India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో రాజకీయ సమీకరణ చేరనున్న ఎమ్మెల్సీలు మారుతున్నాయి. వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతోపాటు గురజాల నియోజకవర్గంలోని పలువురు నేతలు వైసీపీని వీడి జంగాతో టీడీపీలో చేరనున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం జరగనున్న పర్యటనలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.
కలెక్టర్ పి రాజాబాబు జిల్లా ప్రజలకు ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి రక్షణార్థమై క్రీస్తు పునరుద్ధానం పొందిన పర్వదినం ఈస్టర్ అన్నారు. అటువంటి పర్వదినం జిల్లా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.
జిల్లా రాజకీయాల్లో కడప అసెంబ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. 3 దశాబ్దాల నుంచి ముస్లింలకు కంచుకోటగా మారిన కడప నుంచి సిట్టింగ్ MLA అంజాద్ బాషా వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇటు కూటమి నుంచి మహిళా అభ్యర్థి మాధవిరెడ్డి మొదటిసారి పోటీ చేస్తున్నారు. కడపలో గెలిచి చరిత్ర సృష్టిస్తానని మాధవిరెడ్డి అంటుంటే, ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తానని అంజాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ గెలుపు ఎవరిది.?
నెల్లూరు నగరం కొత్తూరులోని కేంద్రీయ విద్యాలయంలో 2024 -25 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆన్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శంకరయ్య తెలిపారు. ఒకటో తరగతిలో 64 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. సీట్ల కోసం ఏప్రిల్ 15వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు కేంద్రీయ విద్యాలయం వెబ్ సైట్ ను సందర్శించాలన్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు చెరువులో దిగిన ఓ గిరిజన వివాహిత నీట మునిగి మృతి చెందింది. ఈ ఘటన వరదయ్యపాళెంలో శనివారం చోటుచేసుకుంది. పవన్, నాగరాణి దంపతులు శుక్రవారం సాయంత్రం కాలనీ సమీపంలోని చెరువులో సరదాగా ఈత కోసం దిగారు. భర్త పవన్ చెరువు ఒడ్డున దుస్తులు ఆరబెడుతుండగా.. ఈత రాకపోవడంతో నాగరాణి(40) నీట మునిగి శవమై తేలింది. వీరికి నలుగురు సంతానం. ఘటన పై కేసు నమోదు చేశారు.
కేజీహెచ్లో కరోనాతో బాలుడు చనిపోయాడన్న వార్తల్లో నిజం లేదని డీఎంహెచ్ఓ డాక్టర్ జగదీశ్వరరావు తెలిపారు. రెండు వారాలుగా మలేరియా పచ్చకామెర్లతో బాలుడు బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. తూ.గో జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడిని ఈనెల 28న కేజీహెచ్లో చేర్పించినట్లు తెలిపారు. అప్పటికే బాలుడు కీళ్ల వ్యాధికి స్టెరాయిడ్ థెరపి తీసుకుంటున్నట్లు చెప్పారు. పైవ్యాధులతో బాలుడు చికిత్స పొందుతూ 29న మృతి చెందాడన్నారు.
ప్రేమించిన యువతి మోసం చేసిందని దివ్యాంగ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. భోగాపురం మండలం కంచేరుకు చెందిన యువకుడిని ఓ యువతి మోసం చేసిందనే మనస్థాపంతో పురుగుమందు తాగాడు. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి నిన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందాడు.
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కృష్ణా జిల్లాలో ఆదివారం కింద పేర్కొన్న మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు డిగ్రీలు, సెంటీగ్రేడ్లలో నమోదవుతాయని స్పష్టం చేస్తూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
☞కంకిపాడు 40
☞ఉయ్యూరు 40
☞బాపులపాడు 40.1
☞గుడివాడ 39.2
☞గన్నవరం 40.3
☞పెనమలూరు 40.1
☞ఉంగుటూరు 40.3
☞పెదపారుపూడి 39.9
☞తోట్లవల్లూరు 39.5
☞పామర్రు 38.7
మదనపల్లిలో రైతుపై హత్యాయత్నం జరగడం తీవ్రకలకలం రేపుతోంది. పోలీసుల కథనం.. మండలంలోని పాలెంకొండకు చెందిన నాగరాజకు , అదే ఊరిలోని చిన్నప్పకు ఆస్తికోసం గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం పొలం వద్ద ఇరువర్గాలు గొడవపడ్డారు. ఈఘర్షణలో రైతు నాగరాజపై ప్రత్యర్థులు మురళి, చిన్నప్ప, చిన్నక్కలు కొడవళ్లతో నరకడంతో చేతి వేళ్లు కట్ అయ్యాయి, తలకు గాయమైంది. బాధితునికి మదనపల్లెలో చికిత్స చేయించి రుయాకు వెళ్లారు.
అనంతపురం జిల్లా ఎన్నికల ప్రవర్తన నియామవళి ఉల్లంఘించిన వారిపై కలెక్టర్ గౌతమి చర్యలు తీసుకున్నారు. వజ్రకరూరు మండలం గడేహోతూరు గ్రామానికి చెందిన చౌక దుకాణపు డీలర్ ఎస్.నాగరాజును శనివారం సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకూ 40 మంది వాలంటీర్లు, ఏడుగురు డీలర్లు, ఒక ఎండీయూ ఆపరేటర్, 11 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, ఒక పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్కు గురైనట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.