Andhra Pradesh

News March 28, 2024

పార్వతీపురం: ‘ప్రచారానికి అనుమతులు తప్పనిసరి’

image

ప్రచారానికి అనుమతులు తప్పనిసరని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ఎన్నికల నిర్వహణకు ముందస్తు చేస్తున్న ఏర్పాట్లును, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు తీరును సమీక్షించారు.

News March 28, 2024

కృష్ణా: విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ట్రాక్ నిర్వహణ మరమ్మతులు జరుగుతున్నందున మచిలీపట్నం- విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నెం.17220 విశాఖపట్నం- మచిలీపట్నం ట్రైన్‌ను ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 29 వరకు, నెం.17219 మచిలీపట్నం- విశాఖపట్నం ట్రైన్‌ను ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దు చేస్తున్నామని రైల్వే శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

News March 28, 2024

విశాఖ: ‘ఆర్ఓలు బాధ్యతగా వ్యవహరించాలి’

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఆర్ఓ కూడా తమ విధులను బాధ్యతగా వ్యవహరించాలని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ బృందాలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 28, 2024

ఏజెన్సీలను మరింత అప్రమత్తంగా ఉంచాలి: కలెక్టర్

image

ఎలక్షన్ సీజర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీలను మరింత అప్రమత్తంగా ఉండి జిల్లా వ్యాప్తంగా నిఘాను మరింత పటిష్ఠ పరచాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఏలూరులో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు తదితరులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎంసీసీ అమలు, ఎస్ఎస్‌టీ, ఎఫ్ఎస్‌టి, వీఎస్‌టీ బృందాలు పనితీరు అంశాలపై కలెక్టర్ చర్చించారు.  

News March 28, 2024

1న నన్నయలో బీఈడీ స్పాట్ అడ్మిషన్స్

image

ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ ప్రవేశాలకు ఏప్రిల్ 1వ తేదీన స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ తెలిపారు. బీఈడీ రెండేళ్ల కాలవ్యవధి కోర్సులో ప్రవేశాలకు ఆసక్తి, అర్హత ఉన్నవారు హాజరు కావాలని కోరారు. రెగ్యులర్ సీట్లు 14, ఈడబ్ల్యూఎస్ 5 సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. తప్పనిసరిగా ఏపీ ఎడ్‌సెట్-2023 ప్రవేశ పరీక్షకు హాజరై ఉండాలన్నారు.

News March 28, 2024

ఎన్నిక‌ల ప్రచారానికి అనుమతులు తప్పనిసరి: ఢిల్లీరావు

image

రాజ‌కీయ పార్టీలు, అభ్య‌ర్థులు ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఇత‌ర అనుమ‌తుల మంజూరుకు ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ప‌రిశీలించి అనుమ‌తులు ఇస్తామని జిల్లా ఎన్నిక‌ల అధికారి ఢిల్లీరావు తెలియ‌జేశారు. నేడు గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో కలెక్టర్ తన కార్యాలయంలో స‌మావేశం నిర్వ‌హించారు. అభ్య‌ర్థులు, పార్టీలు నేరుగా లేదా ఆన్‌లైన్లో సువిధ పోర్ట‌ల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌న్నారు.

News March 27, 2024

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సమావేశం

image

విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి నివాసంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు, జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్, పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చలు కొనసాగినట్లు సమాచారం.

News March 27, 2024

ప్రచార సామగ్రిపై దుష్ప్రచారం తగదు: చెవిరెడ్డి

image

వైసీపీ అధికారికంగా కొనుగోలు చేసిన ప్రచార సామగ్రిపై దుష్ప్రచారం చేయడం తగదని ఆ పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల నిమిత‍్తం పార్టీకి అవసరమైన సామగ్రిని 2023 అక్టోబర్‌ నుంచి 2024 మార్చి 14వ తేదీ వరకు వివిధ తేదీల్లో పలు సంస్థల నుంచి జీఎస్‌టీ చెల్లించి మరీ కొనుగోలు చేసినట్లు చెప్పారు.

News March 27, 2024

విశాఖ: టైగర్‌ ట్రయాంఫ్‌ విన్యాసాలు

image

భారత్, యూఎస్‌ల ఆధ్వర్యంలో టైగర్‌ ట్రయాంఫ్‌–2024 సీఫేజ్‌ విన్యాసాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు బుధవారం విశాఖ సముద్ర తీరానికి 40 నాటికల్‌ మైళ్ల దూరంలో విన్యాసాలు నిర్వహించారు. విపత్తు నిర్వహణ, మానవతా సహాయం పేరుతో రెండో రోజు విన్యాసాలు సాగాయి. భారత్‌కు ఐఎన్‌ఎస్‌ జలశ్వా ప్రాతినిధ్యం వహించగా, యూఎస్‌కు యూఎస్‌ఎస్‌ సోమర్‌సెట్, యూఎస్‌ఎస్‌ హాల్‌సే యుద్ధ నౌకలు పాల్గొన్నాయి.

News March 27, 2024

అనంత: అంజలి మృతి ఘటనలో ముగ్గురు అరెస్ట్

image

అనంతపురం పట్టణానికి చెందిన అంజలి మృతిపై ముగ్గురిని అరెస్టు చేసినట్టు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. అంజలి మృతి ఘటనలో ఆమె భర్త రాజు, బెల్దరి దస్తగిరి, బాలును అరెస్టు చేశామన్నారు. మృతురాలి కుటుంబీకులు వాంగ్మూలం ప్రకారం భర్తతో పాటు మరో ఇద్దరిపై విచారణ జరిపి కేసు నమోదు చేశామన్నారు.