India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ నేతలను అకారణంగా కొట్టిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కలిసి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కౌన్సిలింగ్ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలిపించి వారిపై ఎటువంటి ఆధారాలు లేకుండా విచక్షణా రహితంగా చేయి చేసుకోవడంపై మండిపడ్డారు.
2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తులో భాగంగా విజయవాడ సెంట్రల్లో పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు 29,333 ఓట్లు(16.48%) సాధించారు. 2019లో టీడీపీ అభ్యర్థి బొండా ఉమ 25 ఓట్ల తేడాతో విష్ణు చేతిలో ఓడిపోయారు. పొత్తులో భాగంగా NDA నుంచి మళ్లీ ఉమను బరిలో దింపారు. కాంగ్రెస్తో జతకట్టిన సీపీఎం బాబురావుకు మరలా టికెట్ ఇచ్చే ఛాన్సుంది. దీంతో ఈసారి కూడా బాబురావుకు వచ్చే ఓట్లు కీలకం కానున్నాయి.
MP వైఎస్ అవినాశ్ రెడ్డి తప్పు చేశాడని తేలితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. అవినాశ్ రెడ్డి హత్య చేశాడా లేదా అనేది న్యాయ స్థానం నిర్ణయిస్తుందన్నారు. అవినాశ్ తప్పు చేశాడని తేలితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
ఈనెల 5వ తేదీ లోపు పెన్షన్ల పంపిణీ పూర్తి చేయలని కలెక్టర్ డాక్టర్ సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కర్నూల్ కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అస్వస్థతతో ఉన్నవారు, మంచానికే పరిమితమైన వారు, నడవలేక వీల్ చైర్స్లో ఉన్నవారు, సైనిక సంక్షేమ పెన్షన్ పొందుతున్న వృద్ధ మహిళలకు ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందజేస్తామన్నారు.
మండలంలోని మురికిపూడి గ్రామంలో ఎద్దు ఏసుబాబు హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం చిలకలూరిపేటలో డీఎస్పీ వర్మ మాట్లాడుతూ.. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని మృతుడు ఏసుబాబు భార్య రజని, ప్రియుడు మురళీకృష్ణ, మరికొంత మంది కలిసి గత నెల 28వ తేదీన ఏసుబాబును హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
అమలాపురం జనసేన ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. జనసేన కంచుకోటను టీడీపీకి ధారాదత్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి నుంచి నేటి వరకు జనసేన జెండా జీవితంగా, పార్టీ తన ప్రాణంగా బతికానన్నారు. తాను రాసిన లేఖకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి కూడా అధిష్ఠానానికి వీలు చిక్కని ప్రవర్తనతో విసుగు చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
తిరుపతిలో ఇండియా కూటమి పార్లమెంటు అభ్యర్థిగా డాక్టర్ అంజయ్య పోటీ చేయనున్నట్లు బుధవారం స్పష్టం చేశారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు తనకు ఒక అవకాశం ఇస్తే పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తామన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో పెన్షన్ల పంపిణీ మొదలైందని ఇంచార్జ్ పీడీ Y.సత్యంనాయుడు తెలిపారు. జిల్లాలో ఉన్న 15 మండలాలు 3 మున్సిపాలిటీల్లో మొత్తం 14,5409 మంది పెన్షన్ దారులకు ఇప్పటికే 621 మందికి వివిధ సచివాలయాల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. పాలకొండ మండలం లో అత్యధికంగా 270 మందికి అత్యల్పంగా సాలూరు మండలంలో ఒక్కరికీ అందివ్వడం జరిగింది. ఇంకా సాలూరు అర్బన్, సీతంపేట, కురుపాంలో ప్రారంభించాల్సి ఉంది.
ప్రయాణికుల సౌలభ్యం మేరకు విజయవాడ మీదుగా నడిచే హిసార్ (HSR), తిరుపతి (TPTY) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నెం.09715 HSR- TPTY మధ్య నడిచే రైలును ఈ నెల 6 నుంచి మే 25 వరకు ప్రతి శనివారం, నెం.09716 TPTY- HSR మధ్య నడిచే రైలును ఈ నెల 9 నుంచి మే 28 వరకు ప్రతి మంగళవారం నడుపుతామంది. కాగా ఈ రైళ్లు విజయవాడ, ఉజ్జయినితో పాటు మార్గమధ్యంలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.
ఈ నెల 5 నుంచి కడప జిల్లాలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆ
పార్టీ నాయకులు తెలిపారు. 5 నుంచి 12 వరకు 8 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 5, 6 తేదీలలో బద్వేలు, కడప, 7న మైదుకూరు, 8న కమలాపురం, 10, 11న పులివెందుల, 12న జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో బస్ యాత్ర చేపట్టనున్నారు.
Sorry, no posts matched your criteria.