India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మండలంలోని ఈదగాలి గ్రామానికి చెందిన వెందోటి సుబ్రహ్మణ్యం, వెంకటలక్ష్మమ్మ దంపతులు. వారిద్దరూ శుక్రవారం సాయంత్రం బైక్పై వెళ్తుండగా ఇడిమేపల్లి ప్రాంతంలోని సర్వేపల్లి రైల్వే గేట్ సమీపంలో స్కూల్ వ్యాన్ ఢీ కొట్టింది. దీంతో వెంకటలక్ష్మమ్మ (30) అక్కడికక్కడే మృతిచెందింది. సుబ్రహ్మణ్యంకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నందిగం మండలం జాతీయ రహదారిపై శనివారం ఉదయం కార్ అదుపుతప్పి బోల్తా పడింది. పైడి భీమవరం నుంచి పలాస వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పలాసలో జరుగు శుభకార్యానికి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కారు బుక్ చేసుకుని వెళ్తున్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై నందిగం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించిందో విద్యార్థిని. కాకినాడ PR ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదువుతున్న డి.సాయిలక్ష్మి 1000కి గానూ 991 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ తిరుపతిరెడ్డి తెలిపారు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో సాయిలక్ష్మి స్తతా చాటగా.. గ్రామస్థులతో పాటు అధ్యాపకులు ఆమెను అభినందించారు.
ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం జగ్గవరం గ్రామంలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పోలీసుల వివరాల ప్రకారం.. జగ్గవరానికి చెందిన ఏడేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన లక్ష్మణరావు ఇంటికి తీసుకువెళ్లి చీమలు తొలగిస్తానని చెప్పి ఆమె దుస్తులు తీసేసి అత్యాచారానికి యత్నించాడు. ఇంటికి వచ్చిన బాలిక శరీరంపై గాయాలు గుర్తించిన తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు లక్ష్మణరావుపై కేసు నమోదు చేశారు.
సీఎం జగన్కు ఓటమి భయం పట్టుకుందని, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల జిల్లాలో చేపట్టిన న్యాయ యాత్రను అడ్డుకుంటున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర విమర్శించారు. జగన్ వైఫల్యాన్ని, వివేకానందరెడ్డి హత్య కేసు వివరాలను షర్మిల ప్రజలకు వివరించడంతో జగన్ లో ఓటమి భయం మొదలైందన్నారు. అందుకే వేంపల్లె, లింగాలలో అల్లరిమూకలతో అడ్డుకోవాలని చూశారన్నారు.
ప్రకాశం జిల్లా సముద్ర జలాల్లో పడవలు, మరబోట్ల ద్వారా నిర్వహించే చేపలవేటపై 61 రోజుల నిషేధం ఈనెల 15 నుంచి అమల్లోకి రానుందని జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సముద్రంలో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిషేధం విధించినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు మత్స్యకారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా వారికి ప్రభుత్వం అందించే రాయితీలను నిలిపివేస్తామన్నారు.
కృష్ణా జిల్లా ఇంటర్ ఫలితాల్లో హైస్కూల్ ప్లస్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఆశించిన మేర రాలేదు. జిల్లాలో ఏకంగా 7 చోట్ల జీరో ఫలితాలు నమోదు అయ్యాయి. పెనుగ్రంచిప్రోలు(3), లింగాలపాడు(19), జగ్గయ్యపేట బాలికలు(4), పెనమలూరు(6), పమిడిముక్కల(6), ఘంటసాలలో ఒకరు చొప్పున పరీక్ష రాస్తే అందరూ ఫెయిలయ్యారు.
బత్తలపల్లి మండలానికి చెందిన చెలిమి రామ్మోహన్, ఆదెమ్మల కుమార్తె గౌతమి మండల టాపర్గా నిలిచింది. ధర్మవరంలోని కళాశాలలో చదువుతూ ఎంపీసీ మొదటి సంవత్సరంలో 465/470 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు రైతు కూలీలుగా జీవనం సాగిస్తూ తమ బిడ్డను చదివిస్తున్నారు. మండల టాపర్గా నిలిచిన గౌతమిని కురుబ కార్పొరేషన్ ఛైర్మన్ కోటి బాబు అభినందించారు.
శ్రీకాకుళం మండల పరిధిలోని డీసీసీబీ కాలనీలో నివాసం ఉంటున్న కింతలి శ్రీవాణి (30) శుక్రవారం తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ..శ్రీవాణి, ఆమె భర్త హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేసేవారు. కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే ఆమెకు పిల్లలు లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.
బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ శాస్త్రవేత్త చందు సాంబశివరావు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. నేడు ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. గుంటూరు పశ్చిమ నుంచి బీజేపీ తరఫున ఈయన ఎమ్మెల్యే సీటు ఆశించారు. అయితే టీడీపీ అభ్యర్థికి సీటు కేటాయించడంతో బీజేపీకి రాజీనామా చేశారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో కాపులకు తగిన ప్రాధాన్యం లేదని గతంలో ఆయన చెప్పారు.
Sorry, no posts matched your criteria.