Andhra Pradesh

News August 24, 2025

విశాఖలో ఉదయాన్నే యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

విశాఖలో ఆదివారం ఉదయాన్నే రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద గంట్యాడ నుంచి గంగవరానికి వెళ్లే దారిలో కొంగపాలెం జంక్షన్ వద్ద నడిచి వెళ్తున్న వ్యక్తిని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యక్తి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న న్యూ పోర్టు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 24, 2025

కర్నూలు: ఒకే ఇంట్లో ముగ్గురికి టీచర్ ఉద్యోగాలు

image

కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామానికి చెందిన మన్సూర్ బాషా, జిలాని బేగం దంపతులకు చెందిన ముగ్గురు పిల్లలు డీఎస్పీ మెరిట్ లిస్టులో ఉద్యోగాలు సాధించారు. మొహమ్మద్ హనీఫ్ 79.67, హసీనా బాను 81.62, హరూన్ రషీద్ 84.11 మార్కులతో ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరిని గ్రామస్థులు అభినందించారు. తమ తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కష్టం వృథా కాలేదని పిల్లలు పేర్కొన్నారు.

News August 24, 2025

కడప: భార్యాభర్తకు టీచర్ ఉద్యోగాలు

image

DSCలో కడప జిల్లా కాశినాయన మండలం రెడ్డికొట్టాలకు చెందిన దంపతులు సత్తాచాటారు. అంబవరం శేఖర్ 10వ ర్యాంకుతో ప్రిన్సిపల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆయన భార్య తేజస్వి SGTలో 317వ ర్యాంకు సాధించారు. శేఖర్ ప్రస్తుతం అన్నమయ్య జిల్లా గ్యారంపల్లి APRJCలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఒకేసారి భార్యాభర్తకు ఉద్యోగాలు రావడంతో ఆ కుటుంబంలో సంతోషం అంబారన్ని అంటింది.

News August 24, 2025

చిత్తూరులో నేటి చికెన్ ధరలు…

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.105, మాంసం రూ.152 పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.173 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.200 చొప్పున పలు దుకాణాల్లో అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News August 24, 2025

కృత్తివెన్ను: ఇద్దరి యువకులపై పోక్సో కేసు

image

కృత్తివెన్ను మండలంలో మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడితో పాటు అతనికి సహకరించిన మరొక యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పైడిబాబు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం ఇద్దరు యువకులను రిమాండ్‌కు తరలించినామని చెప్పారు. 18 సంవత్సరాలలోపు ఉన్న బాలికలను ప్రేమ పేరుతో వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News August 24, 2025

యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

రాజమండ్రిలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

News August 24, 2025

గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

గుంటూరులో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.180, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ.160గా విక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఈ ధరలు కొన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో చికెన్‌కి ఉన్న డిమాండ్‌ని బట్టి రూ. 20 నుంచి రూ. 30 వ్యత్యాసం ఉంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News August 24, 2025

జలమూరు: శిథిలస్థితికి ఏళ్ల చరిత్ర గల ఆలయం..కాపాడాలని వినతి

image

దక్షిణ కాశీగా శ్రీ ముఖలింగేశ్వర ఆలయం పేరుగాంచింది. ఈ దేవాలయంలోని శిల్ప సంపదను కాపాడాలని అర్చకుడు రాజశేఖర్ మాన్యుమెంట్ అథారిటీ ఛైర్మన్‌ను శనివారం ఢిల్లీలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయంలోని పురాతన శాసనాలు, కట్టడాలు పెచ్చులూడి శిథిలమవుతున్నాయని వివరించారు. అభివృద్ధికి చేసేందుకు అడుగులు వేయాలని ఆయను కోరారు. దీనిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని రాజశేఖర్ తెలిపారు.

News August 24, 2025

DCSలో ఉద్యోగాల సాధించిన అన్నదమ్ములు

image

ఉదయగిరిలోని దిలార్ బావి వీధి వీధికి చెందిన అన్నదమ్ములు టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. షేక్ నస్రుల్లా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ సబ్జెక్టులో 57వ ర్యాంకు సాధించగా, ఆయన సోదరుడు షేక్ సిగ్బతుల్లా పీఈటీ జోనల్-3 జనరల్ విభాగంలో 179 వ ర్యాంకు, బీసీఈలో 1వ ర్యాంకు సాధించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నస్రుల్లా ప్రస్తుతం దుత్తలూరు మండలం వెంకటంపేట యూపీ స్కూల్లో SGTగా పనిచేస్తున్నారు.

News August 24, 2025

కుటుంబానికి నాలుగేళ్ల దూరం.. ఫలితంగా 3 ఉద్యోగాలు

image

పెనుమూరు మండలం కత్తిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుజాత DSC SA తెలుగులో 85.29 మార్కులతో ఓసీ కేటగిరిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచారు. అలాగే TGTలో 76.86 మార్కులతో 16వ స్థానం, పీజీటీలో 78 మార్కులు సాధించి 21వ ర్యాంకు సాధించారు. ఈమెనాలుగేళ్లుగా పిల్లల్ని, కుటుంబాన్ని వదిలి నంద్యాలలో కోచింగ్ తీసుకుంటున్నారు. నాలుగేళ్ల కష్టానికి ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.