Andhra Pradesh

News March 29, 2024

విశాఖ: బీటెక్ విద్యార్థినికి వేధింపులు.. యువకుడిపై కేసు

image

మాకవరపాలెం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని వెంటపడి వేధిస్తున్నాడన్న ఆరోపణపై నర్సీపట్నం కొత్తవీధికి చెందిన యువకుడు వి.అయ్యప్పపై కేసు నమోద అయ్యింది. గురువారం కేసు నమోదు చేసినట్లు నర్సీపట్నం పట్టణ సీఐ కాంతికుమార్ తెలిపారు. ఈ యువకుడు కొద్దిరోజులుగా కళాశాల వరకు ఆమె వెంట పడటమే కాకుండా అటకాయించి కొట్టేందుకు ప్రయత్నించాడని వివరించారు.

News March 29, 2024

కుప్పంలో పాలిసెట్‌కు ఉచిత శిక్షణ

image

కుప్పం పట్టణంలోని డాక్టర్ వైసీ జేమ్స్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ( PolyCET) – 2024 ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జగన్నాథం పేర్కొన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 24వ తేదీ వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అర్హులన్నారు.

News March 29, 2024

బత్తలపల్లి: టెన్త్ విద్యార్థిని సూసైడ్ 

image

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. బత్తలపల్లికి చెందిన సృజన ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కడుపు నొప్పి ఎక్కువై భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 29, 2024

VZM: అప్పుడే రాజమండ్రి నుంచి వచ్చి మృత్యు ఒడిలోకి

image

రామభద్రపురం మండలం కొట్టక్కి బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అందులో జన్నివలసకి చెందిన జొన్నాడ పురుషోత్తం రాజమండ్రి సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సొంత పనులు నిమిత్తం రాజమండ్రి నుంచి బైక్‌పై జన్నివలస గురువారం సాయంత్రమే వచ్చాడు, పనిమీద సాలూరు వెళ్లి వస్తుండగా చనిపోయాడు. మృత్యువు వెంటాడిందంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

News March 29, 2024

10రోజుల కిందే కూతురు పెళ్లి.. అంతలోనే పెనువిషాదం

image

కుటుంబ కలహాలు ఓ ఇంట విషాదాన్ని నింపాయి. ఉండ్రాజవరానికి చెందిన వెంకట్(40)- పార్వతికి 20ఏళ్ల కింద పెళ్లైంది. కొడుకు, కుమార్తె సంతానం. గొడవలతో దూరంగా ఉంటున్న వీరిద్దరూ 10రోజుల కిందే కుమార్తె పెళ్లి చేశారు. రెండ్రోజుల కింద వెంకట్.. తాడేపల్లిగూడెంలోని పార్వతి ఇంటికి రాగా గొడవ జరిగింది. వెంకట్ కత్తితో కొడుకును పొడవగా.. పార్వతి భర్త తలపై ఇటుకతో కొట్టింది. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. వెంకట్ మరణించాడు.

News March 29, 2024

10రోజుల కిందే కూతురు పెళ్లి.. అంతలోనే పెనువిషాదం

image

కుటుంబ కలహాలు ఓ ఇంట విషాదాన్ని నింపాయి. ఉండ్రాజవరానికి చెందిన వెంకట్(40)- పార్వతికి 20ఏళ్ల కింద పెళ్లైంది. కొడుకు, కుమార్తె సంతానం. గొడవలతో దూరంగా ఉంటున్న వీరిద్దరూ 10రోజుల కిందే కుమార్తె పెళ్లి చేశారు. రెండ్రోజుల కింద వెంకట్.. తాడేపల్లిగూడెంలోని పార్వతి ఇంటికి రాగా గొడవ జరిగింది. వెంకట్ కత్తితో కొడుకును పొడవగా.. పార్వతి భర్త తలపై ఇటుకతో కొట్టింది. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. వెంకట్ మరణించాడు.

News March 29, 2024

రాయచోటి: విద్యుదాఘాతంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

image

చిన్నమండెం మండల పరిధిలోని పడమటికోన కమ్మపల్లెలో గురువారం విద్యుదాఘాతంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మట్లి మహేశ్ నాయుడు (30) మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. మహేశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా వర్క్ ఫ్రం హోంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన స్వగ్రామంలో ప్లగ్ బాక్స్‌లో పిన్ మారుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైనట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

News March 29, 2024

విశాఖ: అప్పన్న తలనీలాల వేలం రూ.10.13 కోట్లు

image

సింహాచలం దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాలకు గురువారం వేలం నిర్వహించారు. 2024–25 సంవత్సరానికి గాను రూ.10 కోట్ల 13 లక్షల ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన దొరై ఎంటర్ప్రైజస్ దీనిని సొంతం చేసుకుంది. దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ఏఈవో పాలూరి నరసింగరావు, ఏఈ రాంబాబు, సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి తదితరులు వేలం నిర్వహించారు.

News March 29, 2024

అనంత: డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆర్ట్స్‌ కళాశాలలో డిసెంబర్‌లో నిర్వహించిన డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాలను ప్రిన్సిపాల్ దివాకర్‌ రెడ్డి విడుదల చేశారు. 5వ సెమిస్టర్‌లో 1,261 మందికి గాను 862 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆర్ట్స్‌లో 60 శాతం, కామర్స్‌‌లో 74 శాతం, సైన్స్‌లో 71 శాతం ఉత్తీర్ణులయ్యారు. అలాగే 3వ సెమిస్టర్‌లో 855 మందికి గాను 449 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొదటి సెమిస్టర్‌లో 1,028 గాను 657 మంది పాసైనట్లు తెలిపారు.

News March 29, 2024

ఆ మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో గురువారం ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. అందులో తాడిపత్రిలో అత్యధికంగా 41.4 డిగ్రీలు నమోదైనట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్తలు సహదేవ రెడ్డి, నారాయణస్వామి తెలిపారు. గుంతకల్ 41.2 శింగనమల41.1, పరిగి 40.9 శెట్టూరు 40.8, గుత్తి, చెన్నేకొత్త పల్లి, కనగానపల్లి 40.7, ధర్మవరం 40.6 నమోదైనట్లు తెలిపారు.