Andhra Pradesh

News August 24, 2025

అనంతపురం JNTUకు ఆరు ISO సర్టిఫికెట్లు

image

అనంతపురం జేఎన్టీయూ ఆరు ISO సర్టిఫికెట్లు అందుకుంది. ఈ మేరకు శనివారం ISO బృంద సభ్యులు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హంచాటే సుదర్శన రావుకు అందజేశారు. వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో యూనివర్సిటీని మరింత మెరుగైన ప్రమాణాలను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, యూనివర్సిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.

News August 24, 2025

ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి: ఎస్పీ

image

ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం వెల్లడించారు. గణేశ్ మండపాలకు, ఊరేగింపులకు సింగిల్ విండో విధానంలో నిర్వాహకులు అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద ఒకరిని కాపలా ఉంచాలని, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విపరీతమైన డీజే సౌండ్‌లను అనుమతించబోమని పేర్కొన్నారు.

News August 24, 2025

కీలక మలుపు తిరిగిన కరేడు రైతు ఉద్యమం

image

రాష్ట్రంలో సంచలనం రేపిన కరేడు రైతు ఉద్యమం ఆసక్తికర మలుపు తిరిగింది. ఉలవపాడు(M) కరేడులో ఇండోసోల్ పరిశ్రమ కోసం ఇచ్చిన 4,800 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కరేడు, ఉలవపాడు, కందుకూరు తదితర ప్రాంతాలలోని 10 దేవాలయాలకు చెందిన 104.21 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్దంగా నోటిఫికేషన్‌లో చేర్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో హైకోర్టు విచారణ చేపట్టింది.

News August 24, 2025

విశాఖ: ఆర్టీసీలో డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకాలు

image

ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ ద్వారా డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకం చేపడుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి అప్పలనాయుడు శనివారం వెల్లడించారు. స్త్రీ శక్తి పథకానికి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ, మద్దిలపాలెం, గాజువాక, వాల్తేర్, స్టీల్ సిటీ, సింహాచలం, మధురవాడ డిపోలలో నియామకాలు చేపడుతున్నామని అన్నారు. ఆసక్తి గల వారు ఆయా డిపోల్లో సంప్రదించాలన్నారు.

News August 24, 2025

పాలకోడేరు పీహెచ్సీనలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు

image

పాలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎం. గీతాబాయి ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీకి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పీహెచ్సీలో సాధారణ ప్రసవం అయిన మహిళను ఆసుపత్రిలో అందుతున్న సేవలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్ గులాం రాజ్ కుమార్, స్వర్ణ నిరంజని ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు.

News August 24, 2025

‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా నిర్దేశించిన పనితీరు సూచికలను (KPI) ఎప్పటికప్పుడు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శనివారం బొమ్మూరు కలెక్టరేట్‌లో కేపీఐ లక్ష్యాలు, వాటి సాధనపై ఆమె సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలు, వాటి సాధనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలపాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.

News August 24, 2025

మట్టి గణపతిని పూజించండి: కలెక్టర్ నాగలక్ష్మీ

image

పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరూ వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మీ పిలుపునిచ్చారు. దీని కోసం ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను మాత్రమే పూజించాలని ఆమె సూచించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆమె విడుదల చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఖాజావలి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News August 24, 2025

సోంపేట: తీరప్రాంత మహిళలు ఆర్థిక స్వావలంబనకు కూటమి కృషి

image

తీర ప్రాంత మహిళలకు ఆర్థిక స్వావలంబన, ఉపాధి భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. సోంపేట మండలం మూలపొలం గ్రామంలో, సముద్రపు నాచుసాగు పైలట్ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో శనివారం కలెక్టర్, స్థానిక మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ పద్ధతి ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చునని సీఎం చెప్పారు. కలెక్టర్, మహిళలు ఇక్కడి పరిస్థితులను సీఎంకు వివరించారు.

News August 24, 2025

క్షీర రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

image

పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ దంపతులతో శనివారం దర్శించుకున్నారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసరావు హైకోర్టు జడ్జిను శాలువాతో సత్కరించి శ్రీ స్వామి వారి ఫోటో, తీర్థప్రసాదాలు అందజేశారు. పాలకొల్లు ప్రిన్సిపల్, సివిల్ జడ్జి షేక్ జియావుద్దీన్ పాల్గొన్నారు.

News August 24, 2025

యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో యూరియాను ఆక్వా రైతులకు మళ్లించి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. జిల్లాలో యూరియా మళ్లింపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం సాయంత్రం ఆయన పలు శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గత సంవత్సరం కంటే ఈ సీజన్లో దాదాపు 17 వేల మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా అందుబాటులో ఉంచామన్నారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీ కేవలం రైతులకే అన్నారు.