Andhra Pradesh

News April 9, 2024

SKLM: ఉగాది ఎఫెక్ట్.. బంగారం షాపులు కిటకిట

image

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంతో పాటు నరసన్నపేట, పలాస, ఇతర ప్రాంతాల్లో బంగారం దుకాణాలు కళకళలాడాయి. పసిడి ధరలు పరుగులు పెడుతున్నా ఏమాత్రం వెనుకాడకుండా బంగారం, ఆభరణాలు, వెండి వస్తువులు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపారు. తెలుగు వారు చేసుకునే తొలి పండుగ ఉగాది. ఉగాది రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే ఏడాది పొడవునా అదే తరహాలో కొనుగోలు చేస్తుంటారని ఒక నమ్మకం.

News April 9, 2024

తిరుపతి MP అభ్యర్థిగా చింతామోహన్

image

కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ చింతామోహన్‌ను అధిష్ఠానం ఖరారు చేసింది. ఆయన ఇప్పటి వరకు 6 సార్లు తిరుపతి ఎంపీగా గెలిచారు. అలాగే ఇటీవల వైసీపీని వీడి హస్తం గూటికి చేరిన MS బాబుకు పూతలపట్టు MLA టికెట్ దక్కింది. ఆయన 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయనకు వైసీపీ టికెట్ నిరాకరించడంతో పార్టీ మారారు. జీడీనెల్లూరు కాంగ్రెస్ MLA అభ్యర్థిగా రమేశ్ బాబు పోటీ చేయనున్నారు.

News April 9, 2024

నరసాపురం MLA అభ్యర్థిగా రామచంద్ర యాదవ్

image

భారత చైతన్య యువజన పార్టీ మొదటి జాబితాను ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆకుల వెంకటస్వామికి టికెట్ కేటాయించారు. ప్రముఖ న్యాయవాదిగా, మాజీ కౌన్సిలర్‌గా పని చేశారు. జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులుగా, నరసాపురం పార్లమెంటరీ కో-ఆర్డినేటర్‌గా పనిచేసి రాజీనామా చేశారు.

News April 9, 2024

VZM: దండూరమ్మ ఉత్సవాలలో ఉమ్మడి జిల్లా ఎస్పీలు

image

విజయనగరం పట్టణంలో వెలసిన శ్రీ దేవీ దండుమారమ్మ దేవాలయంలో అమ్మవారి ఉత్సవాలను ఏప్రిల్ 9 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం విజయనగరం జిల్లా ఎస్పీ ఎం. దీపికా పాటిల్, మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దంపతులు పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఎస్పీ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

News April 9, 2024

కడప: ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

image

కడప జిల్లాలో ఉగాది రోజు విషాదం నెలకొంది. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద ఈతకు వెళ్లిన వ్యక్తి మృతిచెందాడు. కడపకు చెందిన డేవిడ్ నలుగురు స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఆనకట్ట వద్దకు వచ్చాడు. ఈత కొట్టే క్రమంలో నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు మృతదేహాన్ని వెలికి తీశారు. వల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

News April 9, 2024

జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా తుమ్మల రామస్వామి

image

జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా తుమ్మల రామస్వామి (బాబు) నియమితులయ్యారు. పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న రామస్వామికి టికెట్‌ దక్కపోవడంతో ఆయనను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జగ్గంపేట నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా ఉన్న పాఠంశెట్టి సూర్యచంద్రను తొలగించి.. తుమ్మలపల్లి రమేశ్‌ను నియమించారు. కాకినాడ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కమిటీ కార్యదర్శిగా తోట సుధీర్ నియమితులయ్యారు.

News April 9, 2024

KNL: BCY పార్టీ అభ్యర్థులు వీరే

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాలకు భారత చైతన్య యువజన పార్టీ(BCY) తరఫున MLA అభ్యర్థులను ఆ పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ ప్రకటించారు. మిగిలిన 10 స్థానాలకు కూడా త్వరలో MLA, నంద్యాల, కర్నూలు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. నంద్యాల – చింతలపల్లె సుధాకర రావు, డోన్- తరి గోపుల, బాలసుబ్బయ్య (బాలు యాదవ్) పత్తికొండ – మిద్దె వెంకటేశ్వర్లు ఆలూరు – మోహన్ ప్రసాద్ పేర్లను ఖరారు చేశారు.

News April 9, 2024

పైడిబీమవరంలో రూ. 6,75,000 స్వాధీనం

image

రణస్థలం మండలంలోని పైడిభీమవరం చెక్‌పోస్ట్ వద్ద ఎటువంటి రసీదులు, ఆధారాలు లేని వ్యక్తి నుంచి రూ.6,75,000 జేఆర్ పురం ఎస్సై కే. గోవిందరావు, ఎస్సై ఉమామహేశ్ పట్టుకున్నారు. ఆ వ్యక్తి అనపర్తి నుంచి కోటబొమ్మాళికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుకున్న నగదును ఆర్వోకు అందజేశామని ఎస్సై తెలిపారు. సంబంధిత రసీదులు అందజేస్తే నగదు అందజేస్తామని తెలిపారు.

News April 9, 2024

అనంత: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

image

పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామంలో మంగళవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న పుల్లన్న పొరపాటున మద్యంలో పురుగు మందు కలుపుకొని తాగినట్లు సమాచారం. అయితే తాగిన గంటలోనే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పెద్దవడుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 9, 2024

కాకుమాను: వైసీపీ ర్యాలీలో పాల్గొన్న వాలంటీర్‌ తొలగింపు

image

కాకుమాను గ్రామ సచివాలయం-2లో వాలంటీర్‌గా పనిచేస్తున్న స్వాంగ రత్న కిషోర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, వైసీపీ సంబంధించిన ర్యాలీలో మంగళవారం పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి.. పార్టీ ర్యాలీలో పాల్గొన్న వాలంటీర్‌ను తొలగించామని కాకుమాను పంచాయతీ కార్యదర్శి నివేదిక సమర్పించారు. వాలంటీర్‌ను విధుల నుంచి ఎంపీడీఓ తొలగించారు.