Andhra Pradesh

News April 11, 2024

విశాఖ: రైళ్లను రద్దు చేసిన అధికారులు

image

దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్లో ఈనెల 11 నుంచి 28 వరకు రోలింగ్ స్టాక్ కారిడార్ కార్యక్రమం కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 11 నుంచి 28 వరకు రాజమండ్రి నుంచి బయలుదేరే రాజమండ్రి-విశాఖ పాసింజర్ ట్రైన్ ను రద్దు చేసినట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో 11 నుంచి 28 వరకు విశాఖ నుంచి రాజమండ్రి బయలుదేరి పాసింజర్ రైలును రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

News April 11, 2024

నేడు కడపకు కొండా రాఘవరెడ్డి.. షర్మిలపై కీలక ప్రెస్ మీట్

image

వైఎస్ షర్మిల ముఖ్య అనుచరుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకుడు కొండా రాఘవరెడ్డి నేడు కడపకు రానున్నారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి షర్మిల చేసిన అన్యాయంపై కడపలో ఆయన కీలక మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ పేరిట వైఎస్ షర్మిల చేసిన మోసం అక్రమాలపై ఈరోజు నుంచి ఆయన రాష్ట్రంలో పర్యటించి ప్రజలకు తెలుపనున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు. 

News April 11, 2024

తిరుపతి: SVUలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు

image

SV యూనివర్సిటీలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది. కొన్ని రోజుల క్రితం వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అందినట్టు సమాచారం. దీంతో చర్యల కోసం ఎన్నికల కమిషన్‌ యూనివర్సిటీ అధికారులను ఆదేశించిన క్రమంలో అయ్యప్ప (డ్రైవర్‌), డాక్టర్‌ ఐఎస్‌ కిషోర్‌ మాథ్యూ అర్నాల్డ్‌ (అకడమిక్‌ కన్సల్టెంట్‌),మురళిరెడ్డి (రిజిస్ట్రార్‌ పీఎస్‌) లను సస్పెండ్‌ చేసినట్టు సమాచారం.

News April 11, 2024

ఎస్పీ కార్యాలయం ఎదుట దామచర్ల ఆందోళన

image

ఎస్పీ సుమిత్ సునీల్ కార్యాలయం ఎదుట ఒంగోలు TDP అభ్యర్థి దామచర్ల జనార్దన్ బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. నగర పరిధిలోని సమతానగర్‌లో వాలంటీర్‌తో కలిసి YCP నేతలు ప్రచారం చేస్తుండడంతో కొందరు ఫొటో తీశారు. దీనిపై రగడ జరగడంతో 37వ వార్డు టీడీపీ బాధ్యుడు మోహన్ రావు అక్కడికి వెళ్లడంతో వారంతో దాడిచేశారు. దీంతో అతడికి తీవ్ర రక్త స్రావం అయింది. టీడీపీ అభ్యర్థి జనార్దన్ ఎస్పీ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు.

News April 11, 2024

పార్వతీపురం: యువకునిపై పోక్సో కేసు 

image

బాలికను మోసం చేసి శారీరకంగా లోబరుచుకుని యువకునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై దినకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం.. పార్వతీపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన పెంటకోట ప్రవీణ్ కుమార్ మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ తెలిపారు.

News April 11, 2024

విజయవాడ పశ్చిమలో అత్యధికం, మచిలీపట్నంలో అత్యల్పం

image

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమలో అత్యధికంగా 22 మంది అభ్యర్థులు పోటీ పడగా, మచిలీపట్నంలో అత్యల్పంగా 8 మంది బరిలో నిలిచారు. జిల్లాల విభజన అనంతరం స్థానికంగా రాజకీయ పరిస్థితులు మారినందునా తాజా ఎన్నికల్లో ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యపై ఆసక్తి నెలకొంది. కాగా గత ఎన్నికల్లో పశ్చిమలో 10 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలవడం విశేషం.

News April 11, 2024

గుంటూరు మిర్చియార్డుకు నేడు సెలవు

image

రంజాన్ పండుగ సందర్భంగా గురువారం మిర్చియార్డుకు సెలవు ప్రకటించారు. ఎటువంటి క్రయవిక్రయాలు జరగవని, రైతులు దీనిని దృష్టిలో పెట్టుకొని యార్డుకు మిర్చి తీసుకురావద్దని ఇన్‌ఛార్జ్ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం యార్డులో యథావిధిగా మిర్చి విక్రయాలు జరుగుతాయని ఆయన అన్నారు. రైతులు బుధవారం 1,04,430 బస్తాలు యార్డుకు తరలించగా, అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 85,482 బస్తాలు నిల్వ ఉన్నాయి.

News April 11, 2024

ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలి: అన్నమయ్య కలెక్టర్

image

కోడూరు నియోజకవర్గంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ ప్రక్రియలను నిర్వహించాలని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కోడూరు మండలం అనంతరాజుపేటలోని ఉద్యానవన యూనివర్సిటీలో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూములను ఎస్పీతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

News April 11, 2024

పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లకు ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్ సృజన

image

పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతుల ఏర్పాట్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సృజన నోడల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో పోలింగ్ రోజున కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలపై నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

News April 11, 2024

షర్మిలతో ఆమంచి భేటీ

image

పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బెంగళూరులో కలిశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు తొలిసారిగా చీరాల అసెంబ్లీ టికెట్ ఇచ్చిన విషయాన్ని ఆయన షర్మిలకు గుర్తు చేశారు. తన చేరికకు వీలుగా చీరాల రావలసిందిగా ఆమంచి ఆహ్వానించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.