Andhra Pradesh

News September 19, 2024

ప్రకాశం జిల్లా యువకులకు గమనిక

image

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం ఎందరో యువకులు ఎదురు చూస్తున్నారు. వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కడప నగరంలో నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఈ మేరకు కడప మున్సిపల్ స్టేడియంలో అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లా యువకులు సైతం ఇందులో పాల్గొనవచ్చు. మరి ర్యాలీకి మీరు సిద్ధమా..?

News September 19, 2024

CM సహాయనిధికి చంద్రగిరి మాజీ MLA రూ.2 కోట్లు విరాళం

image

వరద బాధితుల సహాయార్థం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే గల్లా అరుణ కుమారి ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు కోట్లు ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహాయ చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబీకులు పాల్గొన్నారు.

News September 19, 2024

ఉండ్రాజవరం: కత్తెరతో భర్తను హత్య చేసిన భార్య

image

ఉండ్రాజవరం మండలం శివారు రెడ్డి చెరువులో శ్రీనివాసరావు (41) పై భార్య రాణి కత్తెరతో దాడి చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను బుధవారం మృతి చెందాడని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. అనుమానంతో భార్యని నిలదీయడంతో రెండు నెలల నుంచి వీరి మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయన్నారు. ఈ విషయమై ఘర్షణ తలెత్తడంతో మంగళవారం రాత్రి రాణి తన భర్త గుండెల్లో కత్తెరతో పొడవగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.

News September 19, 2024

కర్నూలు: నేటి నుంచే ఇసుక అమ్మకాలు ప్రారంభం

image

కర్నూలు జిల్లాలో ఇసుక ఆన్లైన్ అమ్మకాలు ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి ప్రారంభమవుతాయని గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ డీడీ రాజశేఖర్ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక బుకింగ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. ఇసుక కొనుగోలుదారులు తహశీల్దారు కార్యాలయాలు, సచివాలయాల్లో బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపారు.

News September 19, 2024

నెల్లూరు: భార్యతో గొడవ.. భర్త సూసైడ్

image

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పెళ్లకూరు మండలంలో చోటుచేసుకుంది. సీఐ సంగమేశ్వరరావు వివరాలు ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన చంద్రశేఖర్ మెగా కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో వారు ఫొన్లో రోజూ గొడవపడేవారు. రాజుపాళెం అటవీప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ మునుస్వామి తెలిపారు.

News September 19, 2024

నెల్లూరు జిల్లాలో పార్వతీపురం వాసి సూసైడ్

image

నెల్లూరు జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లా వాసి సూసైడ్ చేసుకున్నాడు. పెళ్లకూరు మండలం రాజుపాలెం అటవీ ప్రాంతంలో చంద్రశేఖర్ వేప చెట్టుకు ఉరేసుకుని ఉండడాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు. నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వర రావు వివరాలు ప్రకారం.. చంద్రశేఖర్ మెగా కంపెనీలో పని చేస్తూ పెళ్లకూరు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. భార్యతో వివాదాల కారణంగా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

News September 19, 2024

శ్రీకాకుళం జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

image

శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు విషయాన్ని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ‘ఇది మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిటి మండలం రాజపురం గ్రామానికి సీఎం రానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News September 19, 2024

చిత్తూరు: 66 మంది డీటీలు ట్రాన్స్ ఫర్

image

చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 66 మంది డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్న 25 మంది డీటీలు, రీసర్వే డీటీలు 26 మంది, ఎన్నికల డీటీలు నలుగురు, ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న డీటీలు ఐదుగురు, డీఎస్వో కార్యాలయంలో పనిచేస్తున్న ఆరుగుర్ని బదిలీచేశారు. అలాగే 17 మంది వీఆర్వోలు బదిలీ అయ్యారు.

News September 19, 2024

విశాఖ: 4,972 మంది లైసెన్సులు తాత్కాలికంగా రద్దు

image

బైకర్‌లు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రాజారత్నం సూచించారు. గోపాలపట్నంలో ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్లు ధరించకుండా ప్రయాణిస్తున్న 4,972 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను మూడు నెలలపాటు తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 2 నుంచి 11వ తేదీ వరకు జరిగిన స్పెషల్ డ్రైవ్‌లో 5,543 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

News September 19, 2024

తిరుపతి: కూతురితో కీచక తండ్రి అసభ్య ప్రవర్తన

image

తన కన్న కూతురితో తన భర్త అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ భార్య పాకాల పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. తన కుమార్తె హాస్టల్లో చదువుకుంటుందని తెలిపారు. ఇటీవల ఇంటికి వచ్చిందని, ఎవరూ లేని సమయంలో తండ్రి వేధించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీఐ మద్దయ్యచారి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.