India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నాయకుల్లో కిమిడి కళా వెంకట్రావు ఒకరు. పొత్తులో భాగంగా ఆయన ఆశించిన ఎచ్చెర్ల సీటును BJPకి కేటాయించారు. విజయనగరం MP అభ్యర్థి కోసం చేసిన ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా ఆయన పేరు లేదు. దీంతో ఆయన పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ నెలకొంది. చీపురుపల్లిలో నుంచి బరిలో ఉంటారా..లేక ఉమ్మడి విజయనగరంలో TDP ప్రకటించిన 7 స్థానాల్లో ఒక అభ్యర్థిని మార్చి ఆ సీటు కళాకు కేటాయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
కడుపు నొప్పి తాళలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన బత్తలపల్లిలోని టీచర్స్ కాలనీలో చోటు చేసుకుంది. టీచర్స్ కాలనీలో నివాసం ఉన్న తిరుపాలు, లలిత దంపతుల కుమార్తె సుజనా పదో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం 10వ తరగతి పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. అనంతరం తల్లిదండ్రులు ఆర్డీటీ ఆసుపత్రిలో పనిచేసేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘డేరింగ్ అండ్ డాషింగ్’ సినిమా బ్రోచర్ ను విడుదల చేశారు. ఎస్విఎస్ఆర్ ప్రొడక్షన్లో ఈ చిత్రం నిర్మాణమవుతుండగా ‘మైండ్ గేమ్’ హీరో శ్రీరామ్ మరోసారి హీరోగా నటిస్తున్నారు. శ్రీకృష్ణ కిషోర్ చిత్రానికి దర్శకుడుగా మిధున ప్రియతో పాటు పలువురు నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో షేక్ సలీం, మహేంద్ర, వాసు, శోభన్ బాబు పాల్గొన్నారు.
ఏకలవ్య పాఠశాలల్లో ప్రవేశాలకు ఈనెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారని, గడువులోగా ఆసక్తి గలవారు వివరాలు నమోదు చేసుకోవాలని కురుపాం ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపల్ పట్నాయక్ తెలిపారు. ఈ ఏడాది నుంచి ఆఫ్లైన్లో దరఖాస్తులను అనుమతించడం లేదని ఆన్లైన్లో తుది గడువులోగా అందజేయాలన్నారు. ఏప్రిల్ 13న పి.కోనవలస, జోగింపేట, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఏలూరు జిల్లాలో బీఎస్పీ పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఆచార్య ఎన్ఏడీ పాల్, ఏలూరు అసెంబ్లీకి అందుగుల రతన్కాంత్, చింతలపూడి- ఎల్.చైతన్య, దెందులూరు – నేత రమేశ్ బాబు, ఉంగుటూరు- బుంగా ఏసు, కైకలూరు- మన్నేపల్లి నాగేశ్వరరావు, నూజివీడు – డాక్టర్ చెలిగంటి వెంకటేశ్వరరావు, పోలవరం – సరయం వెంకటేశ్వరరావులు పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
మండలంలోని పి.రాజవరంలో బుధవారం రాత్రి పొగాకు రైతు రామ్మోహన్ రెడ్డి పై కూరగాయలు కోసే కత్తితో నాగేంద్ర బాబు అనే వ్యక్తి దాడి చేశారని ఆరోపించారు. పొగాకు ఉడికించే విషయంలో రైతు, కూలీ మధ్య చిన్నపాటి ఘర్షణ దాడికి దారి తీసినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఉత్తరాంధ్ర టీడీపీ సీనియర్ నాయకుల్లో కిమిడి కళా వెంకట్రావు ఒకరు. పొత్తులో భాగంగా ఆయన ఆశించిన ఎచ్చెర్ల సీటును BJPకి కేటాయించారు. విజయనగరం MP అభ్యర్థి కోసం చేసిన ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా ఆయన పేరు లేదు. దీంతో ఆయన పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ నెలకొంది. చీపురుపల్లిలో నుంచి బరిలో ఉంటారా..లేక ఉమ్మడి విజయనగరంలో TDP ప్రకటించిన 7 స్థానాల్లో ఒక అభ్యర్థిని మార్చి ఆ సీటు కళాకు కేటాయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
సర్వేపల్లిలో ఇప్పటి వరకు ఏ నాయకుడికీ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం రాలేదు. సీవీ శేషారెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం 2వసారి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో మరోమారు కాకాణి, సోమిరెడ్డి ముఖాముఖి తలపడబోతున్నారు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా మూడో ఛాన్స్ కొట్టేసినట్టే .
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపల్లె జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. డ్రైవర్ నిద్రమత్తులో కారును డివైడర్ పైకి ఎక్కించడంతో వెహికల్ బోల్తా పడింది. కారులో ఐదుగురు ప్రయాణిస్తూ ఉండగా, ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్, చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు తరలించారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు బుధవారం ముగిశాయి. ఎటువంటి పొరపాటుకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయి. బుధవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 147 కేంద్రాల పరిధిలో కేటాయించిన 27,934 మంది విద్యార్థులకు గానూ 27,284 మంది హాజరయ్యారు. 46 కేంద్రాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.