Andhra Pradesh

News April 5, 2024

ప్రచారంలో విజయసాయి రెడ్డి సతీమణి

image

సార్వత్రిక ఎన్నికల పోరును అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు మించి ఇంటింటి ప్రచారం చేస్తున్నాయి. రాజకీయాలకు పరిచయమే లేని తమ కుటుంబ సభ్యులను కూడా అభ్యర్థులు ప్రచారపర్వంలోకి దించేశారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పలువురు అభ్యర్థుల వారసులు ప్రచార పర్వంలో ఉండగా, తాజాగా వైసీపీ MP అభ్యర్థి విజయసాయి రెడ్డి భార్య సునంద కూడా నెల్లూరులో ప్రచారం చేస్తున్నారు.

News April 5, 2024

చిత్తూరు: రేపు షబ్‌-ఎ-ఖదర్‌ జరుపుకోండి

image

రంజాన్‌ ఉపవాసాల చివరివారం సందర్భంగా శనివారం జిల్లాలోని ముస్లింలు షబ్‌-ఎ-ఖదర్‌ పండుగను జరుపుకోవాలని జిల్లా ప్రభుత్వ ఖాజీ కమాలుల్లా జుహూరి జునైది ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం రాత్రి ముస్లింలు భక్తి ప్రపత్తులతో సమాజ శ్రేయస్సు కోసం అల్లాను ప్రార్థించాలని కోరారు. షబ్‌-ఎ-ఖదర్‌ సందర్భంగా ధనికులైన ముస్లింలు పేదలకు కనీసం 2.2కిలోల గోధుమలు లేదా వాటికి సరిపడా ధనం వితరణ చేయాలని సూచించారు.

News April 5, 2024

కడప: బైకుపై నుంచి పడి యువకుడి మృతి

image

పోరుమామిళ్ల మండలం పరిధిలోని మల్లిరెడ్డిపల్లి మలుపు వద్ద ప్రమాదవశాత్తు స్కూటర్‌పై నుంచి పడి కవలకుంట్ల హరిజనవాడ గ్రామానికి చెందిన వెంకటయ్య మృతి చెందాడని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. పోరుమామిళ్ల నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాలైన వెంకటయ్యను పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News April 5, 2024

శ్రీగిరిపై రేపటి నుంచి ఉగాది మహోత్సవాలు

image

శ్రీశైల క్షేత్రంలో శనివారం నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజులపాటు జరిగే ఈ మహోత్సవాల్లో భ్రమరాంబ దేవికి ప్రత్యేక అలంకారాలు స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

News April 5, 2024

గుంటూరు మిర్చి యార్డుకు వరుస సెలవులు

image

గుంటూరు మిర్చియార్డుకు వరుస సెలవులు వచ్చాయి. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం సెలవు ప్రకటించారు. శని, ఆది వారాలు వారాంతపు సెలవులు కావడంతో క్రయవిక్రయాలు జరగవు.వరుస సెలవుల నేపథ్యంలో మూడు రోజుల పాటు క్రయవి క్రయాలు జరగవని, సోమవారం యథావిధిగా విక్రయాలు జరుగుతాయని ఇన్చార్జి కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు.

News April 5, 2024

గిద్దలూరు MLA అన్నా రాంబాబు పై కేసు నమోదు

image

గిద్దలూరు MLA అన్నా రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు మార్కాపురం ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ వెల్లడించారు. వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాసప్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈక్రమంలో కార్యకర్తలకు స్థానిక కాలేజీ ఎదురుగా ఉన్న మైదానంలో నిబంధనలకు విరుద్ధంగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఆర్.సంతోష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

News April 5, 2024

నెల్లూరు: CM జగన్ ఏం చెప్పనున్నారు?

image

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీరంతా ఒకప్పుడు CM జగన్‌కు నమ్మిన వ్యక్తులు. వీళ్లంతా TDP గూటికి చేరారు. ఇందులో వేమిరెడ్డి, కోటంరెడ్డి YCP అభ్యర్థులతో ఎన్నికల్లో తలపడనున్నారు. బస్సు యాత్రలో భాగంగా జగన్ నెల్లూరుకు వచ్చారు. ఇవాళ అంతా ఆయన నెల్లూరులోనే ఉంటారు. మరి ఆయా నేతలను ఎదుర్కొనేలా జగన్ ఆ పార్టీ నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో చూడాలి మరి.

News April 5, 2024

విశాఖ: 7న జూలో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు

image

ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో జాతీయ’జూ ప్రేమికుల దినోత్సవం’ ఈనెల 8వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 7వ తేదీన ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. 3 నుంచి 12 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు అన్నారు. జూలోని జంతువుల మాదిరి చిన్నారులు డ్రెస్ వేసుకుని పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.

News April 5, 2024

ఉమ్మడి అనంత జిల్లాలో పలువురు జడ్జిల బదిలీ

image

ఉమ్మడి అనంత జిల్లాలోని పలువురు జడ్జిలు బదిలీ అయ్యారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం కోర్టులో పనిచేస్తున్న ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి దీన ఒంగోలు సివిల్‌ జడ్జిగా అనంతపురం బదిలీ అయ్యారు. పెనుకొండ కోర్టులో పనిచేస్తున్న సివిల్‌ జడ్జి శంకర్రావును అనంతపురం సివిల్‌ జడ్జిగా బదిలీ చేశారు. అలాగే, బొబ్బిలిలో సివిల్‌ జడ్జిగా ఉన్న వాసుదేవన్‌ను పెనుకొండకు బదిలీ చేశారు.

News April 5, 2024

శ్రీకాకుళం: ACCIDENT.. కానిస్టేబుల్ మృతి

image

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస అవుట్ పోస్టులో జీఆర్పీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బొడ్డేపల్లి గన్నయ్య(44) గురువారం రాత్రి రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. విధుల్లో భాగంగా విజయనగరం వెళ్లి తిరిగి వస్తుండగా ఆర్టీసీ కాలనీ రోడ్డు వద్ద లారీ ఢీకొట్టగా చనిపోయారు. మృతుని భార్య ఫిర్యాదుమేరకు శ్రీకాకుళం రూరల్ ఎస్సై కేసు నమోదు చేశారు.