Andhra Pradesh

News September 19, 2024

తూ.గో: 24లోపు స్కాలర్షిప్ పరీక్ష కోసం దరఖాస్తులు

image

తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈనెల 24వ తేదీలోపు నేషనల్ మెయిన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు తెలిపారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరంలో గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. https://www.bse.ap.gov.in ఆసక్తి గల విద్యార్థులందరూ ఈ వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 19, 2024

దాసన్నకే మళ్లీ వైసీపీ పగ్గాలు

image

వైసీపీ జిల్లా అధ్యక్షునిగా Ex.Dy.CM ధర్మాన కృష్ణదాస్‌ని వైసీపీ అధినేత జగన్ గురువారం నియమించారు. దాసన్న కుటుంబం మొదట్నుంచీ వైఎస్ కుటుంబానికి అత్యంత ఆత్మీయులు, ఆప్తులుగా పేరుపొందారు. పార్టీ ఆవిర్భావం నుంచీ దాసన్న సతీమణి పద్మప్రియ జిల్లా
అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ధర్మాన గత ప్రభుత్వంలో మంత్రిమండలి నుంచి మళ్లీ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు మళ్లీ ఆయనకే పట్టంకట్టారు.

News September 19, 2024

ఒంగోలు: కంప్యూటర్, ట్యాలీ‌పై ఉచిత శిక్షణ

image

ఒంగోలు రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి కంప్యూటర్, ట్యాలీ నందు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాలు కలిగి ఉండి, గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ మహిళలకు ఈ అవకాశం ఉంటుందన్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలని, శిక్షణ సమయంలో శిక్షణతో పాటు భోజన, వసతి కల్పించనున్నట్లు వెల్లడించారు.

News September 19, 2024

కవిటి: చంద్రబాబు రాక ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న కలెక్టర్

image

కవిటి మండలం రాజాపురానికి శుక్రవారం సీఎం రానున్నారు. రాజపురంలో జరిగే ‘ఇది మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీకాకుళం జిల్లాకు తొలిసారిగా సీఎం వస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే అశోక్ బాబు, డీఎస్పీ మహేందర్ రెడ్డి గురువారం రాజాపురానికి చేరుకుని.. ఏర్పాట్లను పరిశీలించారు.

News September 19, 2024

నేను ఆ మాటలు అనలేదు: బాలినేని

image

ప్రతిపక్షంతో పాటు స్వపక్షంతోనూ తాను ఎన్నో బాధలు ఎదుర్కొన్నట్లు బాలినేని చెప్పారు. ‘సామాజికవర్గ న్యాయమంటూ నా పదవి పీకేశారు. ముందు ప్రకాశం జిల్లాలో ఎవరికీ మంత్రి పదవి లేదని.. చివరకు సురేశ్‌కు ఇచ్చారు. ఈడ్రామాలు అవసరమా? YSను తిట్టిన వాళ్లనూ మంత్రిగా కొనసాగించారు. పిల్ల కాంగ్రెస్, పెద్ద కాంగ్రెస్ కలిసిపోతోందని నేను చెప్పినట్లు నాపై దుష్ర్పచారం చేశారు. నేను ఆ మాటలు అనలేదు’ అని బాలినేని చెప్పారు.

News September 19, 2024

ఎర్రగొండపాలెం MLA సమావేశం ఆంతర్యం ఏంటి?

image

ఎర్రగొండపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన ఇలా కార్యకర్తలతో సమావేశమవడం ఉత్కంఠ రేపుతోంది. కేవలం నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవడానికి ఇలా సమావేశం పెట్టారని కొందరు నేతలు చెబుతున్నారు.

News September 19, 2024

నందిగం సురేశ్‌కు రిమాండ్ పొడిగింపు

image

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా TDP కార్యాలయంపై దాడి కేసులో ఈ నెల 5న సురేశ్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేయగా, ఆయనను పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ కూడా జరిపారు. బుధవారం తుళ్లూరు పోలీసులు ఓ మర్డర్ కేసులో ఆయనపై పీటీ వారెంట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

News September 19, 2024

నెల్లూరు: 15 మంది YCP కార్పొరేటర్లు TDPలో చేరిక

image

నెల్లూరు నగరానికి చెందిన 15 మంది YCP కార్పొరేటర్లు, నుడా మాజీ ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో TDPలో చేరారు. వీరికి నారా లోకేశ్ పసుపు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, రూప్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.

News September 19, 2024

వెయిట్ లిఫ్టింగ్‌లో నెల్లిమర్ల యువకుడికి బంగారు పతకాలు

image

ఫిజి దేశంలో జరుగుతున్న కామన్ వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తాజాగా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్ బాబు జూనియర్, సీనియర్ విభాగాల్లో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్నాడు. మొత్తం 326 కేజీల బరువును ఎత్తి ఈ ఘనత సాధించాడు. SHARE IT..

News September 19, 2024

Way2News: నెల్లూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

image

నెల్లూరు జిల్లాలోని పలు మండలాలకు Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. ఏదైనా ఛానల్, పేపర్‌లో పనిచేస్తున్నవారు, గతంలో ఏదైనా ఛానల్, పేపర్‌లో పని చేసి మానేసిన వారు అర్హులు. ఈ <>లింకుపై<<>> క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోండి.