Andhra Pradesh

News April 4, 2024

పెనుమంట్రలో 110 మంది వాలంటీర్ల రాజీనామా

image

పెనుమంట్ర మండలంలో భారీగా వాలంటీర్లు రాజీనామా చేశారు. పెనుమంట్ర, మార్టేరు, సోమరాజు ఇల్లింద్రపర్రు, మల్లిపూడి, నెగ్గిపూడి, వెలగలేరు, ఆలమూరు తదితర గ్రామాలలో దాదాపు 110 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి సంబంధిత అధికారులకు రాజీనామా పత్రాలు అందచేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతీ విషయలో వాలంటీర్లను బూచీగా చూపిస్తున్నారని, ఈ పరిణామాలతో విసుగు చెంది రాజీనామా చేసినట్లు వారు వెల్లడించారు.

News April 4, 2024

మాజీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

image

రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీకాలం ముగిసింది. 2018 ఏప్రిల్ 3న ఆయన వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎంపీగా అనేక అంశాలు, సమస్యలపై రాజ్యసభలో గళం వినిపించారు. ప్యానల్ వైస్ ఛైర్మన్‌గా సభను కూడా నడిపించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా లోక్ సభ బరిలోకి దిగబోతున్నారు.

News April 4, 2024

పెనుమంట్ర మండలంలో బారీగా వాలంటీర్ల రాజీనామా

image

పెనుమంట్ర మండలంలో భారీగా వాలంటీర్లు రాజీనామా చేశారు. పెనుమంట్ర, మార్టేరు, సోమరాజు ఇల్లింద్రపర్రు, మల్లిపూడి, నెగ్గిపూడి, వెలగలేరు, ఆలమూరు తదితర గ్రామాలలో దాదాపు 110 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి సంబందిత అధికారులకు రాజీనామా పత్రాలు అందచేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతీ విషయలో వాలంటీర్లను బూచీగా చూపిస్తున్నారని, ఈ పరిణామాలతో విసుగు చెంది రాజీనామా చేసినట్లు వారు వెల్లడించారు.

News April 4, 2024

రాత్రి సమయంలో మరింత గస్తీ: తూ.గో ఎస్పీ

image

ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పోలీస్ స్టేషన్స్ పరిధిలో రాత్రి వేళ మరింత గస్తీని పెంచుతున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. ఆదేశాలను ఎవరైనా పట్టించుకోకుంటే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. విధుల్లో భాగంగా ఈరోజు పలు ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఆయా స్టేషన్స్ పరిధిలో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు.

News April 4, 2024

ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్

image

ఎన్నికల నిర్వహణకు అవసరమైన తగు చర్యలు తీసుకుంటామని రాజకీయ పార్టీ ప్రతినిధులకు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఫారం-6, 8లను 16 వరకు స్వీకరించి వాటిని 25వ తేదీ వరకు క్లియర్ చేస్తామన్నారు.

News April 4, 2024

చాపాడు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

కుందూ బ్రిడ్జి సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి కర్నూలులో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్ఐ కొండారెడ్డి వివరాల మేరకు.. మైదుకూరు  నానుబాలపల్లెకు చెందిన పందిటి చెంచయ్య (56) ప్రొద్దుటూరు నుంచి మైదుకూరుకు వెళుతుండగా వెనుక వైపున వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో చెంచయ్యకు బలమైన గాయాలు కాగా, చికిత్స కోసం కర్నూలుకు తరలించగా మృతి చెందినట్లు తెలిపారు.

News April 4, 2024

విజయనగరం: టీచర్లపై పెట్టిన కేసు కొట్టివేత

image

విజయనగరం జిల్లాలో 2017 జూన్ 28న టీచర్ల బదిలీల కౌన్సిలింగ్ విధానంపై ఉపాధ్యాయ సంఘాలు చేసిన కలెక్టరేట్ ఫికెటింగ్ నిర్వహించారు. దీంతో పోలీసులు ఉపాధ్యాయ సంఘ నాయకులపై కేసు నమోదు చేశారు. కోర్టులో ఆనాటి నుంచి విచారణ జరుగుతూ ఉంది. గురువారం జిల్లా జడ్జి కోర్టులో ఈ కేసును కొట్టివేసినట్లు ఉపాధ్యాయ సంఘ నాయకులు తెలిపారు.

News April 4, 2024

అన్నవరం ఆలయానికి వెళ్లొస్తూ మృత్యు ఒడికి!

image

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో హనుమాన్ జంక్షన్‌కు చెందిన తమ్మిన సుబ్రహ్మణ్యం(42), రంగారెడ్డి జిల్లాకు చెందిన చేకూరి పల్లయ్య చౌదరి(52) మృతి చెందారు. దర్శనానికి అన్నవరం వెళ్లి వస్తుండగా.. తాళ్లూరు శివారు దాబాల వద్ద లారీని వెనక నుంచి వీరి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

News April 4, 2024

అనంతపురం జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్ బాధ్యతలు

image

అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా అమిత్ బర్దార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాకు బదిలీ అయిన ఆయన ఈ సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా ఎస్పీగా పని చేస్తున్న అన్బురాజన్ బదిలీ అయిన విషయం తెలిసిందే.

News April 4, 2024

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

సరుబుజ్జిలి మండలం రొట్టవలస సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హిరమండలం మండలం రెల్లివలసకి చెందిన కోట హరి మృతి చెందాడు. సరుబుజ్జిలి ఎస్సై బి.నిహార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస వైపు నుంచి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా.. రొట్టవలస వద్ద ట్రాక్టర్ ఒక్కసారిగా అడ్డం రావడంతో ప్రమాదం జరిగిందన్నారు. మరో యువకుడు గోక రామకోటికి గాయాలయ్యాయి. హరి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.