India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహాకవి గురజాడ వెంకట అప్పారావు 162వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో గురజాడ జయంతి ఉత్సవాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గురజాడ గృహం వద్ద ఉదయం 9 గంటలకు జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన విగ్రహానికి పూల మాలాలంకరణ చేస్తామన్నారు.
కర్నూలు వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా ఆర్.జయలక్ష్మిని నియమిస్తూ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిషనర్ విజయ సునీత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జయలక్ష్మి అనంతపురం మార్కెట్లో విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత కార్యదర్శి గోవిందును అనంతపురం బదిలీ చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ పరిశీలన ఈనెల 25వ తేదీ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఫ్రీ హోల్డ్ భూముల రీ వెరిఫికేషన్కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను దృష్టిలో ఉంచుకొని, క్షేత్రస్థాయిలో వాటిని పటిష్టంగా అమలు చేయాలన్నారు.
విజయవాడలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో కడప జిల్లా నుంచి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు జిల్లాలోని ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందరోజుల పాలనలో ప్రభుత్వం చేపట్టిన పనితీరుపై చర్చించారు.
యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ సైనికులు యువగళం పాదయాత్ర సందర్భంగా తనకు వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆ హామీ నెరవేరుస్తూ ఈ రోజు క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేశామని xలో లోకేశ్ తెలిపారు.
వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా గురువారం ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీకానున్నారు. ఈ మేరకు గురువారం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్తో చర్చలు అనంతరం ఆయన జనసేన పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.
పదో తరగతి ఉత్తీర్ణులైన, ఇంటర్ ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఉమ్మడి జిల్లాలోని ఐటీఐలో ప్రవేశం కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో మిగులు సీట్ల భర్తీకి నాలుగో విడత అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని రాజమండ్రి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రాధా రామకృష్ణన్ బుధవారం కోరారు. అభ్యర్థులు ధ్రువపత్రాలతో వెబ్సైట్ ద్వారా 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27న దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపారు.
అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు సమక్షంలో వారు టీడీపీలో చేరారు. కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు.
ఈ నెల సెప్టెంబరు 20 శుక్రవారం నాడు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు మంగళగిరి పార్టీ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీఏ సమావేశంలో మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, అదితి గజపతి, ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్సీ చిరంజీవి, తదితరులు నారా లోకేష్ తో భేటీ అయ్యి కాసేపు మాట్లాడారు. నియోజకవర్గాల తాజా పరిస్థితిని ఆయనకు వివరించారు.
Sorry, no posts matched your criteria.