India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా వర్సిటీ పరిధిలో బీ-ఫార్మసీ విద్యార్థులు రాయాల్సిన 1,8వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 24 నుంచి మే 2వ తేదీ వరకూ నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా టైం టేబుల్, పరీక్ష కేంద్రాల పూర్తి వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
పవన్ 20 సీట్లతో ముఖ్యమంత్రి ఎలా అయిపోతారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. శనివారం తణుకులో వైసీపీ కాపు నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వస్తే పథకాలన్నీ పక్కాగా అమలు చేస్తామని చెబుతున్న చంద్రబాబునాయుడు.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదా ..?అని అడిగారు.
గజపతినగరం నియోజకవర్గంలో ఏకగ్రీవంగా గెలిచిన ఒకే ఒక్కరు పెనుమత్స సాంబశివరాజు. ఈయన గజపతినగరం నుంచి 1967లో ఇండిపెండెంట్గా గెలిచి తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు. 1972లో ఆయనకి ప్రత్యర్థి లేకపోవడంతో విజయం ఏకగ్రీవం అయ్యింది. 1978 నుంచి 2004 వరకు అప్పటి సతివాడ నియోజకవర్గం నుంచి 7సార్లు పోటీ చేయగా.. 1994 మినహా మిగిలిన 6 సార్లు విజయం సాధించారు. ఈయన వారసుడు సురేశ్ ఇప్పడు వైసీపీ నుంచి MLCగా కొనసాగుతున్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ను ఇండియా కూటమి బలపరిచిన గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా ప్రతిపాదించినట్లు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు ఆయనను ఘనంగా సత్కరించారు. కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
అద్దంకి మండలంలోని ధేనువకొండ గ్రామానికి చెందిన 17 మంది వాలంటీర్లు శనివారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అనంతరం అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చిన్న హనిమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. స్వచ్ఛందంగా ప్రజా సేవలు చేస్తుంటే తమపై రాజకీయ బురదజల్లడంతో మనస్తాపం చెంది రాజీనామా చేసే వాలంటీర్లు పేర్కొన్నారు.
పవన్ 20 సీట్లతో ముఖ్యమంత్రి ఎలా అయిపోతారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. శనివారం తణుకులో వైసీపీ కాపు నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వస్తే పథకాలన్నీ పక్కాగా అమలు చేస్తామని చెబుతున్న చంద్రబాబునాయుడు.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదా ..?అని అడిగారు.
కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన ప్రేమ జంట సూసైడ్ చేసుకుంది. ఏలేశ్వరం వాసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని పెద్దవీధికి చెందిన అశోక్(25), మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించరనే భయంతో శుక్రవారం నర్సీపట్నంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అపస్మారస్థితిలో పడి ఉండగా.. కాకినాడకు తరలించి వైద్యం అందిస్తుండగా వారిద్దరూ మృతి చెందారు. దీంతో విషాదం నెలకొంది.
ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో జారీ కానున్న నేపథ్యంలో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లును సాధ్యమైన త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. BZA నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన జిల్లా కలెక్టర్ పర్చువల్గా హాజరయ్యారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్ఠంగా అమలు పర్చాలన్నారు .
నందవరం మండలం కొత్త నదికైరవాడిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాశి అనే రైతు గుడిసె దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగింది. శనివారం మధ్యాహ్నం కాశీ భార్య ఈరమ్మ, పిల్లలు ఇంట్లో ఉండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇరుగు పొరుగు వారి సహకారంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రూ.20 వేల నగదు, ఫ్రిజ్, సామగ్రి మంటల్లో కాలిపోయిందని బాధితులు తెలిపారు.
చౌడేపల్లి మండలం చారాల గ్రామం, పరికిదోన సచివాలయ పరిధిలో సుమారు 30 మంది వాలంటీర్లు చౌడేపల్లి ఎంపీడీవోకి రాజీనామాలు సమర్పించారు. వాలంటీర్లు మాట్లాడుతూ.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్, చంద్రబాబు, పవన్, బీజేపీ నీచ రాజకీయాలకు మేము మనస్తాపం చెంది రాజీనామాలు సమర్పించామని తెలియజేశారు. సీఎం జగన్ గెలుపుకోసం పనిచేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.