Andhra Pradesh

News April 9, 2024

కలపర్రు టోల్ గేట్ వద్ద పట్టుబడ్డ ఆభరణాల వివరాలు

image

పెదపాడు మండలం కలపర్రు టోల్ గేటు వద్ద సోమవారం పట్టుబడిన నగదు వివరాలను అధికారులు వెల్లడించారు. ఒక వాహనంలో రూ.15,52,300 నగదు మరో వాహనంలో 16.528 కేజీల బంగారు ఆభరణములు, 31.042 కేజీల వెండి ఉందన్నారు. నగదు, ఆభరణాలకు సంబంధించిన యజమానులు సరైన పత్రాలను జిల్లా త్రిసభ్య కమిటీ వారికి సమర్పించాలన్నారు. పరిశీలించిన తర్వాత నగదు, ఆభరణాలు తిరిగి అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

News April 9, 2024

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి:కలెక్టర్

image

ఎన్నికల విధుల్లో వైఫల్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ హెచ్చరించారు. సోమవారం మన్యం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి సంసిద్ధత ఉండాలన్నారు. వచ్చే పది రోజులు కీలకమని, ప్రతి అంశంపై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై వచ్చే ప్రతి అంశాన్ని పరిశీలించాలన్నారు.

News April 9, 2024

నంద్యాల: వడగాల్పులపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్రీనివాసులు సూచించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధి కూలీలు ఎండ తీవ్రత పట్ల జాగ్రత్తగా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. ప్రధాన కూడళ్ళలో చలువ పందిళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసరమైన ప్రదేశాలలో వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

News April 9, 2024

ఎన్నికల శిక్షణకు ప్రతి ఒక్కరూ తప్పక హాజరు కావాలి:

image

శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్‌కు హాజరైన ప్రతి ఒక్కరితో పాటు మినహాయింపు పొందిన వారు కూడా ఎన్నికల శిక్షణకు తప్పక హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల వద్ద జరిగే శిక్షణకు కచ్చితంగా హాజరుకావాలన్నారు. హాజరు కాని వారిపై ఎన్నికల నియమ నిబంధనలు ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

News April 9, 2024

విశాఖ: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అరుదైన గుర్తింపు

image

ఏయూకి ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్-2024, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్-2024లో స్థానం లభించింది. ఈ మేరకు సంస్థ దానికి సంబంధించిన సర్టిఫికేట్, మెడల్, పుస్తకాలను పంపింది. ఫిబ్రవరి 6వ తేదీన ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో 60 వేల మంది ప్రజలు కలిసి చేంజ్ ఫ్రం హ్యూమన్ బీయింగ్ టు భీయింగ్ హ్యూమన్ ప్రతిజ్ఞ చేయడాన్ని గుర్తిస్తూ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించినట్లు వీసీ తెలిపారు.

News April 9, 2024

నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు:కలెక్టర్

image

నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. విజయవాడ నుంచి సోమవారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. నీటి సమస్యలు కోసం జిల్లాలో కంట్రోల్ రూమ్ నెంబర్లను 91001 20602, 63099 00660 ఏర్పాటు చేశామన్నారు.

News April 9, 2024

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఏలూరు కలెక్టర్

image

ఏలూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది అంతా జిల్లా ప్రజలకు శుభాలు కలగాలని, ప్రతిఒక్కరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిచారు. పండుగను సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.

News April 9, 2024

వడదెబ్బ నుంచి రక్షణకు చర్యలు చేపట్టండి: కలెక్టర్

image

ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ నగరంలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అవసరం లేకుండా రోడ్లపైకి రావద్దన్నారు. బయటకు వచ్చే ముందు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వడదెబ్బ సూచనలు కనిపిస్తే సమీపములోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందాలన్నారు.

News April 9, 2024

నరసరావుపేట ఎన్నికలలో బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్

image

రానున్న సార్వత్రిక ఎన్నికలలో పీఓలు భయంతో కాకుండా బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో పిఓలు, ఏఎల్ఎంటీలకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పోలింగ్ జరిగే రోజున జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఎదురైతే చాకచక్యంగా వ్యవహరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు.

News April 9, 2024

రాజుపాలెం: 46 మంది వాలంటీర్లు రాజీనామా

image

రాజుపాలెం మండలంలోని టంగుటూరు, వెలవలి, వెంగళయపల్లి, కుమ్మరపల్లె, పర్లపాడు, గోపల్లె గ్రామాల్లోని సచివాలయాలకు చెందిన 46 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. సోమవారం వారు ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులకు రాజీనామా పత్రాలను అందించారు. వారు మాట్లాడుతూ.. తమను పింఛన్లను పంపిణీ చేయకుండా కొందరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారన్నారు. తామంతా రాజీనామా చేసి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేస్తామన్నారు.