలో మాజీ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తన నామినేషన్ మార్పు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు. ఈ నెల 19న నామినేషన్ వేయాల్సి ఉండగా చంద్రబాబు పర్యటన కారణంగా 22వ తేదీకి మార్పు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

News April 18, 2024

అనంత: పిడుగుపాటుకు యువకుడి మృతి

image

వజ్రకరూర్ మండలం చాబాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో పిడుగుపాటుకు గురై వినోద్ (27) అనే యువకుడు మృతి చెందాడు. పొలంలో మిర్చిని సంచులలో నింపి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, గ్రామస్థులు గమనించి వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.