Andhra Pradesh

News August 23, 2025

డీఎస్సీ ఫలితాలు.. ఆరు ఉద్యోగాలు సాధించిన ప్రసాద్

image

వంగర మండలం మరువాడ గ్రామానికి చెందిన గుంట ప్రసాద్ శుక్రవారం వెలువడిన DSC ఫలితాలలో ఎస్‌సిబి కేటగిరిలో ఆరు ఉద్యోగాలు సాధించారు. SA ఫిజిక్స్, SA మ్యాథ్స్, PGT ఫిజికల్ సైన్స్, TGT మ్యాథ్స్ జోన్1, TGT ఫిజిక్స్ జోన్1, TGT సైన్స్ జోన్1లలో ఉత్తీర్ణత సాధించారు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ తనను చదివించారని ప్రసాద్ తెలిపారు. ఇష్టమైన ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరుతానన్నారు.

News August 23, 2025

వైసీపీ మాదిరిగా తప్పుడు పనులు చేయం: మంత్రి స్వామి

image

వైసీపీ నాయకుల మాదిరిగా తాము తప్పుడు పనులు చేయమని, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటామంటూ మంత్రి స్వామి అన్నారు. కొండేపిలో నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి స్వామి మాట్లాడారు. ఒక్కొక్క హామీని తాము నెరవేర్చుకుంటూ వస్తున్నామని, వైసీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కృషి చేస్తున్నారన్నారు.

News August 23, 2025

పూతలపట్టులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

పూతలపట్టు మండలం బందర్లపల్లి సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం అయింది. ట్రైన్ నుంచి అదుపుతప్పి వ్యక్తి కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూతలపట్టు సీఐ కృష్ణమోహన్, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 23, 2025

సజావుగా పోలీస్ కానిస్టేబుల్స్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ : SP

image

కానిస్టేబుల్ ఉద్యోగానికి జరిగిన వివిధ పరీక్షలలో ఉత్తీర్ణత పొంది ఉద్యోగాన్ని సాధించిన అభ్యర్థులందరికీ ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు భవిష్యత్తులో క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజాసేవ చేయాలని SP కృష్ణ కాంత్ సూచించారు.

News August 23, 2025

డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన పెదఅమీరం యువకుడు

image

ఇటీవల విడుదలైన డీఎస్సీ 2025 మెరిట్ లిస్టులో కాళ్ల మండలం పెదఅమీరంకు చెందిన బూరాడ వెంకటకృష్ణ ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించాడు. స్కూల్ అసిస్టెంట్ – మ్యాథ్స్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 8వ ర్యాంక్, జోన్ 2 స్థాయి (3జిల్లాలు కలిపి) ఉద్యోగాలైన టీజీటీ మ్యాథ్స్‌లో 6వ ర్యాంక్, పీజీటీ మ్యాథ్స్‌లో 24వ ర్యాంక్, రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ పోస్ట్‌కు గాను 56వ ర్యాంక్ సాధించాడు.

News August 23, 2025

తొలి వారం 7.6 లక్షల మంది ‘స్త్రీశక్తి’ ప్రయాణాలు : RM షమీమ్

image

జిల్లాలో స్త్రీశక్తి పథకం ఆరంభించాక తొలి వారం 7,64,311 మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షమీమ్ తెలిపారు. శనివారం ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభం కాగా, 22 వ తేదీ వరకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ వంటి మూడు రకాల బస్‌లలో మొత్తం 14,88,537 మంది ప్రయాణించారన్నారు.

News August 23, 2025

ప్రకాశం: ‘పేదల పార్టీ’కి.. షోకాజ్ నోటీసు జారీ!

image

పొదిలి మండలం కాటూరి వారి పాలెంకు చెందిన పేదల పార్టీ అనే రాజకీయ పార్టీకి జిల్లా ఎన్నికల అధికారి తమీమ్ అన్సారియా శనివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శికి నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. ఆరేళ్లుగా ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయనందుకు నోటీసు జారీ చేశారు. వచ్చేనెల 8న ఎన్నికల అధికారి ముందు హాజరు కావాలన్నారు.

News August 23, 2025

DSCలో మూడు ఉద్యోగాలు సాధించిన సాయినాథ్

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం తిమ్మనాయుడుపాళెం గ్రామానికి చెందిన కావలి సాయినాథ్ DSC పరీక్షలో ఒకేసారి 3 ఉద్యోగాలు సాధించాడు. PGT SOCIAL – 22nd rank, SA SOCIAL -23 RANK, TGT SOCIAL – 59th Rank సాధించి 3 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. సాయినాథ్‌ను పలువురు అభినందించారు.

News August 23, 2025

లావణ్యకు కర్నూలు జిల్లా మొదటి ర్యాంక్

image

తుగ్గలి మండలం గుత్తి ఎర్రగుడి గ్రామానికి చెందిన బొల్లుం లావణ్య డీఎస్సీ మెరిట్ లిస్టులో 94.53202 మార్కులతో జిల్లా మొదటి ర్యాంక్ సాధించి టీచర్ ఉద్యోగం పొందారు. ఇష్టపడి చదివిన ఫలితమే ఈ విజయమని లావణ్య అన్నారు. మాజీ సర్పంచ్ వెంకటస్వామి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, గ్రామస్థులు ఆమె ప్రతిభను కొనియాడి అభినందించారు.

News August 23, 2025

రెవెన్యూ పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం భూమిని సిద్ధంగా పెట్టుకోవాలి: కలెక్టర్

image

రెవెన్యూ పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం అవసరమైన భూమిని సిద్ధంగా పెట్టుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం తాడిపత్రి మండలం పెద్దపొలమడ పరిధిలో అనంతపురం -తాడిపత్రి జాతీయ రహదారి పక్కన సర్వే నంబర్ 1,390లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే పెట్రోల్ బంక్ కోసం కలెక్టర్ స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.