India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కూటమి చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కిమిడి కళా వెంటకరావును, విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు పేరును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. వీరిద్దరూ ఆశించిన ఎచ్చెర్ల సీటు బీజేపీకి కేటాయించారు. కాగా.. చీపురుపల్లిలో పోటీ చేస్తారన్న గంటాకు భీమిలి సీటు కేటాయించింది. చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కిమిడి నాగార్జునకు కళా స్వయానా పెదనాన్న అవుతారు.
అనంతపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణను టీడీపీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. ఈయనకు బోయ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడిగా గుర్తింపు ఉంది. 2009 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హిందూపురం నుంచి పోటీ చేసి ఓడిపోయ్యారు. హిందూపురం పార్లమెంట్ స్థానం ఆశించారు, కానీ టీడీపీ అధిష్ఠానం అనంతపురం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించింది.
గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్ఠానం గుమ్మనూరు జయరాంను ఖరారు చేసింది. ఆలూరుకి చెందిన జయరాం వైసీపీ నుండి కొద్దిరోజుల క్రితం టీడీపీలో చేరగా.. ఎట్టకేలకు ఆయన పోటీచేసే స్థానంపై సస్పెన్స్ వీడింది. అటు కదిరి నుంచి కందికుంట వెంకటప్రసాద్ భార్య కాకుండా ప్రసాద్ బరిలో ఉంటారని ప్రకటించింది. అనంతపురం అర్బన్ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బరిలో ఉంటారని టీడీపీ తుది జాబితాలో పేర్కొంది.
ఉత్కంఠ రేపిన గంటా శ్రీనివాసరావు పోటీచేసే స్థానాన్ని ఎట్టకేలకు టీడీపీ ఖరారు చేసింది. భీమిలి నుంచి బరిలో ఉంటారని తుదిజాబితాలో వెల్లడించింది. ప్రస్తుతం విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా.. ఈసారి కూడా ఆయన పోటీచేసే స్థానం మారడం గమనార్హం. చీపురుపల్లి నుంచి ఆయన పోటీచేస్తారని ఊహాగానాలు వచ్చినా అక్కడి నుంచి కళా వెంకట్రావు బరిలో ఉన్నారు. కాగా భీమిలి వైసీపీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాస్ పోటీచేస్తున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు సమీపంలో అమరావతి హోటల్ వద్ద జాతీయ రహదారిపై బస్సు, కారు, మరో వాహనం ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. పలువురికి గాయాలైనట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కొన్ని రోజులుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో ఏర్పడిన చీలికలకు తెరపడింది. ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేశ్ నాయుడు శుక్రవారం నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ చిలకలూరిపేట సమన్వయకర్తగా తొలగించినప్పటి నుండి తీవ్ర అసంతృప్తిలో ఉన్న రాజేశ్.. నేడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అతనితో పాటు మరి కొంతమంది వార్డు మెంబర్లు టీడీపీలో చేరారు.
చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయుడు మంగళగిరిలో లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన సన్నిహితులు, కార్యకర్తలతో టీడీపీ కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిలకలూరిపేట వైసీపీ టికెట్ మనోహర్ నాయుడికి ప్రకటించిన నేపథ్యంలో రాజేశ్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు అనుచరులు తెలిపారు. ఆయనతోపాటు పాటు 12మంది YCP కౌన్సిలర్లు TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
పుట్టపర్తి మండలలో శుక్రవారం వింత గొర్రె పిల్ల పుట్టింది. మండల పరిధిలోని సుబ్బరాయునిపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మూర్తికి చెందిన ఓ గొర్రె ఎనిమిది కాళ్లు, రెండు తలలతో కూడిన గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. కాగా కొద్ది సేపటికే గొర్రె పిల్ల మృతి చెందినట్లు గొర్రెల కాపారి తెలియజేశారు.
విశాఖపట్నం సాగర్ నగర్ సముద్ర తీరంలో మత్స్యకారులకు సముద్ర కప్పలుగా పిలవబడే విభిన్న చేపలు లభించాయి. తిరిగారు ఈ తరహా జీవులను పవర్ ఫిష్ గా పిలుస్తారని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. సముద్రపు అట్టడుగు లోతుల్లో సంచరించే ఈ జీవులు దాడికి గురైన సమయంలో ఇలా బెలూన్ రూపంలో ఆకృతిని మార్చుకుంటాయని పేర్కొన్నారు. ఈ చేపలను చూడడానికి పలువురు ఆసక్తి చూపారు.
చిలకలూరిపేట వైసీపీలో సంక్షోభం నెలకొందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ వ్యతిరేక, అనుకూల గ్రూపులుగా పట్టణ కౌన్సిలర్లు చీలిపోయినట్లు సమాచారం. కావటి మనోహర్కి సహకరించేది లేదని 12 మంది వైసీపీ కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మల్లెల రాజేశ్ నాయుడుకి వీళ్లు టచ్లో ఉన్నట్లు సమాచారం. వీరంతా రాజేశ్ ఆధ్వర్యంలో పార్టీ మారనున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Sorry, no posts matched your criteria.