India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కౌతాళం మం. నదిచాగి గ్రామానికి చెందిన 8 మంది ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. హైస్కూల్ కేటగిరిలో వడ్డే నాగరాజు కన్నడ సబ్జెక్ట్లో కర్నూలు జిల్లా రెండో ర్యాంక్, తాలూరు స్వాతి సోషల్లో జిల్లా ప్రథమ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. టి.మంజుశ్రీ మ్యాథ్స్లో రాణించారు. అలాగే SGT విభాగంలో కె.కావ్య జిల్లా మూడో ర్యాంక్ సాధించారు. రణ్ రాజ్, రాంతుల్ల, విజయ కుమార్, వైశాఖ శెట్టి సైతం ఉద్యోగాలు పొందారు.
ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా విద్యార్థినులపట్ల అసభ్యంగా ప్రవర్తించే ఉపాధ్యాయులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం విద్యాశాఖాధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. జిల్లాలోని పాఠశాలలకు వచ్చే విద్యార్థుల పట్ల రాజీపడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో DEO కిరణ్ పలువురు పాల్గొన్నారు.
ధవళేశ్వరానికి చెందిన వేపాడ సతీశ్ (23) హత్య కేసు మిస్టరీ వీడింది. టూ టౌన్ సీఐ శివ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8న కైలాస భూమి శ్మశాన వాటిక సమీపంలో మద్యం తాగుతుండగా ఓ వ్యక్తిగత వ్యవహారంపై జరిగిన గొడవలో బి. రాధాకాంత్తో పాటు నలుగురు కలిసి సతీశ్ను కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేశారు. అనుమానాస్పద కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురి అరెస్టు చేశారు.
దివ్యాంగులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు అందిస్తుందని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. 9, 10వ తరగతి విద్యార్థులు ఈ నెల 31 లోపు, ఇంటర్ ఆ పైన చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు www.depwd.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె వెల్లడించారు.
ఒక్కో బార్కు నాలుగు కన్నా తక్కువ ధరకాస్తులు వస్తే, దరఖాస్తు రుసుము రూ.5 లక్షలు వాపస్ చేస్తామని జిల్లా ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ తెలిపారు. అయితే ప్రాసెసింగ్ పీజు మాత్రం వెనక్కు ఇవ్వరన్నారు. వాటిని రద్దుచేసి మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని టెండరు దారులు గుర్తించాలన్నారు. జిల్లాలో 29 బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీచేసినట్లు వివరించారు.
మెగా డీఎస్సీ – 2025 ఫలితాలలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్న బాలి అప్పలరాజుకు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్గా స్టేట్ 12వ ర్యాంకు సాధించారు. తాను ప్రస్తుతం జి. సిగడాం జెడ్పీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నానని తెలిపారు. అయితే విడుదలైన ఫలితాలలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ స్టేట్ 12వ ర్యాంకుతో పాటు పీజీటీగా స్టేట్ ఏడవ ర్యాంకు కూడా వచ్చిందన్నారు.
కట్టుకున్న భర్తను, కన్న కూతూరిని హతమార్చిందో మహిళ. భీమిలి (M)కి చెందిన జ్యోతిర్మయి వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త రమేశ్ను ప్రియుడు రాము, మరో ఇద్దరి సహాయంతో చంపింది. ఈ సంఘటన చూసిన కుమార్తెను కొత్తవలసలోని బావిలో పడేశారు. VZM టూటౌన్ PSలో 2015లో హత్య కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో మహిళకు జీవిత ఖైదు, ఇద్దరికి ఏడేళ్ల శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని SP వకుల్ జిందాల్ తెలిపారు.
యూరియా కృత్రిమ కొరతను సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రైవేట్ ఫర్టిలైజర్స్ డీలర్లను హెచ్చరించారు.
శుక్రవారం రాత్రి వ్యవసాయ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఫర్టిలైజర్స్ డీలర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో దాదాపు 430 ప్రైవేట్ ఫర్టిలైజర్స్ షాపుల వద్ద యూరియా ఎరువుల వివరాలతో బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. JC అధితిసింగ్, DAO చంద్రానాయక్ పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న రౌడీ షీటర్ శ్రీకాంత్ను అధికారులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. భద్రతా కారణాలు దృష్ట్యా ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. ఉదయం 6:30 సమయంలో విశాఖ జైలుకు అతను చేరుకున్నాడు. పెరోల్ రద్దు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అతన్ని వేరే జైలుకు తరలిస్తారన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అతన్ని విశాఖ తరలించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన బార్ల పాలసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో ఆథరైజ్డ్ బార్ల దరఖాస్తులకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఈనెల 18న జిల్లాలో బార్ల ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలై ఇప్పటి వరకు ఐదు రోజులు కావస్తున్నా దరఖాస్తులు దాఖలు కాలేదు. నూతన బార్ల విధానం నిర్వహకులకు భారంగా మారుతుందని పలువురు వాపోయారు.
Sorry, no posts matched your criteria.