Andhra Pradesh

News April 17, 2024

తూ.గో.: అక్కడ 6 సార్లు కాంగ్రెస్.. 5 సార్లు TDP మరి ఈ సారి..?

image

కోనసీమ జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ 5 సార్లు, జనసేన, సీపీఐ, ఇండిపెండెంట్ ఒక్కోసారి విజయం సాధించాయి. ప్రస్తుతం వైసీపీ, జనసేన మధ్య పోటీ జరుగుతుంది. 1962, 67, 78, 89, 2004, 2009లో కాంగ్రెస్, 1983, 85, 94, 99, 2014లో TDP, 1955లో సీపీఐ, 1972లో ఇండిపెండెంట్, 2019లో జనసేన విజయం సాధించాయి. మరి ఈసారి విజయం ఎవరిదో చూడాలి.

News April 17, 2024

ఒంటిమిట్టలో చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సీతారాముడి వివాహం

image

ఒంటిమిట్టలో 22న పున్నమి వెన్నెలలో రాములోరి కళ్యాణం నిర్వహిస్తారు. రాత్రే కళ్యాణం జరగడానికి పురాణాల్లో ఓ కథ ఉంది.. విష్ణుమూర్తి, లక్ష్మిదేవి వివాహం పగలు జరుగుతుంది. తాను అక్క లక్ష్మిదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో.. నీ కోరిక రామావతారంలో తీరుతుందని చంద్రుడికి విష్ణుమూర్తి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమిన సీతారాముల వివాహం జరుగుతుంది.

News April 17, 2024

రాచర్ల: ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి

image

రాచర్ల మండలం చినగానపల్లె గ్రామ సమీపంలో బుధవారం ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

News April 17, 2024

కుప్పం: వైసీపీ, టీడీపీ నేతలకు నోటీసులు జారీ

image

ఎన్నికల నిబంధనలు
ఉల్లంఘించిన ఘటనపై వైసీపీ, టీడీపీ నాయకులకు నోటీసులు అందించినట్లు ఏఆర్ఓ నాగేశ్వరరావు తెలిపారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పది మంది నాయకులకు నోటీసులు అందించామన్నారు. విగ్రహం వద్ద అనుమతి లేకున్నా వైసీపీ శ్రేణులు బైఠాయించి, నిరసన తెలపడంతో ఎమ్మెల్సీ భరత్, మరో 17 మందికి నోటీసులు జారీ చేశామన్నారు.

News April 17, 2024

VZM: అత్యాచారం, మోసం కేసులో నిందుతుడికి శిక్ష

image

తెర్లాం పోలీస్ స్టేషన్‌లో 2016లో నమ్మించి, మోసగించిన కేసు నమోదయ్యంది. రంగప్పవలసకి చెందిన డి.రామకృష్ణ ఓ మహిళను పెళ్లిచేసుకుంటానని మోసగించి అత్యాచారం, హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. మంగళవారం విజయనగరం ఏడీజే & మహిళా కోర్టు తీర్పు వెల్లడించినట్లు ఎస్సై రోణంకి రమేశ్ తెలిపారు. నిందుతుడికి సంవత్సరం కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించినట్లు చెప్పారు.

News April 17, 2024

సివిల్స్‌లో అనంత జిల్లా వాసికి జాతీయ స్థాయి ర్యాంక్

image

మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాలలో గుంతకల్లు పట్టణానికి చెందిన ధనుశ్‌కు జాతీయస్థాయిలో 480వ ర్యాంకు వచ్చింది. గుంతకల్లు పట్టణంలో పుట్టి పెరిగిన ధనుశ్ బీటెక్ పూర్తి చేశారు. సివిల్స్ పరీక్షలకు తాను ఎటువంటి కోచింగ్ తీసుకోలేదని పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను, ఆంగ్ల దినపత్రికలను చదువుతూ ముఖ్యమైన విషయాలను నోట్స్ లో రాసుకుంటూ పరీక్షలకు సిద్ధమైనట్లు ఆయన చెప్పారు.

News April 17, 2024

కాకినాడ: వరుపుల V/S వరుపుల

image

ప్రత్తిపాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ పోటీచేస్తున్న వైసీపీ, TDP- జనసేన- BJP కూటమి అభ్యర్థుల ఇంటిపేర్లు ఒకటే కావడం గమనార్హం. YCP నుంచి వరుపుల సుబ్బారావు బరిలో నిలవగా..కూటమి నుంచి వరుపుల సత్యప్రభ ఉన్నారు. 1985, 1989, 1999లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన సుబ్బారావు 3 సార్లు ఓటమి చెందారు. ఆ తర్వాత 2004లో గెలుపొందారు. 2009 ఓడి, 2014లో గెలిచారు. 2019లో పోటీలో లేరు. తాజాగా మరోసారి బరిలో నిలిచారు.

News April 17, 2024

సత్తెనపల్లిలో మంత్రి అంబటి ఫొటోతో టీ కప్పులు

image

సత్తెనపల్లిలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో పట్టణంలోని టీ స్టాల్‌లలో మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌ల ఫొటోలతో ఉన్న టీ కప్పులు దర్శనమిస్తున్నాయి. కొందరు వైసీపీ నాయకులు తమకు ఈ కప్పులు ఇచ్చారని, టీ కొట్టు నిర్వాహకులు చెబుతున్నారు.

News April 17, 2024

NTR: ఇన్‌స్టాలో లవ్.. సొంతింటికే బాలిక కన్నం

image

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన శ్రీనివాసరావు హైదరాబాద్‌లో ఉంటున్నారు. మరదలి కూతురు(13) ఇతని వద్దే ఉంటోంది. ఆ బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో బెంగళూరులో చదివే విజయ్‌తో పరిచయం ఏర్పడి, ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో బాలిక శ్రీనివాసరావు ఇంట్లోని నగలు, నగదు చోరీ చేసి అతనికి పంపేది. ఇటీవల డబ్బులు పోవడం గమనించిన శ్రీనివాసరావు బాలిక ఫోన్లో వాట్సాప్ చూడగా బండారం బయటపడింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.

News April 17, 2024

కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలివే.!

image

కర్నూలులో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.108.91 ఉండగా గత పది రోజులుగా 109.22 ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర నేడు రూ.96.80గా ఉండగా..గత పది రోజులుగా రూ.97.09 ఉంది.అలాగే నంద్యాల జిల్లాలో పెట్రోల్ నేడు రూ.109.89 ఉండగా మంగళవారం రూ.109.76 ఉంది. డీజిల్ రూ.97.69 ఉంది.