Andhra Pradesh

News April 3, 2024

పెడన: యువతిపై లైంగిక దాడి.. కేసు నమోదు

image

యువతిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై మంగళవారం సాయంత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. పెడన పట్టణంలోని ఏడవ వార్డుకు చెందిన ఎండీ హర్షిత్ యువతిపై (20) పై లైంగిక దాడి చేశాడని బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఎస్సై సూర్య శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. బందర్ డీఎస్పీ అబ్దుల్ సుభాని విచారణ చేపట్టారు.

News April 3, 2024

ప.గో.: టీడీపీ- బీజేపీ- JSP కూటమి అధినాయకులకు విజ్ఞప్తి

image

టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అధినాయకులకు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య బుధవారం ఒక విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 25% జనాభా ఉన్న కాపు కులస్థులకు కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో వారి సంతృప్తి మేరకు హామీలను ప్రకటించాలన్నారు. బీసీలతో సమానంగా సంక్షేమ సౌకర్యాలు, పెళ్లి ఖర్చుల నిమిత్తం కానుకగా రూ.లక్ష ఇవ్వాలన్నారు. జనాభా ప్రాతిపదికన కాపు కార్పొరేషన్ సంక్షేమ బడ్జెట్, అలాగే రిజర్వేషన్లు కేటాయించాలన్నారు.

News April 3, 2024

కడప: రైలు కిందపడి యువకుడి మృతి

image

జిల్లాలోని కమలాపురం పట్టణ సమీపంలో చెరువు కట్ట వద్ద రైలు కిందపడి ఓ యువకుడు మృతిచెందాడు. నంద్యాల నుంచి రేణిగుంట వెళుతున్న డెమో రైలు కింద యువకుడు బుధవారం ఉదయం పడిపోయాడు. అతని శరీరం రెండు ముక్కలైపోయింది. స్థానికులు గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 3, 2024

కర్నూలు: ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

image

ఓ ప్రేమ జంట పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పత్తికొండ మండలం పులికొండలో జరిగింది. ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన రాజశేఖర్, ఓ యువతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో సోమవారం అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. మంగళవారం గ్రామ సమీపంలోని ఓ పొలంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న జంటను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామన్నారు.

News April 3, 2024

నెల్లూరు: చెరువులో యువకుడి గల్లంతు

image

నెల్లూరు జిల్లాలో ఓ యవకుడు చెరువులో మునిగిపోయాడు. మనుబోలు మండలం వీరంపల్లికి చెందిన కోటేశ్వరరావు గేదెలు రాత్రయినా ఇంటికి రాలేదు. దీంతో వాటిని వెతుక్కుంటూ వెళ్లాడు. ఈక్రమంలో చెరువులో దిగగా.. లోతు ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యాడు. ఎస్ఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

News April 3, 2024

అమెరికాలో పర్చూరు విద్యార్థి మృతి

image

అమెరికాలో జరిగిన రోడ్డు ‍ప్రమాదంలో పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్‌ (22) మంగళవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఎంఎస్‌ చదివేందుకు గత ఏడాది డిసెంబరు చివరిలో రేవంత్ అమెరికా వెళ్లాడు. స్నేహితులతో కలిసి కారులో పుట్టినరోజు వేడుకలకు వెళ్తుండగా పొగ మంచు కారణంగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరి యువకులకు స్వల్ప గాయాలు కాగా, రేవంత్ మృతి చెందాడు.

News April 3, 2024

విశాఖలో వ్యక్తి దారుణ హత్య

image

విశాఖలోని అల్లిపురం నెరెళ్ల కోనేరు వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పార్కింగ్ స్థలం విషయంలో వేపకాయల శ్రీరాములు, దాము మధ్య జరిగిన స్వల్ప తగాదా హత్యకు దారి తీసింది. వేపకాయ శ్రీరాములు(55)ని దాము అనే వ్యక్తి హత్య చేశాడు. నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. రెండవ పట్టణ సీఐ తిరుమలరావు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News April 3, 2024

విశాఖలో దారుణ హత్య

image

విశాఖలోని అల్లిపురం నెరెళ్ల కోనేరు వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పార్కింగ్ స్థలం విషయంలో వేపకాయల శ్రీరాములు, దాము మధ్య జరిగిన స్వల్ప తగాదా హత్యకు దారి తీసింది. వేపకాయ శ్రీరాములు(55)ని దాము అనే వ్యక్తి హత్య చేశాడు. నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. రెండవ పట్టణ సీఐ తిరుమలరావు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News April 3, 2024

శ్రీకాకుళం: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

image

పలాస మండలం లక్ష్మీపురం సమీపంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి తర్వాత ఎదురుగా వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి ఐచర్ వ్యాన్ అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐచర్ వ్యాన్ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కొని
తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఇరుక్కున్న డ్రైవర్‌ను అతి కష్టం మీద బయటకి తీసి, చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News April 3, 2024

ఎస్.కోట: చింతచెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

చింతచెట్టు పైనుంచి జారి పడిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఎస్.కోట మండలంలో చోటుచేసుకుంది. సీఐ మురళీరావు వివరాల ప్రకారం.. పెదఖండేపల్లి గ్రామానికి చెందిన టి. దేముడు (74)కూలి పనులకు వెళ్తుండేవాడు. మంగళవారం చింతబొట్టలు తీసేందుకు వెళ్లారు. చెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తూ జారిపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి అంబులెన్సులో సర్వజన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.