India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరూ వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మీ పిలుపునిచ్చారు. దీని కోసం ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను మాత్రమే పూజించాలని ఆమె సూచించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆమె విడుదల చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఖాజావలి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తీర ప్రాంత మహిళలకు ఆర్థిక స్వావలంబన, ఉపాధి భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. సోంపేట మండలం మూలపొలం గ్రామంలో, సముద్రపు నాచుసాగు పైలట్ ప్రాజెక్ట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో శనివారం కలెక్టర్, స్థానిక మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ పద్ధతి ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చునని సీఎం చెప్పారు. కలెక్టర్, మహిళలు ఇక్కడి పరిస్థితులను సీఎంకు వివరించారు.
పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ దంపతులతో శనివారం దర్శించుకున్నారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసరావు హైకోర్టు జడ్జిను శాలువాతో సత్కరించి శ్రీ స్వామి వారి ఫోటో, తీర్థప్రసాదాలు అందజేశారు. పాలకొల్లు ప్రిన్సిపల్, సివిల్ జడ్జి షేక్ జియావుద్దీన్ పాల్గొన్నారు.
జిల్లాలో యూరియాను ఆక్వా రైతులకు మళ్లించి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. జిల్లాలో యూరియా మళ్లింపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం సాయంత్రం ఆయన పలు శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గత సంవత్సరం కంటే ఈ సీజన్లో దాదాపు 17 వేల మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా అందుబాటులో ఉంచామన్నారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీ కేవలం రైతులకే అన్నారు.
ఒంగోలులో తొలిసారిగా నిర్వహించిన సీపీఐ రాష్ట్ర మహాసభ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. 28వ రాష్ట్ర మహాసభకు ఒంగోలు వేదిక కావడంతో కొన్ని రోజులుగా జిల్లా సీపీఐ నాయకత్వం, మహాసభలను సక్సెస్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన ర్యాలీతో మహాసభ సూపర్ సక్సెస్ అంటూ జిల్లా నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. మొత్తం మీద ఒంగోలు నగరం ఎర్రజెండాలతో రెపరెపలాడింది.
చేతివృత్తుల వారిని ఆదుకునేందుకు హస్తకళలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. శనివారం రాత్రి రాజమండ్రి ఉమా రామలింగేశ్వర కల్యాణ మండపంలో జరిగిన హస్తకళా ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. హస్తకళలను ప్రోత్సహించడం మన సంస్కృతికి, కళాకారుల అభివృద్ధికి అవసరమని తెలిపారు. ఇటువంటి ప్రదర్శనలను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 29న సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడ నుంచి నేరుగా హోటల్ నోవాటెల్కు వెళ్తారు. అనంతరం V.M.R.D.A కాంప్లెక్స్లు, పర్యాటక శాఖ డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభిస్తారు. అమరావతి ఛాంపియన్షిప్ కప్ ఫైనల్ పోటీల విజేతలకు బహుమతులు అందజేసి తర్వాత ప్రో కబడ్డీ పోటీలను ప్రారంభిస్తారని జిల్లా అధికారులు శనివారం తెలిపారు.
రాజమండ్రిలో వినాయక చవితి ఉత్సవాల అనుమతుల మంజూరు కోసం సింగిల్ విండో విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్, కమిషనర్ పి. ప్రశాంతి తెలిపారు. ఉత్సవ కమిటీలు సులభంగా అనుమతులు పొందేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ఈ ప్రక్రియలో నగరపాలక సంస్థకు సహకరించాలని ఆమె ఉత్సవ కమిటీలకు విజ్ఞప్తి చేశారు.
☞ గుంటూరులో అబ్బురపరుస్తున్న 99 అడుగుల మట్టి గణపతి.
☞ వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: SP.
☞ హత్యకు గురైన ఈ తీర్పు మా బిడ్డకు ఘనమైన నివాళి.
☞ మొదటి ఐదు ర్యాంకుల్లో జిల్లా మంత్రులు.
☞ తెనాలి: నిందితుడిని పట్టించిన సీసీ కెమెరా.
☞ రాష్ట్ర స్థాయి పోటీలకు మందడం విద్యార్థి.
☞ మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన పెమ్మసాని.
జిల్లాలోని ఆయా పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పలు పాఠశాలల యాజమాన్యాలతో ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే విద్యార్థులు ర్యాగింగ్ వంటి చర్యలకు పాల్పడితే చట్టం తీసుకునే చర్యల గురించి యాజమాన్యాలు వివరించాలన్నారు.
Sorry, no posts matched your criteria.