Andhra Pradesh

News September 25, 2025

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్ల వద్ద వెంటనే బారికేడింగ్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. గుర్తించిన 84 అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. రాత్రిపూట ప్రమాదాల నివారణకు రోడ్లపై రోడ్ స్టడ్స్ (సూచికలు), సీసీ కెమెరాలను అమర్చాలని సూచించారు.

News September 25, 2025

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘ఆప్’ పోటీ: జిల్లా అధ్యక్షుడు

image

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నట్లు జిల్లా కన్వీనర్ బి.వెంకటరమణ బాబు స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో పార్టీ సమావేశం నిర్వహించారు. రాయదుర్గం, గుంతకల్లు, అనంతపురం, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీల్లోనూ పోటీ చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గౌస్, రాంమోహన్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

News September 25, 2025

విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన మహిళా కమిషన్ ఛైర్‌ పర్సన్

image

రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ బుధవారం విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు. మహిళా బ్యారేక్‌ను పరిశీలించి మహిళా ఖైదీలతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పోషమ్మ పథకం అమలు చేస్తోందని, మహిళా ఖైదీలకు కూడా ఈ పథకం కింద ప్రత్యేక డైట్ ప్లాన్ అమలు చేసేలా పరిశీలిస్తున్నామని వివరించారు.

News September 25, 2025

ఓటర్ల జాబితాను మ్యాప్ చేయండి: VZM కలెక్టర్

image

ఓటర్ల జాబితా సవరణ పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి బుధవారం సమీక్షించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితాను మ్యాప్ చేయాలని తెలిపారు. ఓటర్ల సవరణ కోసం అందిన ఫారం 6, 7, 8ని నిర్దేశిత గడువు లోగా డిస్పోజ్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

News September 25, 2025

తూ.గో: హోమ్ స్టేలను ప్రోత్సహించండి: కలెక్టర్

image

తూ.గో జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి హోమ్ స్టేలను ప్రోత్సహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో డీఆర్‌డీఏ అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో పర్యాటకానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికలు రచించాలని ఆదేశించారు.

News September 25, 2025

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: MPDO

image

జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ నేతృత్వంలో ఈనెల 27న తెనాలిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు MPDO అత్తోట దీప్తి బుధవారం తెలిపారు. VSR & NVR కాలేజీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మేళా నిర్వహిస్తారన్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఐటిఐ, డిగ్రీ చదివి, 18 నుంచి 35 సంవత్సరాల వయస్సున్న వారు అర్హులన్నారు. ఇంటర్వ్యూకు వచ్చే వారు సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ ఫొటోతో రావాలని సూచించారు.

News September 24, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

✦కొత్తమ్మతల్లి శోభాయాత్రను ప్రారంభించిన కలెక్టర్
✦SKLM: మీ ప్రతిభతో ప్రధాని మోదీని కలవొచ్చు
✦ఎచ్చెర్ల: రోడ్డు అధ్వాన్నం.. ప్రయాణం నరకప్రాయం
✦జిల్లాలో కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
✦ సోంపేట నుంచి విజయవాడకు భవానీ దీక్షపరులు సైకిల్ యాత్ర
✦ కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఆలయంలో అపచారం

News September 24, 2025

జిల్లాలో నాటు సారాను పూర్తిగా నిర్మూలించండి: కలెక్టర్

image

జిల్లాలో నాటు సారాను పూర్తిగా నిర్మూలించే చర్యలు తీసుకోవాలని, సారా వల్ల జరిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించాలని నవోదయం సమావేశంలో అధికారులను కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన నాటుసారా నిర్మూలనపై సమీక్షా సమావేం జరిగింది. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు.

News September 24, 2025

పెంచలకోన: ధాన్యలక్ష్మీ అలంకరణలో అమ్మవారు

image

పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా బుధవారం అమ్మవారికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అమ్మవారు ధాన్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.

News September 24, 2025

నెల్లూరుకు రూ.13.50 కోట్లు: కలెక్టర్

image

నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP)లో భాగంగా నెల్లూరుకు 2025-26 సంవత్సరానికి రు.13.50 కోట్లు మంజురైనట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో నిధుల వినియోగానికి సంబంధించి అమలు కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎండ్ టు ఎండ్ పేవింగ్, గ్రీనరీ డెవలప్‌మెంట్, మెకానికల్ రోడ్ స్వీపింగ్, దుమ్ము నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.