India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు రూరల్ తెలుగుగంగా కాలనీ ఎంజీబీ లేవుట్ సమ్మర్ స్టోరేజీ రోడ్డు ప్రాంతంలో తరచూ పవర్ కట్ అవుతుంది. మంగళవారం అర్థరాత్రి పోయిన కరెంట్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చారు. మళ్లీ రాత్రి 7 గంటల నుంచి అర్థరాత్రి కావొస్తున్నా కరెంటు రాకపోవడంతో పిల్లలు, వృద్ధులు దోమలతో ఇబ్బందులు పడ్డారు.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తు గడువును ఈనెల 24 వరకు పొడిగించినట్లు ప్రకాశం జిల్లా డీఈవో సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు కట్టాల్సి ఉంటుందన్నారు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వాటిని ప్రింట్ తీసుకుని ఈనెల 27వ తేదీలోగా డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పెంచినట్లు ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం తెలిపారు. నిర్ణీత గడువులోపు ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, ఎయిడెడ్, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలల 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను www.bse.ap.gov.in వెబ్ సైట్లో ఉంచామన్నారు.
ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ చేయడానికి ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కడప జోన్-4 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెంగల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీజిల్ మెకానిక్ 97, మోటార్ మెకానిక్ 6, ఎలక్ట్రిషియన్ 25, వెల్డర్ 4, పెయింటర్ 2, ఫిట్టర్ 9, డ్రాఫ్ట్ మెన్ సివిల్ 1 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. అక్టోబర్ 3వ తేదీలోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కొవ్వూరు రైల్వే స్టేషన్లో కోవిడ్ సమయంలో నిలిపి వేసిన పూరి-తిరుపతి, బిలాస్ పూర్-తిరుపతి మధ్య తిరిగే ఎక్స్ ప్రెస్ రైళ్లకు కొవ్వూరులో హాల్ట్ కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి-పూరీల మధ్య ఎక్స్ ప్రెస్ ఐదు రోజులు, బిలాస్ పూర్-తిరుపతి మధ్య రెండు రోజులు రైలు నడుస్తున్నాయి. భువనేశ్వర్ రామేశ్వరం పుదుచ్చేరి-హౌరాల మధ్య ప్రయాణిస్తున్న వారాంతపు ఎక్స్ ప్రెస్లకు రాజమండ్రిలో హాల్ట్ కల్పించారు.
శ్రీకాకుళానికి చెందిన బాలికను ఒడిశాకు చెందిన యువకుడు మోసం చేశాడని పోలీసులను తెలిపింది. వారి వివరాలు.. బాలికకు రెండేళ్ల కిందట పెళ్లిలో కృష్ణ పరిచయమయ్యాడు. అతను పొక్లెయిన్ డ్రైవర్గా పైడిభీమవరంలో ఉండేవాడు. పరిచయమైనప్పటి నుంచి ప్రేమపేరిట తిరిగి, పెళ్లి చేసుకోమంటే తప్పించుకుంటున్నాడని తెలిపింది. దీనిపై శ్రీకాకుళం గ్రామీణ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేసినట్లు ASI నారాయణ రావు బుధవారం తెలిపారు.
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల రుణం మంజూరు చేసింది. సొంతకారు కొనుగోలు కోసం ప్రభుత్వం ఈ రుణం ఇచ్చింది. ఆమె వేతనం నుంచి 30 వాయిదాల్లో ప్రభుత్వం రుణాన్ని మినహాయించుకుంటుంది. మంత్రి హోదాలో ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వం ప్రోటోకాల్ కాన్వాయ్ ఇస్తున్నప్పటికీ, సొంత కారు కోసం ఆమె ప్రభుత్వం నుంచి లోన్ తీసుకున్నారు.
నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని విజయవంతం చేయాలని కడప కలెక్టర్ శివశంకర్ అన్నారు. కలెక్టరేట్లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణ ఏర్పాట్లపై రిక్రూటింగ్ డైరెక్టర్ కల్నన్ పునీత్ కుమార్, SP హర్షవర్ధన్ రాజు, JC అదితి సింగ్, రిక్రూట్మెంట్ అధికారితో సమావేశమయ్యారు. కడపలో ఎంపికలు జరుగుతాయని, నెల్లూరు, తిరుపతి జిల్లాల అభ్యర్థులు హాజరుకావాలని అన్నారు.
భీమిలి బీచ్లో MP విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలన్నింటిని కూల్చివేయాలని జీవీఎంసీని హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. రాజకీయ జోక్యంతో కూల్చివేతలను ఆపవద్దని సూచించింది. ఫొటోలను పరిశీలిస్తే బీచ్లోనే నిర్మాణాలు చేసినట్లు స్పష్టం అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్పై తుళ్లూరు పోలీసులు బుధవారం మంగళగిరి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2020లో మండలంలోని వెలగపూడిలో రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఓ మహిళ మృతిచెందింది. అప్పట్లో ఓ సామాజిక వర్గం రోడ్డుపై బైఠాయించి నందిగం సురేశ్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చాలని ధర్నా కూడా చేశారు. సదరు కేసుపై తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Sorry, no posts matched your criteria.