India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ప.గో.జిల్లాలో అన్ని సీట్లూ గెలిచి అధికారం చేపట్టిన కూటమి సర్కారు పాలనకు రేపటితో 100 రోజులు పూర్తి కానుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. అన్న క్యాంటీన్లు, ఉచిత ఇసుక, పింఛన్ పెంపు వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలన, మీ ఎమ్మెల్యేల పనితీరుపై మీ కామెంట్..
కడప జిల్లాలో 7 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్..
ఉమ్మడి విశాఖ జిల్లాలో అరకు, పాడేరు మినహా మిగిలిన అన్ని సీట్లూ గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు MLAలు ప్రజలకు వివరించనున్నారు. పెన్షన్ పెంపు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలనలో, మీ MLA పనితీరుపై మీ కామెంట్..
అనంతపురం జిల్లాలో అన్ని సీట్లూ గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్..
ఫిజి దేశంలో జరుగుతున్న కామన్ వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన అక్క, చెల్లెళ్లు సత్తా చాటారు. నెల్లిమర్ల మం. కొండవెలగాడకి చెందిన బెల్లాన శ్రీను, గౌరి దంపతుల కుమార్తెలు బెల్లాన హారిక, భార్గవి వివిధ విభాగాల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. హారిక 1 రజత పతకం, భార్గవి 2 రజత పతకాలను సాధించారు. ప్రతిభ కనబరిచిన ఇద్దరికి గ్రామస్థులు, క్రీడాభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.SHARE IT..
నెల్లూరు రూరల్ తెలుగుగంగా కాలనీ ఎంజీబీ లేవుట్ సమ్మర్ స్టోరేజీ రోడ్డు ప్రాంతంలో తరచూ పవర్ కట్ అవుతుంది. మంగళవారం అర్థరాత్రి పోయిన కరెంట్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చారు. మళ్లీ రాత్రి 7 గంటల నుంచి అర్థరాత్రి కావొస్తున్నా కరెంటు రాకపోవడంతో పిల్లలు, వృద్ధులు దోమలతో ఇబ్బందులు పడ్డారు.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తు గడువును ఈనెల 24 వరకు పొడిగించినట్లు ప్రకాశం జిల్లా డీఈవో సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు కట్టాల్సి ఉంటుందన్నారు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వాటిని ప్రింట్ తీసుకుని ఈనెల 27వ తేదీలోగా డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పెంచినట్లు ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం తెలిపారు. నిర్ణీత గడువులోపు ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, ఎయిడెడ్, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలల 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను www.bse.ap.gov.in వెబ్ సైట్లో ఉంచామన్నారు.
ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ చేయడానికి ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కడప జోన్-4 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెంగల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీజిల్ మెకానిక్ 97, మోటార్ మెకానిక్ 6, ఎలక్ట్రిషియన్ 25, వెల్డర్ 4, పెయింటర్ 2, ఫిట్టర్ 9, డ్రాఫ్ట్ మెన్ సివిల్ 1 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. అక్టోబర్ 3వ తేదీలోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కొవ్వూరు రైల్వే స్టేషన్లో కోవిడ్ సమయంలో నిలిపి వేసిన పూరి-తిరుపతి, బిలాస్ పూర్-తిరుపతి మధ్య తిరిగే ఎక్స్ ప్రెస్ రైళ్లకు కొవ్వూరులో హాల్ట్ కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి-పూరీల మధ్య ఎక్స్ ప్రెస్ ఐదు రోజులు, బిలాస్ పూర్-తిరుపతి మధ్య రెండు రోజులు రైలు నడుస్తున్నాయి. భువనేశ్వర్ రామేశ్వరం పుదుచ్చేరి-హౌరాల మధ్య ప్రయాణిస్తున్న వారాంతపు ఎక్స్ ప్రెస్లకు రాజమండ్రిలో హాల్ట్ కల్పించారు.
Sorry, no posts matched your criteria.