India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ రైల్వే స్టేషన్లో జి.ఆర్.పీ ఇన్స్పెక్టర్ సి.హెచ్. ధనంజయనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం జి.ఆర్.పీ-ఆర్పీఎఫ్ సంయుక్త తనిఖీల్లో, కర్ణాటకకు చెందిన రసూల్ (27), షాదీక్ హుస్సేన్ వద్ద నుంచి రూ.50,000 విలువైన 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గంజాయి ముఠాలపై ప్రత్యేక నిఘా బృందాలతో విశాఖ, దువ్వాడ, అనకాపల్లి, సింహాచలం స్టేషన్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
పులిచెర్ల మండలం కల్లూరుకు చెందిన దంపతులు డీఎస్సీలో విజయం సాధించారు. ఆర్.గిరి ప్రసాద్ 82.16 మార్కులు, ఆయన భార్య హేమావతి 81.86 మార్కులతో DSC SGT పరీక్షలో విజయాలు సాధించారు. ఇద్దరూ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మిత్రులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి కృషిని పలువురు అభినందించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమాన్ని మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ DK బాలాజీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజానీకం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత శాఖల అధికారులకు అర్జీలు అందించి పరిష్కారం పొందాలని సూచించారు.
జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం హెచ్చరించారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెలలో ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 1520 ఓడీ కేసులు నమోదు చేశామని చెప్పారు. వాటిలో డ్రోన్స్ సహాయంతో 90 కేసులు నమోదు చేశామన్నారు.
కడప జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో సోమవారం నుంచి కౌన్సెలింగ్ జరుగుతుందని వీసీ డాక్టర్ విశ్వనాథ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. బీఎఫ్ఏ(ఫోర్ ఇయర్స్ డిగ్రీ) ఫైన్ ఆర్ట్స్ (యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, శిల్పం, బి. డెస్ ఇంటీరియర్ డిజైన్) కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
ప్రతిరోజు సైక్లింగ్ చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతోపాటు, పోలీస్ అధికారులు, సిబ్బంది సైకిల్ తొక్కి వ్యాయామ సాధన చేశారు. అనంతరం ఎస్పీ పలు సూచనలు చేశారు.
గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరిగేందుకు కమిటీ సభ్యులు సహకరించాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం పిలుపునిచ్చారు. అల్లర్లు, ఘర్షణలకు తావు లేకుండా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీస నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపాలు ఏర్పాటు చేస్తున్న సభ్యులు https://ganeshutsav.netలో అనుమతులు పొందాలని సూచించారు.
వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. తిరుపతి వెళుతున్న వాహనాన్ని తనిఖీ చేసేందుకు ఆపగా అందులో రూ.80 వేలు విలువచేసే 10 కేజీల గంజాయిను గుర్తించారు. గంజాయిని సీజ్ చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సాలోని కోరాపూర్ వద్ద గంజాయిని కొనుగోలు చేసి తిరుపతిలో అమ్మేందుకు వెళుతుండగా మార్గం మధ్యలో వారిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఊటుకూరు సర్కిల్ నుంచి మౌంట్ ఫోర్ట్ స్కూల్ వరకు ఆదివారం సైక్లింగ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సైక్లింగ్ సహజ సిద్ధమైన వ్యాయామని చెప్పారు. అందరూ వ్యాయామంతో పాటు సైక్లింగ్ కూడా అలవాటు చేసుకోవాలని కోరారు.
జిల్లాలోని పెద్దకడబూరుకు చెందిన శివప్రసాద్ DSCలో పట్టు విడువని విక్రమార్కుడిలా పోరాడాడు. DSC ఎస్జీటీలో 83.43 మార్కులతో టీచర్ పోస్ట్లు అర్హత సాధించాడు. గతంలో జరిగిన ప్రతి DSCలో ఒకటి, అర మార్కులతో ఎస్జీటీ పోస్టు చేయి జారినా నిరుత్సాహపడలేదు. 2025 DSC ఇక తనకు చివరిదిగా భావించి రాత్రింబవళ్లు కష్టపడి ఎస్జీటీ పోస్టుకు ఎంపికై తన చిరకాల కలను సాధించాడు.
Sorry, no posts matched your criteria.