India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారి NSVL నరసింహం తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తుకు ఈనెల 24 వరకు గడువు ఉందన్నారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం కూడా ఈనెల 18 నుంచి 24 వరకూ సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయన్నారు. SHARE IT..
ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఏలూరు జిల్లా వృత్తి విద్యాధికారి బి.ప్రభాకర్ తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తుకు ఈనెల 24 వరకు గడువు ఉందన్నారు. అలాగే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 18 నుంచి 24 వరకూ సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయన్నారు. SHARE IT..
శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేట నిషేధిస్తున్నట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ డీడీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సుమారు 61 రోజులు పాటు సముద్ర జలాలలో చేపల వేట నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఈ రెండు నెలల సమయం చేపలు సంతానోత్పత్తిని పెంచేందుకు ఉపయోగపడుతుందన్నారు.
కృష్ణగిరి మండలం యాగంటి పల్లెకు చెందిన ఎరుకల శంకర్ రైతు. మొదటి కూతురు అనురాధ గతేడాది వెల్దుర్తి బాలికల హాస్టల్లో ఉంటూ పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అనంతరం పాణ్యం మండలం నెరవాడలో గల మహాత్మ గాంధి జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ బాలికల కళాశాలలో ఇంటర్లో చేరింది. ఫస్టియర్ బైపీసీలో 425/440 మార్కులు సాధించి మండలంలోనే మొదటి స్థానాన్ని సాధించి ప్రతిభను చాటుకుంది.
ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది విధులకు హాజరు కాకపోతే సస్పెండ్ చేస్తామని సత్యసాయి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల రిటర్నింగ్ అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బందికి ఇప్పటికే ఒక విడత శిక్షణ పూర్తి చేశామని, మరోసారి శిక్షణ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
భూమి కబ్జా చేయడమే కాకుండా, అడ్డుకున్న తల్లి,కూతురిపై ఇనుప రాడ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మదనపల్లెలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కోళ్లబైలు గ్రామం బయారెడ్డి కాలనీలోని వెంకటరమణాచారి తన అనుచరులతో స్థానికంగా ఉండే తల్లీకూతుళ్లు సరోజమ్మ, అనురాధల భూమిని కబ్జా అడ్డుకోవడంతో వెంకటరమణాచారి, యశ్వంత్ మరి కొంతమంది దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.
విజయనగరం జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేట నిషేధిస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. సుమారు 61 రోజులు పాటు సముద్ర జలాలలో చేపల వేటపై నిషేధం అమలులో ఉంటుందన్నారు. మోటార్ బోట్లు, మెకనైజ్డ్ బోట్ల ద్వారా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని మత్స్యకారులకు సూచించారు. ఆ నిషేధించిన కాలంలో చేపలు సంతానోత్పత్తి పెంచుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ ఒకటి వరకు నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫెయిలైన, ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునే విద్యార్థులు పరీక్ష ఫీజును సంబంధిత కళాశాలలో ఈ నెల 18 నుంచి 24వ తేదీ లోపు చెల్లించాలని కోరారు. ప్రాక్టికల్స్ సప్లిమెంటరీ పరీక్షలను మే ఒకటి నుంచి 4 వరకు జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు పటిష్ఠ చర్యలు చేపట్టామని కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జేసీ గోపాలకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఈనెల 11 నాటికి మొత్తం 18,17,162 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.1.30 కోట్ల విలువైన డబ్బు, మద్యం, తదితర వస్తువులను సీజ్ చేసినట్లు చెప్పారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం సమీపంలోని పెన్నానదిలో శుక్రవారం ఓ గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. అక్కడి స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వ్యక్తి వివరాల కోసం విచారణ చేపట్టినట్లు అర్బన్ సీఐ సురేష్ బాబు తెలిపారు.
Sorry, no posts matched your criteria.