Andhra Pradesh

News April 9, 2024

శ్రీకాకుళం: 98.98 శాతం పింఛన్లు పంపిణీ పూర్తి

image

శ్రీకాకుళం జిల్లాలో సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ ప్రక్రియ సోమవారం నాటికి 98.98 శాతం పూర్తయింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రక్రియను చేపట్టారు. పింఛన్లు పంపిణీ ప్రత్యేక కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా 732 గ్రామ వార్డు సచివాలయాల్లో పంపిణీ పూర్తి చేశారు. జిల్లాలో 3,21, 689 మంది గాను 3,18,392 పింఛన్లు పంపిణీ చేశామని డీఆర్డిఏ పీడీ తెలిపారు.

News April 9, 2024

ప్రకాశం: 70 మంది ఎన్నికల సిబ్బందికి నోటీసులు

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రిసైడింగ్, ఏపీవోలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండో విడతలో 70 మంది అధికారులు నియామక ఉత్తర్వులు అందుకుని శిక్షణకు గైర్హాజరు అయ్యారు. వారందరికీ జిల్లా ఎన్నికల అధికారి దినేశ్ కుమార్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సెలవు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News April 9, 2024

తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు: కలెక్టర్

image

పుట్టపర్తి టౌన్ క్రోధినామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ఈ ఉగాది అందరి జీవితాల్లో ఉషస్సులు నింపాలని కలెక్టర్ అరుణ్బాబు, ఆకాంక్షించారు. క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీస్, జిల్లా యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కొత్త ఆలోచనలతో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని పిలుపునిచ్చారు. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.

News April 9, 2024

విశాఖ: ముగిసిన టెన్త్ మూల్యాంకనం

image

టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకనం సోమవారంతో ముగిసింది. ఈనెల ఒకటో తేదీన జ్ఞానాపురం జూబ్లీ హైస్కూలులో మూల్యాంకనం ప్రారంభమైంది. ఎనిమిది రోజుల్లో మొత్తం 1,76,924 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. అత్యధికంగా ఇంగ్లిష్‌ సబ్జెక్టు సంబంధించి 29 వేలు, సోషల్‌ స్టడీస్‌లో 28 వేల పత్రాలు జిల్లాకు వచ్చాయి. మూల్యాంకనం కోసం 104 మంది చీఫ్‌ ఎగ్జామినర్లు, 624 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, 208 మంది సహాయకులు పనిచేసారు.

News April 9, 2024

కృష్ణా: పీజీ, ఎం-ఫార్మసీ పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో కింది కోర్సులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
☞ పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ)- 3వ సెమిస్టర్
☞ ఎం- ఫార్మసీ- 2వ సెమిస్టర్

News April 9, 2024

కడప జిల్లాలో YCP కీలక నేత రాజీనామా

image

కడప జిల్లాలో వైసీపీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ ఖాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు రాజీనామా పత్రాన్ని పంపించారు. ఎమ్మెల్యే సీటు ఇస్తానన్న హామీని ముఖ్యమంత్రి మరిచారని అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. కనీసం కలవడానికి కూడా తనకు జిల్లా నాయకులు అపాయింట్మెంట్ ఇప్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

News April 9, 2024

పలమనేరు: తాళిబొట్టుతో మాంత్రికుడు పరార్

image

పలమనేరు పట్టణ పరిధిలోని గంటావూరు కాలనీలో ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చి మనశ్శాంతి ఉండేలా చేయాలని జ్యోతి కర్ణాటక ప్రాంతంలోని ఓ మాంత్రికుడ్ని ఆశ్రయించారు. మాంత్రికుడు ఇంటికి వచ్చి ఆమె మెడలోని తాళిబొట్టుకు పూజలు చేయాలని తీసుకున్నాడు. ఒక చెంబులో ఉంచి పూజలు చేశాడు. రోజంతా దేవుని చిత్రపటం వద్ద ఉంచాలన్నాడు. చెంబు తెరిచి చూడగా అందులో 20 గ్రాముల బంగారు తాళిబొట్టు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News April 9, 2024

విజయనగరంలో రూ.9.30 లక్షల వెండి సీజ్

image

విజయనగరం పట్టణంలోని గంట స్తంభం సమీపంలో సోమవారం ఎటువంటి పత్రాలు లేకుండా ఓ వ్యక్తి వద్ద ఉన్న 14.405 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని 1వ పట్టణ సీఐ వెంకట్రావు తెలిపారు. వెండి వస్తువులకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో తదుపరి చర్యల నిమిత్తం తహశీల్దార్‌కు అప్పగించామని చెప్పారు. సీజ్ చేసిన వెండి వస్తువుల విలువ సుమారు రూ.9.30 లక్షలు ఉంటుందని తెలిపారు.

News April 9, 2024

కంచిలి: చెరువులో పడి వ్యక్తి మృతి

image

కంచిలి మండల కేంద్రంలో మటన్ చెరువులో సోమవారం ప్రమాదవశాత్తు మునిగి బుడ్డేపు నీలాద్రి మరణించాడు. మృతుడు, అతని భార్య జానకి కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. బహిర్భూమికి కోసం వెళ్లిన నీలాద్రి చెరువులో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కంచిలి ఎస్సై జి. రాజేష్ తెలిపారు.

News April 9, 2024

TDP ప్రచారంలో AR కానిస్టేబుల్

image

నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం చాకలికొండలో టీడీపీ ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేశ్‌కు మద్దతుగా ప్రచారం జరిగింది. ఇందులో ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వం ద్వారా జీతం తీసుకునే ఏ ఒక్కరూ ప్రచారాల్లో పాల్గొన వద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయినప్పటికీ కొందరు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. బాలకృష్ణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గన్‌మెన్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.