India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అభిమానులకు గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. గాయం నుంచి కోలుకున్న సూర్య, అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో రేపు జరుగనున్న దులీప్ ట్రోఫీలో బరిలోకి దిగనున్నారు. ఇండియా-బి జట్టు తరఫున బరిలో దిగనున్నారు. సూర్యకుమార్ యాదవ్ స్కై షాట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
✮ శ్రీకాకుళంలో ప్రైవేటు సంస్థ 3వేల మందికి మోసం
✮ రేగిడిలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
✮ ఏపీ పీజీ సెట్ రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభం
✮ జిల్లాలో 95.45 శాతం ఈ క్రాప్ నమోదు
✮ శ్రీకాకుళం IIIT రిజిస్ట్రార్గా అమరేంద్ర
✮ త్వరలో ఆమదాలవలస అన్న క్యాంటీన్ ప్రారంభం
✮ ఈనెల 20న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్
✮ DRBRAUలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందని వేతనాలు
✮ జిల్లా ప్రముఖ విద్యావేత్త చక్రధర్ మృతి
ఫేక్ ప్రొఫైల్ DPలతో అపరిచిత ఫోన్ నంబర్ల నుంచి వచ్చే నగదు అభ్యర్థనలకు స్పందించవద్దని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదుచేయాలని సూచించారు. స్నేహితుల ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ల DPలుగా పెట్టుకొని మోసాలకు పాల్పడతారని, అటువంటి వారిపై జాగ్రత్తగా ఉండాలన్నారు.
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ట్రైనీ ఐపీఎస్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఏపీకి నలుగురు ట్రైనీ ఐపీఎస్లను కేటాయించింది. నంద్యాల జిల్లా మహానంది మండలం నందిపల్లెకు చెందిన వంగల మనీషా రెడ్డి ఆ జాబితాలో ఉన్నారు. సొంత రాష్ట్రానికి ట్రైనీ ఐపీఎస్గా కేటాయించడంతో నందిపల్లి గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, పలువురు ఆనందం వ్యక్తం చేశారు.
పేరుపాలెం బీచ్లో ఓ యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. వివరాలు.. భీమవరం పట్టణం మెంటేవారితోటకు చెందిన రాజు, రత్న దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రభు చరణ్ బర్త్డే సందర్భంగా తమ్ముడు ప్రవీణ్ కుమార్, స్నేహితులతో కలిసి బీచ్ వెళ్లారు. ఈ క్రమంలో బీచ్లో స్నానం చేస్తుండగా ప్రవీణ్ గల్లంతయ్యాడు. అంతకు ముందు గణేశ్ ఉత్సవాల్లోనూ పాల్గొన్నాడని అంతలోనే ఇలా అయిందని కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నెల్లూరు జిల్లాలో పలువురికి కీలక పదవులు అప్పగిస్తూ వైసీపీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.
నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు- కాకాణి
రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్- ఆనం విజయకుమార్ రెడ్డి
సిటీ ఇన్ఛార్జ్- పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు కార్పొరేషన్ అబ్జర్వర్- అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు ఎంపీ ఇన్ఛార్జ్- ఆదాల ప్రభాకర్ రెడ్డి
రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి- మహ్మమద్ ఖలీల్
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన మేకా శేషుబాబుని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఏ మేరకు పార్టీ అధిష్ఠానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు పార్టీ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఏలూరు రేంజ్ పరిధిలోని వివిధ జిల్లాల ఎస్పీలతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు బుధవారం ఏలూరులో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గంజాయి నిర్మూలనకు 100 రోజులు ప్రణాళిక రూపొందించామన్నారు. గంజాయి, మాదకద్రవ్యాలపై ప్రజలకు, చిన్న పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. పోలీసుల పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు.
విజయవాడ వరద సహాయక చర్యల నిమిత్తం 1వ తరగతి విద్యార్థిని తన పాకెట్ మనీని విరాళంగా అందించింది. వివరాలిలా ఉన్నాయి. పులివెందులకు చెందిన ఒకటో తరగతి విద్యార్ధిని ఎం.వర్ణిక వరద బాధితులను చూసి చలించి పోయింది. వారికి సహాయం చేయాలని అనుకుంది. ఈ క్రమంలో తన బాబాయి ప్రణీత్ కుమార్తో కలిసి బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్కు తన పాకెట్ మనీ రూ.72,500 విరాళంగా అందించింది.
ఈ నెల సెప్టెంబరు 20 శుక్రవారం నాడు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Sorry, no posts matched your criteria.