India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేవనకొండ మాజీ జడ్పీటీసీ సభ్యులు కోట్ల హరి చక్రపాణి రెడ్డి ఐదేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఆలూరు నియోజకవర్గంలో ప్రాధాన్యత నెలకొంది. 12న తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. కోట్ల హరికి ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
విశాఖ తొట్లకొండ బీచ్ రోడ్డులో జరిగిన <<13024927>>రోడ్డు ప్రమాదంలో<<>> మృతిచెందిన వారి వివరాలు వెల్లడయ్యాయి. చింతపల్లి వీరభద్ర అనే యువకుడు భీమిలి నుంచి బైక్పై విశాఖ వెళ్తున్నాడు. అదే సమయంలో రుషికొండకు చెందిన దౌలపల్లి చిన అప్పలరాజు రుషికొండ నుంచి ఉప్పాడ వైపు బైకుపై వస్తున్నాడు. వంతెన పాడైన కారణంగా వన్ వే దారిలో ఎదురెదురుగా వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం వాటిల్లింది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రంజాన్ రోజున రోజు తీవ్ర విషాదం నెలకొంది. గూడూరు నియోజకవర్గం కోట పట్టణానికి చెందిన SK ఉమర్ బీటెక్ చదువుతున్నాడు. ఇవాళ చికెన్ దుకాణంలో పనికి వెళ్లాడు. ఈక్రమంలో అతనికి కరెంట్ షాక్ తగలడంతో చనిపోయాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సంబల్పూర్ డివిజన్లో సబ్ వే పనులు జరుగుతున్న కారణంగా ఈనెల 13న టాటా నుంచి బయలుదేరే టాటా ఎర్నాకులం ట్రైన్, నాలుగు గంటల ఆలస్యంగా బయలుదేరుతుందని వాల్తేర్ రైల్వే డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఈనెల 13 ఉదయం 5.15 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్ నాలుగు గంటల ఆలస్యంగా 9.15 గంటలకు బయలుదేరుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని ఆయన కోరారు.
ఉమ్మడి తూ.గో జిల్లా వ్యాప్తంగా భానుడి భగభగలతో ప్రజలు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో కొన్నిచోట్ల 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉదయం 10 గంటలకే ప్రజలు ఇండ్లకు పరిమితమవుతున్నారు. దీనికి తోడు వడగాల్పులు కూడా మొదలవ్వడంతో బయటకు రావడానికి జంకుతున్నారు. వృద్ధులు, పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండల తీవ్రతకు నగరంలోని పలు ప్రధాన కూడళ్లతో పాటు వీధులూ నిర్మానుష్యమయ్యాయి.
గోరఖ్పూర్ స్పెషల్ రైలును రేపటి నుంచి కుప్పం మీదుగా నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కుప్పం మీదుగా కాట్పాడి, రేణిగుంట, విజయవాడ, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస మీదుగా గోరఖ్పూర్ చేరుకుంటుంది. ఇదే మార్గంలో సోమవారం సాయంత్రం 5.40గంటలకు కుప్పం మీదుగా బెంగళూరు కృష్ణరాజపురానికి వెళ్తుంది. 6 వారాలు మాత్రమే ఈ స్పెషల్ రైలు నడవనుంది.
ఆంక్షలతో నెల్లూరు జిల్లాలో కొన్నిచోట్ల సాయంత్రానికే మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 271 షాపులు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్లో ఒకరోజులో ఎంత మొత్తం మద్యం విక్రయించారో.. ప్రస్తుతం కూడా రోజుకు అంతే విక్రయించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఉదయం 11 గంటలకు తెరుచుకుంటున్న షాపుల్లో సాయంత్రానికే టార్గెట్ పూర్తి కావడంతో మూతపడుతున్నాయి. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.
కర్నూలులో గురువారం రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. నగరంలోని ఆయా మసీదుల దగ్గరకు ముస్లింలు చేరుకొని ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని సమైక్యత భావాన్ని చాటుకున్నారు. రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో పాత సంతోష్ నగర్లోని కొత్త ఈద్గా వద్ద చిన్నారుల రంజాన్ ప్రార్థనలు పలువురిని ఆకట్టుకున్నాయి.
అనుమానాస్పద స్థితిలో ఉపాధి హామీ ఉద్యోగి మృతి చెందిన ఘటన మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. పాచిపెంట మండల కేంద్రానికి చెందిన డోలా శంకరరావు పాచిపెంట ఉపాధి హామీలో టెక్నీకల్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం పారమ్మకొండ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న కాలువ దగ్గర అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
‘సినిమాల్లో నటించండి. రాజకీయాల్లో నటించకండి ప్లీజ్..’ అంటూ పవన్పై ముద్రగడ పద్మనాభం సెటైర్స్ వేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన కాపు ఆత్మీయ సమావేశంలో గురువారం ముద్రగడ మాట్లాడుతూ.. పవన్ రాజకీయాల్లో నటించి యువతను పాడు చేయొద్దని అన్నారు. అధికారంలోకి వస్తే స్వచ్ఛ నీరు ఇస్తామని కాకుండా స్వచ్ఛ సారా అందిస్తామనడమేంటని ప్రశ్నించారు. పవన్ తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఉంటే బాగుంటుందని ముద్రగడ అన్నారు.
Sorry, no posts matched your criteria.