India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మండలంలోని కొండభీంపురం గ్రామానికి చెందిన టీ.ఢిల్లీశ్వరరావు అనే వ్యక్తిపై విజయనగరం జిల్లా బొండపల్లిలో బుధవారం రాత్రి ఒక మహిళ పిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. 2021 నుంచి తనని ప్రేమించి ఇప్పుడు పెళ్లికి నిరాకరించి వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవుతూ.. తనని మోసం చేస్తున్నాడు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.లక్ష్మణరావు తెలిపారు.
ఉగాది పండుగను పురస్కరించుకొని ఏప్రిల్ 9వ తేదిన ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మకు స్నపనాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పలు అర్జిత సేవలను రద్దు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. ఆ రోజు తెల్లవారు జామున అమ్మవారి ఆలయం చుట్టూ జరిగే ప్రదక్షిణలను నిలిపివేయనున్నారు. సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ, ఖడ్గమార్చనచ నవగ్రహ శాంతి హామం, పల్లకీ సేవలను నిపుదల చేస్తామని చెప్పారు.
పోలీస్ శాఖలో రాష్ట్రస్థాయిలో వివిధ కేసుల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రప్రభుత్వం డీజీపీ గోల్డ్ డిస్క్, సిల్వర్ డిస్క్, బ్రాంచ్ డిస్క్ అవార్డులకు ఎంపిక చేసింది. వారిలో గుంటూరు రేంజ్ ఐజి పాలరాజుకు గోల్డ్ డిస్క్, ఏఎస్పి సుప్రజ, డీఎస్పీ పోతురాజులకు సిల్వర్ డిస్క్, ఏఎస్పీ A. శ్రీనివాసరావు, డి.ఎస్.పిలు T. శ్రీనివాసరావు, B సీతారామయ్య మరికొందరికి బ్రాంచ్ డిస్క్లకు ఎంపికయ్యారు.
తవణంపల్లి మండలం, K పట్నం 140 జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని వెనక నుంచి కారు ఢీకొనడంతో కారులో ఉన్న ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వేగం కంట్రోల్ కాక లారీని కారు ఢీకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వ్యక్తి బెంగళూరుకు చెందిన మహేశ్గా గుర్తించి వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఎట్టకేలకు ధర్మవరం టికెట్ పొత్తులో భాగంగా బీజేపీకి దక్కడంతో ఇక ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. వైసీపీ నుంచి కేతిరెడ్డి పోటీచేస్తుండగా.. బీజేపీ నుంచి ఆ పార్టీ కీలక నేత వై.సత్యకుమార్ బరిలో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సత్యకు.. వరదాపురం సూరి, పరిటాల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండటం బీజేపీకి ఇక్కడ కలిసొచ్చే అంశమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
నెల్లూరు జిల్లా, కందుకూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు డివైడర్ను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద కారు డివైడర్ను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పాలకొల్లు నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పాలకొల్లు నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తుండగా ఘోరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పాలకొల్లు నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 9.55 మదనపల్లి నుంచి హెలికాప్టర్లో 10.40 ప్రసన్నాయ పల్లి చేరుకుంటారు. అక్కడ నుంచి 11 నుంచి12.30 వరకు రాప్తాడు బహిరంగసభలో పాల్గొంటారు. 2 గంటల వరకు ఆర్డీటీ స్టేడియంలో భోజన విరామం. 2.30 నుంచి 4 వరకు బుక్కరాయసముద్రం మీటింగ్లో పాల్గొంటారు. అక్కడనుంచి కదిరికి 5.10 చేరుకుని కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు వెల్లడించారు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ కారులో మద్యం సీసాలను తరలిస్తున్న అయిదుగురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీల్లో కారులో ఆరు మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు కారును సీజ్ చేసినట్లు రూరల్ ఎస్సై వాసుదేవరావు తెలిపారు.
Sorry, no posts matched your criteria.