Andhra Pradesh

News April 10, 2024

విశాఖ బీచ్ రోడ్డులో ఇద్దరు యువకులు మృతి..!

image

విశాఖలోని తొట్లకొండ బీచ్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళుతూ.. రెండు బైక్‌లు ఎదురు ఎదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. గాయాలైన మరో ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఘటనకు సంబంధిచి మరన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 10, 2024

ప.గో: 2 నెలలు బంద్..కారణం ఇదే..!

image

ప.గో జిల్లాలో ఈనెల 15 నుంచి జూన్ 16 వరకు సముద్రాలలో అన్ని రకాల చేపల వేటలు నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మత్స్య శాఖ అధికారి కె.భారతి తెలిపారు. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించి వాటి సంతతిని ప్రోత్సహించడమే ఉద్దేశమన్నారు. ఉత్తర్వులు ధిక్కరించి చేపల వేటకు వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 10, 2024

దువ్వాడ మీదుగా ప్రత్యేక రైలు

image

హైదరాబాద్-కటక్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ అధికారి ఏ.కె త్రిపాఠి తెలిపారు. 07165 నంబర్ గల హైదరాబాద్-కటక్ ప్రత్యేక రైలు ఏప్రిల్ 16,23,30 తేదీల్లో ప్రతి మంగళవారం రాత్రి 8:10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 9.05 దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 9.07 బయలుదేరి సాయంత్రం 5.45 కటక్ చేరుకుంటుంది. కటక్‌లో 17,24, మే1న 07166 నంబర్ గల రైలు అందుబాటులో ఉంటుందన్నారు.

News April 10, 2024

179 మంది సెక్టార్ అధికారులతో ఎన్నికల నిర్వహణ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో 179 మంది సెక్టార్ అధికారులతో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని మడకశిర నియోజకవర్గానికి 25 మంది, హిందూపురానికి 32, పెనుకొండకు 29, పుట్టపర్తికి 26, ధర్మవరానికి 35, కదిరి నియోజకవర్గానికి 32 మంది సెక్టర్ అధికారులను నియమించామన్నారు.

News April 10, 2024

వింజమూరు: ఏఆర్ కానిస్టేబుల్ పై కేసు నమోదు

image

వింజమూరు మండలం చాకలికొండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణపై కేసు నమోదైంది. సంబంధిత అధికారుల ఫిర్యాదు మేరకు ఏఆర్ కానిస్టేబుల్ పై వింజమూరు పోలీస్టేషన్లో ఎస్సై కోటిరెడ్డి కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదనే నిబంధనను అందరు తప్పక పాటించాలని ఎన్నికల కమిషన్ సూచిస్తోంది.

News April 10, 2024

టీడీపీలో చేరిన మంత్రి అంబటి బంధువు

image

బాపట్లకు చెందిన వివేకా సర్వీస్ సొసైటీ కార్యదర్శి, మంత్రి అంబటి రాంబాబు బంధువు అంబటి మురళీకృష్ణ టీడీపీలో చేరారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మురళీకృష్ణకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబటి మురళీకృష్ణ 1989 నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. 2010 ఓదార్పు యాత్రలో వెదుళ్లపల్లిలోని తన కార్యాలయంలో వైఎస్ జగన్‌కు బస ఏర్పాటు చేశారు.

News April 10, 2024

తూ.గో: ఒక్క తునిలోనే 174 మంది మృతి

image

తూ.గో జిల్లాలో ప్రభుత్వ రైల్వే పోలీస్ శాఖ రైలు ప్రమాదాల్లో మృతుల నివేదికను వెలువరించింది. ఒక్క తుని స్టేషన్‌లోనే 2022 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 5వ వరకు 174 మంది మృతి చెందారు. అనకాపల్లి జిల్లా కశింకోట- పిఠాపురం వరకు మృతి చెందిన వారిలో 49 మంది ఎవరో కూడా తెలియకుండానే ఖననం చేశారు. ఇక మీద ప్రమాదాలు జరగకుండా రైళ్లు, ఫ్లాట్ ఫామ్‌లపై అవగాహన కల్పిస్తున్నామని తుని జీఆర్పీ ఎస్సై అబ్దుల్ మారూఫ్ తెలిపారు.

News April 10, 2024

కువైట్‌లో ఓబులవారిపల్లె వాసి మృతి

image

బతుకుతెరువు కోసం కువైట్‌కి వెళ్లి ప్రమాదశాత్తు ఓబులవారిపల్లెకు చెందిన ఓబిలి సుబ్బ నరసింహారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఈయన కొన్నేళ్లుగా కువైట్‌లో క్రేన్ దగ్గర ఉద్యోగరీత్యా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారు. డ్యూటీకి వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఇసుక లారీ వ్యాన్‌ను ఢీకొనడంతో వెనుక భాగంలో ఉన్న ఇతను అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

News April 10, 2024

మదనపల్లె: ఇరు వర్గాల ఘర్షణలో ఇద్దరికి గాయాలు

image

మద్యం మత్తులో ఆటో డ్రైవర్లు గొడవపడి గాయపడ్డ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితులు వివరాల ప్రకారం.. మదనపల్లె మోతినగర్లో ఆటో నడిపే ఖాజా(50), రెడ్డెప్ప(52)లు కలసి మిషన్ కాంపౌండ్ వద్ద మద్యం తాగారు. అనంతరం ఇంటికివచ్చే క్రమంలో ఇద్దరు గొడవపడి ఒకరి నొకరు కొట్టుకున్నారు. ఈగొడవలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని, సహచరులు గమనించి వెంటనే స్థానిక జిల్లాఆస్పత్రికి తరలించారు.

News April 10, 2024

అనంత: పోలింగ్‌కు 24 వేల మంది సిబ్బంది

image

పోలింగ్‌కు అన్ని కేడర్ల అధికారులు, సిబ్బంది కలిపి దాదాపు 24 వేల మందిని నియమించారు. పీఓలు 2,552, ఏపీఓలు 2,715, ఓపీఓలు 9 వేలకు పైగా, పోలీసు సిబ్బంది 3,500, ఎన్నికల నిర్వహణ కమిటీల సిబ్బంది 570, నోడల్ అధికారులు 33 మంది, సెక్టార్ అధికారులు 481 మంది ఉన్నారు. వివిధ స్థాయిల్లో 33 శాఖలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించారు.