India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా వ్యాప్తంగా 1. 51 లక్షల స్మార్ట్ కార్డులు వచ్చాయని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం వద్ద స్మార్ట్ కార్డుల పంపిణీ చేశారు. క్యూ ఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీలో జరిగే అక్రమాలను సులభంగా అరికట్టవచ్చన్నారు. స్మార్ట్ కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గుంటూరు జిల్లాలోని 5,85,615 కుటుంబాలకు ఈ నెల 30 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఏటీఎమ్ కార్డు మాదిరిగా, క్యూఆర్ కోడ్తో రూపొందించిన ఈ కార్డులను గ్రామ సచివాలయాల ద్వారా పంపిణీ చేస్తారు. కార్యక్రమంలో పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేస్తారు. ఈ కొత్త సాంకేతిక కార్డులతో ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
మర్రిపూడి మండలంలో ఓ ఊరు రెండు పంచాయతీల్లో ఉంటోంది. ఈ రెండు పంచాయతీల మధ్య పొదిలి కొండపి రోడ్డు మాత్రమే ఉంది. రోడ్డుకు తూర్పు వైపున జువ్విగుంట, పడమర వైపు రావెళ్లవారిపాలెం పంచాయతీలు ఉన్నాయి. పొదిలి వైపు వెళ్లే వాళ్లు రావెళ్లవారిపాలెంలో బస్సు ఎక్కాలి. అదే బస్సు రిటర్న్లో ఆ గ్రామంలో దిగాలంటే జువ్విగుంటలో దిగాలి.
చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నయ్య నీలం నాయుడు (75) అనారోగ్య కారణంగా సోమవారం ఉదయం రేగిడిలో మృతి చెందారు. ఈయన గతంలో రేగిడి గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు. స్వస్థలం రేగిడిలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. నీలం నాయుడు మృతితో రేగిడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కడపలో గంజాయి నిర్మూలనకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. గంజాయి అమ్మకాలకు సంబంధించి దుకాణాలను పరిశీలించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఉంటున్న వ్యక్తులను విచారించారు. గంజాయి అమ్మకాలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని పర్యావరణ శాస్త్ర విభాగం & సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ ఇకలాజికల్ డెవలప్మెంట్ (సీడ్) ఇండియా ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు 26వ తేదీ(మంగళవారం) యూనివర్సిటీ ప్రధాన ద్వారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 9441812543, 9491991918 నంబర్లను సంప్రదించాలని కోరారు.
కృష్ణా జిల్లాలో కొత్త సాంకేతిక సదుపాయాలతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి ప్రారంభమవుతుంది. జిల్లాలోని 5,17,825 కుటుంబాలకు ఈ కార్డులను అందజేయనున్నారు. ఏటీఎమ్ కార్డు ఆకారంలో, క్యూఆర్ కోడ్తో రూపొందించిన ఈ కార్డులను గ్రామ సచివాలయాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని స్వయంగా కార్డులు అందజేస్తారు.
తుళ్లూరులోని CRDA కార్యాలయంలో ఈనెల 29న 300కు పైగా ఉద్యోగాల భర్తీకై జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఈ మేరకు విజయవాడలోని తన కార్యాలయం నుంచి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళాలో SSC, ITI, ఇంటర్, డిగ్రీ, BSC నర్సింగ్, డిప్లొమా, PG, బీటెక్ చదివినవారు హాజరుకావొచ్చని చెప్పారు. వివరాలకు ఫెసిలిటేటర్స్ లేదా 9848424207, 9963425999 సంప్రదించాలన్నారు.
తాడిపత్రిలోని వినాయక కాంప్లెక్స్లో ఏటా వివిధ రూపాలలో గణనాథుడిని ఏర్పాటు చేస్తుంటారు. ఈసారి చాక్లెట్ లంబోదరుడిని కొలువుదీరుస్తున్నట్లు తెలిసింది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 20 ఏళ్ల నుంచి వినూత్న రీతిలో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు. ఇసుక, టెంకాయ పీచు, విభూది, కాంతార విగ్రహాలను ఇది వరకు ఏర్పాటు చేశామని చెప్పారు.
మొగల్తూరులోని కేపీ పాలెం బీచ్లో ఆదివారం ఓ యువకుడు గల్లంతయ్యాడు. మొగల్తూరులోని కొత్తపాలేనికి చెందిన శ్రీహర్ష కుటుంబీకులతో ఆదివారం బీచ్కు వచ్చాడు. సముద్ర స్నానం చేస్తూ అలల ఉద్ధృతికి లోపలికి కొట్టుకుపోయాడు. యువకుని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.