India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జరగనుంది. భక్తులు తమ సందేహాలు, సూచనలను ఈవో ఏవీ ధర్మారెడ్డితో ఫోన్లో(0877-2263261) నేరుగా మాట్లాడి తెలపవచ్చని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అనంత(D) గుంతకల్లు కస్తూర్బా పాఠశాలలో ఓ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి తండ్రి వివరాలు.. మద్దికెర మండలానికి చెందిన బాలిక 8వతరగతి చదువుతుంది. తోటి విద్యార్థులు తమ స్నాక్స్ చోరీ చేసిందని టీచర్కు ఫిర్యాదుచేయడంతో దండించింది. మళ్లీ వారు పీటీకి ఫిర్యాదుచేయగా గ్రౌండ్లో రెండు రౌండ్లు వేయాలని శిక్షించింది. మనస్తాపం చెందిన బాలిక చున్నితో ఉరివేసుకునేందుకు ప్రయత్నించింది.
గుంతకల్లు కస్తూర్బా పాఠశాలలో ఓ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి తండ్రి వివరాలు.. కర్నూలు(D) మద్దికెర మండలానికి చెందిన బాలిక 8వతరగతి చదువుతుంది. తోటి విద్యార్థులు తమ స్నాక్స్ చోరీ చేసిందని టీచర్కు ఫిర్యాదుచేయడంతో దండించింది. మళ్లీ వారు పీటీకి ఫిర్యాదుచేయగా గ్రౌండ్లో రెండు రౌండ్లు వేయాలని శిక్షించింది. మనస్తాపం చెందిన బాలిక చున్నితో ఉరివేసుకునేందుకు ప్రయత్నించింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు నమోదుకు ఈ నెల 14 వరకు అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి, నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 20,44,815 మంది ఓటర్లుగా నమోదై ఉన్నట్లు చెప్పారు. ఓటరు జాబితాలో ఏవైనా చిన్న తప్పులుంటే ఎన్నికల సంఘం సూచించిన 10 గుర్తింపు కార్డుల్లో దేన్నైనా చూపి ఓటు వేయవచ్చన్నారు.
రామచంద్రపురం మండలంలోని వెంకటాయపాలెంలో 29 ఏళ్ల కిందట శిరోముండనం జరిగింది. ఈ ఘటనపై నమోదైన కేసుకు సంబంధించి విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు విచారణ బుధవారంతో పూర్తయింది. తుది తీర్పు ఈనెల 12వ తేదీన వెలువడనుంది. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ, వైసీపీ మండపేట MLA అభ్యర్థి తోట త్రిమూర్తులుతోపాటు మరో 9 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
కొనకనమిట్ల మండలం వాగుమడుగు పంచాయతీ పరిధిలోని అంబాపురం గ్రామ శివారులో పురాతనమైన అంబబాలత్రిపుర సుందరీదేవి ఆలయంలో కొందరు దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేశారు. ఆలయం వెనక వైపు రాతి గోడలను ధ్వంసం చేశారు. గ్రామస్థులు గమనించి బుధవారం పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్సై గోపాలకృష్ణ పరిశీలించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ(పురుషులు) కాలేజీలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీ కోర్సు మంజూరైనట్లు ప్రిన్సిపల్ సురేఖ తెలిపారు. యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఆర్.రజని కోర్సు అనుమతి పత్రాలను ప్రిన్సిపల్కు అందజేశారు. పీజీ సెట్ ద్వారా ప్రవేశం పొంది ఈ కోర్సు పూర్తి చేసిన తరువాత వైద్య, ఫార్మా రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతోంది. నిన్న పూతలపట్టులో సభ అనంతరం ఆయన తిరుపతి జిల్లాలోకి ప్రవేశించారు. ఇవాళ తిరుపతి జిల్లాలో డ్రైవర్లతో సమావేశం అవుతారు. అలాగే రోడ్ షోతో పాటు నాయుడుపేటలో బహిరంగ సభ జరగనుంది. ఈక్రమంలో సీఎం జగన్ ‘Day-8 తిరుపతి జిల్లా సిద్ధమా…?’ అని ట్వీట్ చేశారు.
గూడూరు బైపాస్ కూడలిలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే అతను మృతిచెందాడు. మృతుడు గూడూరు మండలం పోటుపాలెం గ్రామానికి చెందిన తిరునామల్లి ఏడుకొండలుగా గుర్తించారు. వెల్డింగ్ పనులు చేసుకుని జీవనం సాగించే అతను మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
ఇబ్రహీంపట్నంలో 2016 జూలై 10న జరిగిన హత్య కేసులో ముద్దాయి ప్రకాశ్ సింగ్ (50)కు 13వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి శేషయ్య బుధవారం జీవిత ఖైదు విధించారు. సదరు ప్రకాశ్ సింగ్, తన స్నేహితుడు నరేశ్ను మద్యం కోసం డబ్బులడగగా, నిరాకరించడంతో రాయితో కొట్టి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని కోర్టు తమ తీర్పులో వెల్లడించింది. సదరు ముద్దాయికి జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించినట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.