India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కంకిపాడులో ఓ మైనర్ బాలికపై అత్యాచారాయత్నానికి యత్నించిన వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేశామని కంకిపాడు ఎస్సై సందీప్ తెలిపారు. పోలీసుల వివరాల మేరకు కంకిపాడుకి చెందిన వంగా ప్రవీణ్ అనే వ్యక్తి ఓ బాలికపై అత్యాచారాయత్నానికి యత్నించాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని ఎస్సై సందీప్ చెప్పారు.
నెల్లూరు జిల్లాలో గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు వీడియోగ్రఫీతో పాటు సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని ఆర్వో కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తి కాగా.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే బరిలో ఉన్న వంశీ కృష్ణ శ్రీనివాస్ బీ-ఫారం అందుకున్నారు. బుధవారం మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ బీ-ఫారంను అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. దక్షిణ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 342 ఫిర్యాదులు అందాయని అందులో 171 ఫిర్యాదులు ఎన్నికల కమిషన్ పోర్టల్లో నమోదయ్యాయని, వాటిలో 166 పరిష్కరించామని తెలిపారు. సి-విజిల్ లో 91 ఫిర్యాదులు అందగా వాటన్నిటినీ పరిష్కరించామన్నారు. జిల్లాలో మొత్తం రూ.83 లక్షల విలువ కలిగిన మద్యం, గంజాయి, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల వద్ద పటిష్ఠ బందోబస్తు చేపట్టాలని పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అమిత్ బర్గర్ సూచించారు. బుధవారం శింగనమల మండల కేంద్రంలోని నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల నియమ నిబంధనలు అమలు చేసి నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నామినేషన్ల వద్ద నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే లోపలికి అనుమతించనున్నట్లు తెలిపారు.
సారా, మద్యం అక్రమ రవాణా కేసుల్లో పెండింగ్ కేసుల పురోగతిపై అధికారులతో ఎస్పీ రాధిక బుధవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ అరెస్టులు, కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేసుల సత్వర పరిష్కారం కోసం కేసుల దర్యాప్తు వేగవంతం చేసి త్వరితగతిన నిందితులకు శిక్ష పడేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రేమ్ కాజల్ ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల లో భాగంగా ఏలూరు జిల్లాలో ఈనెల 18వ తేదీ నుండి నామినేషన్ స్వీకరణకు సర్వం సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు కార్యాలయ పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారన్నారు.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి పర్యవేక్షణ నిమిత్తం వ్యయ పరిశీలకులు జిల్లాకు చేరుకున్నట్టు కలెక్టర్ అరుణ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. హిందూపురం పార్లమెంటు నియోజవర్గానికి అమిత కుమార్, మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాలకు వినాయక్, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాలకు రిదయం బహుదజలు జిల్లాకు వచ్చారని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 19న టీడీపీ అధినేత చంద్రబాబు ఆలూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేసేందుకు బుధవారం ఆలూరులో జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. అదే రోజు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆలూరులో పర్యటించునున్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రబీ సీజన్లో ధాన్యం కొనుగోలుకు 377 కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. సాధారణ రకం క్వింటాలుకు రూ.2,183, గ్రేడ్-ఏ రకం రూ.2,203 మద్దతు ధర ఇస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలులో ఎదురయ్యే సమస్యలను, ఫిర్యాదులను 1800 425 2532 నంబర్ కు కాల్ చేసి చెప్పాలన్నారు.
Sorry, no posts matched your criteria.