India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రీ-నాన్ -ఇంటర్లాకింగ్, నాన్ -ఇంటర్లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తునట్లు స్టేషన్ సూపరిండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. 08527 విశాఖ- రాయ్పూర్, 08528 రాయ్పూర్ -విశాఖ, 08504 విశాఖ-భవానీపట్నం ప్యాసింజర్, 18301 సంబల్పూర్ – రాయగడ, 18302 రాయగడ -సంబల్పూర్ ఇంటర్ సిటీని ఈనెల 15 నుంచి 24వ తేదీ వరకు.. 08503 భవానీపట్న-విశాఖ ప్యాసింజర్ ఈనెల 16 నుంచి 25వ వరకు రద్దు చేసినట్ల వెల్లడించారు.
యలమంచిలి మండలం చించినాడ వశిష్ఠ గోదావరి వంతెనపై నుంచి దూకి బుధవారం కుటుంబం గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భీమవరానికి చెందిన కిషోర్ కుమార్, భార్య యోచన, కుమార్తె శ్రీనిధి అమలాపురంలో ఉంటున్నారు. అయితే వీరు ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆ నిర్ణయం తీసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరి బ్యాగు, ఫోను, చించినాడ గోదావరి వంతెనపై ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర అనుసరణీయమని కలెక్టర్ డాక్టర్ జి.సృజన అన్నారు. గురువారం ఆయన జయంతిని పురస్కరించుకుని కర్నూలులోని శరీన్ నగర్లో ఉన్న పూలేతో పాటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు విశేష కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు.
ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం సమీపంలో బుధవారం శిల్పి గేదెల హరికృష్ణ నిర్మించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఈ సైకత శిల్పం చేసినట్లు ఆయన చెప్పారు. పలువురు ముస్లిం సోదరులకు తన సైకత శిల్పం ద్వారా ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. శిల్పి హరికృష్ణ నైపుణ్యాన్ని పలువురు అభినందించారు
డీఎస్సీ-2018లో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకుని, వెరిఫికేషన్ పూర్తి చేసిన పీఈటీ అభ్యర్థుల వివరాలు డీఈవో కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఉంచినట్లు డీఈవో దేవరాజు తెలిపారు. జాబితాను పరిశీలించుకుని ఏవేని అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈనెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు డీఈవో కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. గడువు తర్వాత వచ్చే అభ్యర్థనలు స్వీకరించబడవని డీఈవో స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 16.90 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాంతో పాటు అక్రమంగా తరలిస్తున్న 164 మద్యం బాటిళ్లను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణా వర్సిటీ పరిధిలో అక్టోబర్ 2023లో నిర్వహించిన ఎం-ఫార్మసీ 2వ సెమిస్టర్ పరీక్షలకు(2022- 23) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 16వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1100 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చూడవచ్చన్నారు.
కలసపాడు మండలం శంఖవరంలో బుధవారం రమణారెడ్డి అనే వ్యక్తి మెట్లపై నుంచి జారిపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శంకవరంలో చిన్న కృష్ణారెడ్డి ఇంట్లో అతని కుమారుడు చరణ్ రెడ్డితో మాట్లాడేందుకు వెళుతుండగా జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.
వారిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. ఒకే నియోజకవర్గం నుంచి ఒకరు వైసీపీ తరఫున.. మరొకరు జనసేన నుంచి పోటీ పడుతున్నారు. దక్షిణ నియోజకవర్గంలో పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దక్షిణ నియోజకవర్గానికి చెందిన వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్, అదే నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ వన్ టౌన్ ఏరియా మసీదులో ఎదురుపడటంతో ఒకరికొకరు పలకరించుకుని ఆలింగనం చేసుకున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుధవారం పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. శెట్టూరు మండలంలో అత్యధికంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పరిగిలో 40.0, బొమ్మనహాళ్ 39.8, చెన్నేకొత్తపల్లి 39.7, తాడిపత్రి 39.5, పెద్ద వడుగూరు, కొత్తచెరువు 39.2, తలుపుల, రొద్దం 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వారు తెలిపారు.
Sorry, no posts matched your criteria.