Andhra Pradesh

News April 14, 2024

అచ్యుతాపురం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటకి  చెందిన రాము విద్యుత్ షాక్‌తో ఆదివారం మృతి చెందాడు. కొండకర్ల ప్రైవేట్ రిసార్ట్‌లో పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌తో భవనం పైనుంచి కింద పడ్డాడు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రాముని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 14, 2024

చంద్రబాబుని నమ్మి మోసపోవద్దు: మంత్రి ధర్మాన

image

అధికారం కోసం చంద్రబాబు అనేక తప్పుడు ప్రచారాలు చేస్తూ, మాయమాటలు చెబుతున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇచ్చిన జగనన్నకు ఓటు వేయాలన్నారు.

News April 14, 2024

గొడవలు జరిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి: నంద్యాల ఎస్పీ

image

నంద్యాల జిల్లాలో ఎక్కడైనా అల్లర్లు, గొడవలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏదైనా ప్రమాదంలో ఉంటే అత్యవసర పోలీసు సేవలు పొందాలనుకునే వారు వెంటనే 08514-225097 నంబరుకు ఫోన్ చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పై నంబర్లో పోలీసు అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు.

News April 14, 2024

బేస్తవారిపేట మండలంలో బాలికపై అత్యాచారం

image

బేస్తవారిపేట మండలంలో ఆదివారం అమానుష ఘటన చోటుచేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న బాలిక తన స్నేహితురాలు వద్దకు పుస్తకాల కోసం వెళ్లగా అక్కడే ఉన్న పిచ్చయ్య అనే ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లి వాపోయారు. బాలికను బలవంతంగా తన ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడని బాలిక తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

News April 14, 2024

VZM: టీడీపీ రెబల్‌గా మీసాల గీత పోటీ..!

image

2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తెలిపారు. ఆదివారం విజయనగరంలో ఆమె మాట్లాడుతూ.. అందరి ఆత్మ గౌరవం అనే నినాదంతో వెళ్తున్నట్లు చెప్పారు. పదవుల కోసం చూడకుండా పార్టీ మనుగడ కోసం పని చేస్తే 2O24లో కూడా తనకు అన్యాయం చేశారన్నారు. పార్టీ ప్రయోజనాల కోసం అన్ని అవమానాలు భరించానన్నారు.

News April 14, 2024

తెనాలిలో గంజాయి విస్తరించింది: నాదెండ్ల

image

తెనాలిలో చిన్న చిన్న అంగళ్లలోనూ గంజాయి ఎక్కువగా విస్తరించిందని తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. తెనాలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ తెనాలిలో అనేక హామీలు ఇచ్చారని కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హామీ ఇచ్చారు.

News April 14, 2024

CTR: ఆ 7 చోట్ల గుర్తులు మారుతాయి..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు ఈసారి ఎన్నికల్లో రెండు ఓట్లు(MLA, MP) వేయాల్సి ఉంటుంది. పొత్తులో భాగంగా తిరుపతి, రాజంపేట MP అభ్యర్థులుగా బీజేపీ నేతలు బరిలో ఉన్నారు. దీంతో శ్రీకాళహస్తి, సత్యవేడు, పుంగనూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లెలో ఒక ఈవీఎం(MLA)లో సైకిల్ గుర్తు, మరొక ఈవీఎం(MP)లో కమలం గుర్తు ఉంటుుంది. తిరుపతిలో జనసేన MLA అభ్యర్థి పోటీలో ఉండటంతో ఇక్కడ రెండు EVMలోనూ సైకిల్ గుర్తు కనపడదు.

News April 14, 2024

NLR: బస్సులో మహిళ మృతి

image

ఓ‌ మహిళ ఆర్టీసీ బస్సులోనే చనిపోయిన ఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం‌ ఆదూరుపల్లి వద్ద ఆదివారం వెలుగు చూసింది. నెల్లూరు నుంచి కలువాయికి వెళ్తున్న బస్సులో ఓ‌ మహిళ అస్వస్థతకు గురైంది. ప్రయాణికులు 108కు సమాచారం అందించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యానికి చేర్చారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 14, 2024

ప.గో.: సీఎంపై దాడి.. మంత్రి వనిత రియాక్షన్ ఇదే..

image

సీఎం జగన్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ గోపాలపురం నియోజకవర్గం యర్నగూడెం గ్రామంలో వైసీపీ నాయకులు నిర్వహించిన నిరసన ర్యాలీలో మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఇది హేయమైన చర్య అని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు గన్నమని వెంకటేశ్వరరావు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News April 14, 2024

ప్రకాశం: రోడ్లు వేయనందుకు నిరసనగా ఎన్నికల బహిష్కరణ

image

75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో రోడ్లు వేయలేని పాలకుల అసమర్థతను నిరసిస్తూ ఆ గ్రామస్థులు రానున్న ఎన్నికలను బహిష్కరించారు. పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఫ్లెక్సీని గ్రామంలో అంటించి తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. సీఎస్ పురం మండలంలోని దర్శిగుంట్ల పంచాయతీ పరిధిలోని బొంతవారిపల్లిలో గ్రామస్థుల ఆవేదన చర్చనీయాంశమైంది.