India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తల్లిదండ్రుల కళ్ల ఎదుటే ఓ యువకుడు చనిపోయిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. బైరెడ్డిపల్లె(M) రామనపల్లికి చెందిన జయప్ప కుమారుడు యాదగిరి(26) MBA చదివి బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఉగాది సందర్భంగా ఇంటికి వచ్చాడు. నిన్న ఉదయం పశువులకు మేత వేసి ఇంట్లోకి వచ్చాడు. తల్లిదండ్రులతో ఒంట్లో బాగోలేదని కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు తెలిపారు.
ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు రికార్డు స్థాయిలో మూల్యాంకనం పూర్తయిన వారం రోజుల లోపే విడుదల కానున్నాయి. అయితే పరీక్షలు నిరాటంకంగా జరిపించిన అధ్యాపకుల సేవలు మాత్రం ఇంటర్ బోర్డు విస్మరించిందని అధ్యాపకులు వాపోతున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ప్రాక్టికల్స్ రెమ్యూనరేషన్ గానీ, మార్చిలో జరిగిన పరీక్షల ఇన్విజిలేషన్ రెమ్యూనరేషన్ గానీ అనంతరం జరిగిన పేపర్ల మూల్యాంకనం రెమ్యూనరేషన్ గానీ తమకి అందకపోవడం దారుణమని అంటున్నారు.
12, 13వ తేదీ కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి బస్సు యాత్ర షెడ్యూల్ విడుదలైంది.
12వ తేదీ వేంపల్లి, వేముల, పులివెందుల, లింగాల, సింహాద్రిపురం మండలాల్లో బస్సు యాత్ర సాగనుంది. అనంతరం పులివెందుల పూలంగళ్ళో మీటింగ్ నిర్వహించనున్నారు.
13వ తేదీ ఎర్రగుంట్ల, ముద్దనూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో బస్సు యాత్రను షర్మిల చేపట్టనున్నారు.
చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి నెల్లూరు రూరల్ మండలం కలివెలపాళేనికి చెందిన వారు. NRI అయిన ఆయన జనసేన ఆవిర్భావంలోనే పార్టీలో చేరారు. కీలక విభాగమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిన మనుక్రాంత్ ఈ ఎన్నికల్లో సిటీ సీటు ఆశించారు. కీలకనేతగా ఉన్నా కేడర్ తో కనెక్ట్ కాలేకపోయారని విమర్శలు ఉన్నాయి.
2024-25 ఏడాదికి గానూ రాష్ట్రంలో ఉన్న 164 ఏపీ ఆదర్శ పాఠశాల(మోడల్ స్కూల్)ల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 21న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు.
అచ్చుతాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఢీకొన్న ఘటనలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అచ్చుతాపురం-ఎలమంచిలి రోడ్డులో బైక్పై వెళుతున్న దుప్పుతురుకి చెందిన గొల్లపల్లి శేఖర్, అమలతో పాటు మరో వ్యక్తి మృతిచెందాడు. లారీ చక్రాల కింద మృతదేహం నుజ్జునుజ్జవ్వడంతో అతడి వివరాలు గుర్తించలేకపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపడుతున్నారు.
నేడు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ బహిరంగ సభ దృష్ట్యా అమలాపురంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అమలాపురం మీదుగా వెళ్లే వాహనాలకు అమలాపురం పట్టణంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.. కాకినాడ, రాజమండ్రి, రాజోలు, పి.గన్నవరం వైపు వెళ్లే వాహనాలను వివిధ మార్గాల్లో మళ్లించామన్నారు.
తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావును టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి ఆయన సిఫార్సు లేఖ సమర్పించారు. అతడి వైఖరిపై అనుమానంతో ఈవో కార్యాలయ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు నరసింహారావును అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎండ తీవ్రతకు వన్యప్రాణులు జనావాసాల్లోకి వణ్యప్రాణులు వచ్చేస్తున్నాయి. విశాఖలోని కొండవాలు ప్రాంతాల్లో తరచూ ఈ ఘటనలు కనిపిస్తున్నాయి. విశాలాక్షి నగర్లో నిన్న ఓ కొమ్ముల దుప్పి రోడ్లపై సంచరించింది. వీటితో ప్రమాదం లేనప్పటికీ.. అధికారులు తగల చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
విశాఖ జిల్లా పరిధిలో దువ్వాడ-సింహాచలం నార్త్ మధ్య 2,4 నాల్గవ రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.2.543 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టే రైల్వే లైన్ను స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్గా గుర్తిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రైల్వే యాక్ట్ -1989లోని సెక్షన్ 2, క్లాస్-37ఏ కింద అధికారాలను ఉపయోగించి ఈ ప్రాజెక్టును స్పెషల్ ప్రాజెక్టుగా ప్రకటిస్తున్నట్లు తెలియజేసింది.
Sorry, no posts matched your criteria.