India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరులో ఓ బాలుడు ఆడుకుంటూ కాలువలో దిగి ఊపిరాడక మృతి చెందాడు. పట్టణంలోని గ్జేవియర్ నగర్కు చెందిన బాలవిజ్ఞేశ్ బుధవారం ఇంటి సమీపంలో ఉన్న ఏటిగట్టున సోదరితో కలిసి ఆడుకుంటూ కాలువలోకి దిగాడు. చిన్నారి మునిగిపోవడం చూసిన సోదరి కేకలు వేయగా స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బాలుడిని వెలికితీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
కలెక్టర్ అరుణ్ బాబు స్వచ్ఛతా హీ సేవకు మద్దతు తెలుపుతూ సెల్ఫీ దిగారు. ఐటీసీ బంగారు భవిష్యత్, సెర్చ్ ఎన్జీవో జిల్లా నీరు పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో ఐ సపోర్ట్ స్వచ్ఛ భారత్ అనే అంశంపై కలెక్టరేట్లో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. దీనిలో కలెక్టర్తో పాటు పలువురు అధికారులు సెల్ఫీ దిగి తమ మద్దతు తెలిపారు. సంస్థ జిల్లా కోఆర్డినేటర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మండల స్థాయిలో తమ తోడ్పాటు అందజేస్తామని చెప్పారు.
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం ఎందరో యువకులు ఎదురు చూస్తున్నారు. వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కడప నగరంలో నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఈ మేరకు కడప మున్సిపల్ స్టేడియంలో అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లా యువకులు సైతం ఇందులో పాల్గొనవచ్చు. మరి ర్యాలీకి మీరు సిద్ధమా..?
వరద బాధితుల సహాయార్థం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే గల్లా అరుణ కుమారి ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు కోట్లు ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహాయ చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబీకులు పాల్గొన్నారు.
ఉండ్రాజవరం మండలం శివారు రెడ్డి చెరువులో శ్రీనివాసరావు (41) పై భార్య రాణి కత్తెరతో దాడి చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను బుధవారం మృతి చెందాడని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. అనుమానంతో భార్యని నిలదీయడంతో రెండు నెలల నుంచి వీరి మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయన్నారు. ఈ విషయమై ఘర్షణ తలెత్తడంతో మంగళవారం రాత్రి రాణి తన భర్త గుండెల్లో కత్తెరతో పొడవగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.
కర్నూలు జిల్లాలో ఇసుక ఆన్లైన్ అమ్మకాలు ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి ప్రారంభమవుతాయని గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ డీడీ రాజశేఖర్ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక బుకింగ్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఇసుక కొనుగోలుదారులు తహశీల్దారు కార్యాలయాలు, సచివాలయాల్లో బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపారు.
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పెళ్లకూరు మండలంలో చోటుచేసుకుంది. సీఐ సంగమేశ్వరరావు వివరాలు ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన చంద్రశేఖర్ మెగా కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో వారు ఫొన్లో రోజూ గొడవపడేవారు. రాజుపాళెం అటవీప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ మునుస్వామి తెలిపారు.
నెల్లూరు జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లా వాసి సూసైడ్ చేసుకున్నాడు. పెళ్లకూరు మండలం రాజుపాలెం అటవీ ప్రాంతంలో చంద్రశేఖర్ వేప చెట్టుకు ఉరేసుకుని ఉండడాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు. నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వర రావు వివరాలు ప్రకారం.. చంద్రశేఖర్ మెగా కంపెనీలో పని చేస్తూ పెళ్లకూరు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. భార్యతో వివాదాల కారణంగా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు విషయాన్ని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ‘ఇది మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిటి మండలం రాజపురం గ్రామానికి సీఎం రానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 66 మంది డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్న 25 మంది డీటీలు, రీసర్వే డీటీలు 26 మంది, ఎన్నికల డీటీలు నలుగురు, ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న డీటీలు ఐదుగురు, డీఎస్వో కార్యాలయంలో పనిచేస్తున్న ఆరుగుర్ని బదిలీచేశారు. అలాగే 17 మంది వీఆర్వోలు బదిలీ అయ్యారు.
Sorry, no posts matched your criteria.