Andhra Pradesh

News April 4, 2024

మునగపాక: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

ములబంద గోడీ ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో రైతు మృతిచెందాడు. గ్రామానికి చెందిన దాడి వెంకట అప్పారావు (57) పొలంలోని చెరకు క్రషింగ్ పూర్తి కావడంతో క్రషర్, బెల్లం పెనాన్ని బుధవారం సాయంత్రం తన కుమారుడు చందు, మరో రైతు ఆడారి చిన అప్పారావు సహాయంతో శుభ్రం చేస్తున్నారు. ఈ సమయంలో విద్యుత్ తీగకు పెనం తగిలింది. దీంతో ముగ్గురు విద్యుదాఘాతానికి గురయ్యారు. ప్రమాదంలో వెంకట అప్పారావు అక్కడికక్కడే మృతిచెందారు.

News April 4, 2024

JNTU సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

అనంత జేఎన్టీయూ పరిధిలో నిర్వహించిన వివిధ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఒకటో సెమిస్టర్, రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, ఎంఫార్మసీ ఒకటి, రెండు సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ కేశవరెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చంద్రమోహన్రెడ్డి తెలిపారు.

News April 4, 2024

కడప: వడదెబ్బతో లారీ డ్రైవర్ మృతి

image

వడదెబ్బతో తెలంగాణకు చెందిన లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన బుధవారం బద్వేల్‌లో జరిగింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన లారీ డ్రైవర్ అశోక్ మంగళవారం ఉదయం లారీ మరమ్మతులకు గురి కావడంతో బద్వేలులో నిలిచిపోయాడు. బుధవారం మధ్యాహ్నం అతడు మృతి చెందడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News April 4, 2024

కొవ్వూరు: ఇద్దరి యువకులపై పోక్సో కేసు నమోదు

image

బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరి యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు. కొవ్వూరు మండలం వాడపల్లికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్, అతని సోదరుడు అఖిల్ సహకారంతో ప్రేమిస్తున్నానని వెంటపడి బుధవారం అసభ్యంగా ప్రవర్తించి, దౌర్జన్యం చేశారు. దీనిపై బాలిక కొవ్వూరు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు యువకులపై ఎస్సై జుబేర్ పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News April 4, 2024

కర్నూలు : ఏఆర్ కానిస్టేబుల్‌పై కేసు 

image

కర్నూలుకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వై.జానకిరాం, మరో ఇద్దరి మహిళలపై నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. కర్నూలు శ్రీరామ్ నగర్‌కు చెందిన కాళేశ్వరమ్మను జానకిరాం వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత విజయవాడకు చెందిన రాజ్యలక్ష్మిని రెండో వివాహం, కర్నూలుకు చెందిన నాగమణి మరో వివాహం చేసుకుని మోసగించారని, వారి ముగ్గురి నుంచి తనకు ప్రాణహాని ఉందని కాళేశ్వరమ్మ కోర్టులో ఫిర్యాదు చేశారు. 

News April 4, 2024

అలా జరిగితే పోలవరంలో ఓడిపోతాం: TDP

image

ఏడుళ్లుగా టీడీపీ పోలవరం ఇంఛార్జ్ బొరగం శ్రీనివాస్ ప్రజాధారణ పొందారని ఆ పార్టీ నాయకులు చెప్పారు. పోలవరం మండలం కొత్త దేవరగొందిలో వారు మీడియాతో మాట్లాడారు. బొరగం శ్రీనుకు తప్ప ఇంకెవరికి ఇచ్చినా పోలవరంలో టీడీపీ ఓడిపోతుందన్నారు. శ్రీనివాసులకు ఇస్తే తమ ఏడు మండలాల ప్రజలు కలిసి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని స్పష్టం చేశారు.

News April 4, 2024

టెక్కలి: ఆర్టీసీ డిపో కండెక్టర్ సస్పెండ్

image

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టెక్కలి ఆర్టీసీ డిపో కండక్టర్ బి.ధనుంజయరావును సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మార్చి 31న MLC, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆయన నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News April 4, 2024

పర్చూరులో జెండా పాతేది ఎవరు.?

image

పర్చూరు నియోజకవర్గంలో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది. ఏలూరి సాంబశివరావు 2014, 19 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. 2019లో కేవలం 1647 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, మరోసారి పోటీచేస్తూ హ్యట్రిక్‌పై కన్నేశారు. అటు ఎడం బాలాజీ 2019 చీరాల నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. మరోసారి చీరాల టికెట్ ఆశించగా కుదరక పర్చూరు నుంచి బరిలో ఉన్నారు. మొత్తం 2,25,770 ఓట్లలో మెజారిటీ ఓట్లు సాధించి ఎవరు గెలుస్తారో.?

News April 4, 2024

ప్రార్థనా మందిరాల్లో ప్రచారాలు నిషేధం: కలెక్టర్

image

అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటిస్తూ.. తమ ప్రచారాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎం. వేణుగోపాల్ రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు ప్రార్థనా మందిరాల్లో ప్రచారాలు నిర్వహించకూడదన్నారు. పార్టీ కండువాలతో వెళ్లొద్దని సూచించారు.

News April 4, 2024

అనంత: నీటి టబ్‌లో పడి చిన్నారి మృతి

image

పెద్దవడుగూరు మండలం చింతలచెరువు గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. శివ, రాధా దంపతుల కుమారుడు అఖిల్ అనే ఏడాది బాలుడు ఇంటిముందు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటి టబ్‌లో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.