Andhra Pradesh

News April 15, 2024

గుంటూరు: టీడీపీ ముఖ్య నాయకులకు కీలక బాధ్యతలు

image

పలువురు టీడీపీ ముఖ్య నాయకులకు అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. పెదకూరపాడు కొమ్మాలపాటి శ్రీధర్‌ను నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా, సత్తెనపల్లి-కోడెల శివరామకృష్ణను రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గుంటూరు వెస్ట్-తాడిశెట్టి మురళీమోహన్, నరసరావుపేట- నల్లపాటి రాములను కార్యనిర్వాహక కార్యదర్శులుగా, మాచర్ల-కళ్ళం రామాంజిరెడ్డి, పంగులూరు అంజయ్యను పార్టీ కార్యదర్శులుగా నియమించారు.

News April 15, 2024

జనానికి విసుగెత్తిస్తున్న ‘ఫోన్’ ప్రచారం

image

ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాక ముందే రాజకీయ పార్టీల ప్రచారం తారస్థాయికి చేరింది. ప్రధానంగా నెల్లూరు జిల్లా కేంద్రంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో పాటు సోషల్ మీడియాను సైతం పూర్తిగా వాడేస్తున్నారు. ప్రధానంగా ఫోన్ కాల్స్‌తో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వేర్వేరు నంబర్ల నుంచి ఎడతెగకుండా వస్తున్న ఫోన్ కాల్స్‌తో జనం విసుగెత్తిపోతున్నారు.

News April 15, 2024

గుడివాడ: పరీక్షలో తప్పడంతో విద్యార్థిని ఆత్మహత్య 

image

రూరల్ మండలంలోని పార్నాసలో అక్క ఇంజినీరింగ్‌, చెల్లెలు ఇంటర్మీడియట్‌లో తప్పడంతో ఇద్దరూ సోమవారం పురుగు మందు తాగారు. చెల్లే చికిత్స పొందుతూ మృతిచెందగా.. అక్క బయటపడింది. ఎస్సై లక్ష్మీనరసింహమూర్తి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.  

News April 15, 2024

టికెట్ వార్..? అక్కడ పోటీచేసేదెవరు..?

image

ప.గో. జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీ టికెట్‌పై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. అక్కడి నుంచి సిట్టింగ్ MLA మంతెన పోటీచేస్తారా..? లేక ఎంపీ రఘురామకృష్ణ బరిలో ఉంటారా అన్నది తెలియరావడం లేదు. ఇదిలా ఉండగా ఈ నెల 22న నామినేషన్ వేస్తానని RRR ప్రకటించారు. కానీ ఏ స్థానం నుంచి వేస్తారో చెప్పలేదు. మరోవైపు ఆకివీడులో రామరాజు ప్రచారం కొనసాగిస్తున్నారు.
– ఇంతకీ ఉండి టికెట్ ఎవరికి దక్కుతుంది..? మీ కామెంట్..?

News April 15, 2024

ప్రకాశం: రేపు బాస్కెట్ బాల్ జిల్లా ఎంపిక

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ జూనియర్‌ బాలబాలికల జట్ల ఎంపిక ఈనెల 16న కందుకూరులోని టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు సోమినేని సురేష్‌ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎంపిక ప్రారంభమవుతుందన్నారు. 2006 జూన్‌ 1వ తేదీ తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలన్నారు.

News April 15, 2024

గుంటూరు: రైలు ప్రమాదంలో మహిళ మృతి

image

గద్వాల పాత హౌసింగ్ బోర్డ్ సమీపంలో నిన్న జరిగిన <<13050560>>రైలు ప్రమాదం<<>>లో మృతి చెందిన మహిళ గుంటూరు జిల్లా మంతెనవారి పాలెం వేముల ప్రియాంకగా గుర్తించారు. ఉద్యోగరీత్యా భర్త జితేంద్రతో కలిసి జడ్చర్లలో ఉంటున్నారు. ఇటీవల భర్త తిరుపతికి వెళ్లగా ఆమె వారి బంధువులను చూసేందుకు గుంటూరు వెళ్లింది. తిరిగి జడ్చర్లకు వస్తుండగా గద్వాల వద్ద రైలు నుంచి కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

News April 15, 2024

తర్లుపాడు: ద్విచక్ర వాహనం అదుపుతప్పి.. ఒకరి మృతి

image

తర్లుపాడు మండలం గొల్లపల్లి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మార్కాపురం మండలం మిట్టమీదపల్లికు చెందిన వెంకటేశ్వరరెడ్డి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.

News April 15, 2024

కర్నూలు: గుండెపోటుతో మహిళ మృతి

image

క్రిష్ణగిరి మండలం అమకతాడు గ్రామ పంచాయతీ మాదాపురంలో మాదిగ జమ్మక్క గుండెపోటుతో మృతి చెందారు. ఆమె భర్త గిడ్డన్న తెలిపిన వివరాల మేరకు.. నిన్న రాత్రి నిద్రపోవడానికి ముందు ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పిందని, ఉదయం పలకరించినా మాట్లాడకపోవడంతో దగ్గరకు వెళ్లి చూడగా మృతిచెంది ఉందని తెలిపారు. జమ్మక్కకు నలుగురు కూతుర్లు ఉన్నారు.

News April 15, 2024

కడప: రైలులో ప్రయాణిస్తూ మహిళ మృతి

image

పెండ్లిమర్రి మండలం, సంత కొవ్వూరు చెందిన మంటింటి లక్ష్మీదేవి (36) రైలులో ప్రయాణిస్తూ మృతి చెందినట్లు మంచిర్యాల జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను తెలంగాణలోని బెల్లంపల్లి మండలం సోమగూడెం కల్వరి చర్చికి తీసుకొచ్చారు. ప్రార్థనల్లో పాల్గొన్న లక్ష్మీదేవి తిరిగి రైలులో వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పేర్కొన్నారు.

News April 15, 2024

ఏలూరు: విదేశాలకు మన జిల్లా మామిడి ఎగుమతి

image

ప్రస్తుత సీజన్‌లో నూజివీడు మామిడిని కెనడా, అమెరికా దేశాలకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏలూరు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రామ్మోహన్‌ తెలిపారు. నూజివీడు మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మామిడి రైతు ఎం.బీ.వీ రాఘవరావు, మామిడి తోటను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ నెల 16వ తేదీన 1.2 టన్నుల మామిడి పండ్లను కెనడాకు, ఈ నెల 25న అమెరికాకు ఎగుమతి చేయనున్నట్టు తెలిపారు.