Andhra Pradesh

News April 15, 2024

ప.గో.: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గురుకులానికి స్థానం

image

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి డాక్టర్.బీఆర్.అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చోటుదక్కింది. 3600 ప్రాజెక్టులను వీడియోల ద్వారా తల్లిదండ్రులకు వివరించడం, 500 అంబేడ్కర్ చిత్రపటాలు గీయడం వంటి వేర్వేరు విభాగాల్లో గురుకుల పాఠశాల విద్యార్థులు ఈ ఘనత సాధించారు. ఈ మేరకు ప్రిన్సిపల్ రాజారావు ఆదివారం ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.

News April 15, 2024

విశాఖ: నేడు డయల్ యువర్ సీపీ కార్యక్రమం

image

నేడు డయల్ యువర్ సీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ.రవిశంకర్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కమిషనరేట్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను 0891-2523408 నంబర్‌కు డయల్ చేసి తెలియపరచాలని సూచించారు. అనంతరం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు వృద్ధుల సమస్యలు, ఫిర్యాదుల కోసం సమయం కేటాయించడం జరిగిందని చెప్పారు.

News April 15, 2024

పార్వతీపురం: ఘనంగా అంబేడ్కర్ జయంతి

image

భారతరత్న డా. బీ. ఆర్. అంబేడ్కర్ జయంతి కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ, సాధికారిత శాఖ ఆధ్వర్యంలో జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక జ్యోతి భారతరత్న అంబేడ్కర్ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శోబిక అన్నారు.

News April 15, 2024

19న కాకినాడలో సిద్ధం సభ

image

ఈ నెల 19వ తేదీన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరిగే మేమంతా సిద్ధం సభను జయప్రదం చేయాలని కె.గంగవరం మండల కార్యకర్తల సమావేశంలో రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్ పిలుపు నిచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేపట్టిన సిద్ధం బస్సు యాత్రకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్థానిక పార్టీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

News April 15, 2024

ఎల్లుండి పీలేరుకు షర్మిల రాక

image

పీలేరులో షర్మిల నిర్వహించనున్న న్యాయ యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 16వ తేదీన మంగళవారం ఉదయం 10 గంటలకు పీలేరు నాలుగు రోడ్ల కూడలిలో రోడ్ షో ఉంటుదని తెలిపారు. కార్యక్రమంలో అమృతతేజ, దుబ్బా శ్రీకాంత్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

News April 15, 2024

విజయవాడ: ‘జగన్‌పై దాడి ఘటనలో దోషులను వెంటనే పట్టుకోవాలి’

image

సీఎం జగన్‌పై దాడి ఘటనలో దోషులను తక్షణమే పట్టుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వైసీపీ నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రజా స్వామ్యంలో హింసకు తావులేదన్నారు. జగన్‌పై దాడి ఘటనలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజానిజాలను నిగ్గుతేల్చాలని అన్నారు. అనంతరం దోషులను వెంటనే పట్టుకోవాలని డీజీపీని కోరినట్లు చెప్పారు.  

News April 14, 2024

పరవాడ: ‘ప్రజలు మరోసారి అవకాశం కల్పించాలి’

image

పెందుర్తి ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేస్తున్నానని ప్రజలు మరోసారి అవకాశం కల్పించాలని వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్ విజ్ఞప్తి చేశారు. పరవాడ మండలం భర్నికం గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందని అన్నారు. భర్నికం పంచాయతీ అభివృద్ధికి రూ.1.94 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే రూ.10.76 విలువ గల సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం జరిగిందన్నారు.

News April 14, 2024

కర్నూలు: టీడీపీ ఎన్నికల సమన్వయకర్తలను వీరే

image

రానున్న ఎన్నికల్లో నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సమన్వయకర్తలను నియమించింది. అందులో భాగంగా కర్నూల్ పార్లమెంట్‌కు జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు, నంద్యాల నియోజకవర్గానికి ఏరాసు ప్రతాపరెడ్డి, కోడుమూరు, ఎమ్మిగనూరుకు సంజీవ్ కుమార్‌ను నియమించింది. ఆలూరు, పత్తికొండలకు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆళ్లగడ్డకు కేవీ సుబ్బారెడ్డిలు ఉన్నారు.

News April 14, 2024

కడప: రోడ్డు ప్రమాదంలో ఎస్సైకు గాయాలు

image

బి.కోడూరు మండలం తుమ్మలపల్లి గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్సై జయరాములు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. పోలీసు వాహనాన్ని పక్కకి ఆపి ఫోన్‌లో మాట్లాడుతున్న ఎస్సై వాహవాన్ని అటు వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సైకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఎస్సైను చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 14, 2024

అచ్యుతాపురం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటకి  చెందిన రాము విద్యుత్ షాక్‌తో ఆదివారం మృతి చెందాడు. కొండకర్ల ప్రైవేట్ రిసార్ట్‌లో పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌తో భవనం పైనుంచి కింద పడ్డాడు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రాముని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.