Andhra Pradesh

News March 31, 2024

VZM: కేవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కేంద్రీయ విద్యాలయం (బాబామెట్ట)లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఒకటో తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 15న సాయంత్రం వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఒకటో తరగతిలో 32 సీట్లకు విద్యాహక్కు చట్టం ప్రకారం ఎనిమిది రిజర్వు చేసినట్లు తెలిపారు. రెండు, ఆపై తరగతులకు ఖాళీల మేరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

News March 31, 2024

బంగారుపాలెం: గన్నేరు పప్పు తిని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

image

కుటుంబ కలహాల కారణంగా గన్నేరు పప్పు తిని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనబంగారుపాలెం మండలం వెంకటాపురంలో జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. వెంకటాపురానికి చెందిన రఘు (50) అనే వ్యక్తి కుటుంబ కలహాలతో మన స్థాపం చెంది గన్నేరు పప్పు తిని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 31, 2024

గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు రూ. 1,29,74,584 విలువైన నగదు స్వాధీనం

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ప్లయింగ్ స్క్వాడ్ ల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇందులో భాగంగా శనివారం నిర్వహించిన వాహనాల తనిఖీలలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలో రూ. 2,44,000, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో రూ. 1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సరియైన అర్ధాలు చూపకపోవటంతో సీజ్ చేయటం జరిగిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 1,29,74,584 నగదును స్వాధీనం చేసుకున్నారు.

News March 31, 2024

శ్రీకాకుళం: ఏఆర్‌సీలో ఎలుగుబంటి మృతి

image

విశాఖ జంతు పునరావాస కేంద్రం(ఏఆర్‌సీ)లో మగ ఎలుగుబంటి మృతి చెందింది. ఈ ఎలుగుబంటి అడవి నుంచి కొద్ది నెలల కిందట శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులోని జనారణ్యంలోకి చేరి అక్కడి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. దీన్ని అటవీశాఖ అధికారులు బంధించి విశాఖ జూకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి జూ అధికారులు ఈ ఎలుగుబంటిని ఏఆర్‌సీలో సంరక్షిస్తున్నారు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా శనివారం వేకువజామున మరణించింది.

News March 31, 2024

గుంటూరు: ‘లైసెన్స్ గన్స్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలి’

image

ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే యజమానులు తమ లైసెన్స్ తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని జిల్లా ఎన్నికల అధికారి ఎం. వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు. శనివారం జిల్లా ఎస్పీ తుషార్ దూడీతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి లైసెన్స్ గన్స్ అప్పగించడంపై సమావేశం నిర్వహించారు. సరెండర్ చేసిన తుపాకులు ఎన్నికలు ముగిసిన తరువాత సంబంధిత లెటర్‌ చూపించి తీసుకు వెళ్లవచ్చన్నారు.

News March 31, 2024

విశాఖలో కొరియర్ పేరుతో రూ.20 లక్షలు కొట్టేశారు

image

ఫెడెక్స్ కొరియర్ పేరుతో నగరానికి చెందిన వ్యక్తికి రూ.20 లక్షలకు టోకరా వేసిన ఐదుగురు సైబర్ నేరగాళ్లను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ముంబై నుంచి తైవాన్‌కు చేసిన కొరియర్‌లో డ్రగ్స్ ఉన్నాయని ఒక వ్యక్తికి నేరగాళ్లు ఫోన్ చేశారు. తాను కొరియర్ చేయలేదంటూ చెప్పగా.. సదరు వ్యక్తి అడ్రస్, ఇతర వివరాలు కరెక్ట్‌గా చెప్పడంతో భయపడ్డాడు. బ్యాంక్ ఖాతా తనిఖీ చేయాలని చెప్పి రూ.20 లక్షలు కాజేశారు.

News March 31, 2024

విశాఖ: ప్రవేశాల గడువు పొడిగింపు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రభుత్వ గురుకుల సొసైటీకి చెందిన గురుకుల పాఠశాలల్లో అయిదో తరగతిలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి గడువును పొడిగించారు. రానున్న విద్యాసంవత్సరంలో భీమిలి, అచ్యుతాపురం బాలికలు, నర్సీపట్నం బాలుర గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 25న జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్షలు జరుగుతాయని పరీక్షల ఉమ్మడి విశాఖ జిల్లా కో-ఆర్డినేటర్ రాంబాబు పేర్కొన్నారు.

News March 31, 2024

కర్నూలులో ఏడాది క్రితం మిస్సైన మూడు కూనలు హైదరాబాద్‌లో సేఫ్

image

కర్నూలు జిల్లాలో 2023 మార్చిలో నాలుగు పులి పిల్లలు మిస్ అయ్యాయి. అయితే వాటిని తిరుపతి SV జూ పార్క్‌కు తరలించి అధికారులు సంరక్షించారు. వాటిలో ఒకటి మరణించగా మరో మూడింటికీ రుద్రమ్మ, అనంత, హరిణి అని పేరు పెట్టారు. వీటిని ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కి చెందిన జీఏఆర్ సంస్థ ఏడాది పాటు దత్తత తీసుకుంది. గడువు ముగిస్తే మళ్లీ అధికారుల ఆదేశాలతో నిర్ణయం తీసుకుంటామని SVజూపార్క్ క్యూరేటర్ సెల్వం తెలిపారు.

News March 31, 2024

నూజివీడు అసెంబ్లీకి 72 ఏళ్లలో ఐదుగురే అభ్యర్థులు

image

నూజివీడు నియోజకవర్గం నుంచి 72 ఏళ్లలో 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటివరకు ఐదుగురు అభ్యర్థులు, 3 సామాజిక వర్గాలు మాత్రమే ఇక్కడ ప్రాతినిధ్యం వహించాయి. 1952 నుంచి 1972వరకు డాక్టర్ ఎంఆర్ అప్పారావు, 1978, 1989లో పాలడుగు వెంకటరావు, 1983, 1985, 1994, 1999లో కోటగిరి హనుమంతరావు, 2004, 2014, 2019లో మేక వెంకట ప్రతాప్ అప్పారావు, 2009లో చిన్నం రామకోటయ్య గెలుపొంది ప్రాతినిధ్యం వహించారు.

News March 31, 2024

నేడే చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌

image

చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఆదివారం జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌కు పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి మంచి ఊపుమీదున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. ప్రవేశ ద్వారాల వద్ద వైఫైతో కూడా స్కానర్‌ బోర్డులను ఏర్పాటుచేశారు. మ్యాచ్‌ నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.