Andhra Pradesh

News March 27, 2024

విశాఖ: ఎన్నికల ఏర్పాట్లపై ప్రధాన అధికారి సమీక్ష

image

విజయవాడ నుంచి ఎన్నికల ప్రధాన అధికారి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సి విజిల్ ఫిర్యాదులు పరిష్కారం ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ జిల్లా నుంచి జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి మల్లికార్జున జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కే మయూర్ అశోక్ తదితరులు ఎన్నికల నిర్వహణపై వివరించారు.

News March 27, 2024

కడప: ప్రేమ పెళ్లి ..విషాదంతో ముగిసింది

image

పెద్దల నెదిరించారు, పోలీసు కేసులు, ఛేజింగ్ చివరికి ఐదు నెలల క్రితం పుల్లంపేట మండలం దేవసముద్రం వడ్డిపల్లికి చెందిన హరికృష్ణ, చిట్వేలి కేకే వడ్డిపల్లికి చెందిన శ్రీలేఖ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆనందంగా గడుపుతున్న ఆ జంటపై విధి కన్నెర్ర చేసింది. రాజంపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బూర్సు హరికృష్ణ (21) మృతి చెందగా, శ్రీలేఖ గాయపడి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

News March 27, 2024

కాంగ్రెస్‌లో చేరిన డిప్యూటీ సీఎం మేనల్లుడు

image

డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి మేనల్లుడు డి.రమేష్ బాబు వైసీపీని వీడారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే కాంగ్రెస్ పార్టీ జీడీనెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగతానని చెప్పారు.

News March 27, 2024

పెండింగ్‌లో ఉన్న ఫారంలను వేగంగా పరిష్కరించాలి: ముఖేశ్ కుమార్

image

పెండింగ్ లో ఉన్న ఫారం-7,8 లను వేగవంతంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పాల్గొన్నారు.

News March 27, 2024

మైదుకూరు: గుండెపోటుతో మహిళ మృతి

image

మైదుకూరు మున్సిపాలిటీ 12వ వార్డుకు చెందిన షేక్ భాను(37) అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. మూడు రోజుల నుంచి తాగు నీటి ట్యాంకర్ రాకపోవడంతో పక్కన వీధిలో నీటి ట్యాంకర్ నుంచి అతి కష్టం మీద బిందెతో నీళ్లు తెచ్చుకుంటూ కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. తాగునీటి కోసం ఎక్కువ టెన్షన్ పడడం వల్లే గుండెపోటుకు గురైందని వాపోతున్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

News March 27, 2024

ప్రకాశం: PHOTO OF THE DAY

image

ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భానుడి ప్రతాపానికి మనుషులతో పాటు పశువులు, పక్షులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇందుకు ఈ ఫొటోనే నిదర్శనం. ఏల్చూరులోని ఓ ప్రధాన రహదారి పక్కనే ఉన్న చేతిపంపు నుంచి జాలువారుతున్న నీటి బిందువులను ఓ కాకి గొంతు తడుపుకుటుంది. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు. అలాగే పశువుల నీరు కోసం చేతిపంపు, బోర్లు వద్ద, ఇళ్లపైన తొట్టెలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.

News March 27, 2024

విజయవాడ: కలెక్టర్, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స‌చివాల‌యం నుంచి బుధవారం రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేశ్ కుమార్ మీనా అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జిల్లాల ఎన్నిక‌ల అధికారుల‌తో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లుచేస్తున్నామ‌ని సీ విజిల్ ద్వారా వ‌చ్చే ఫిర్యాదుల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి స‌త్వ‌ర ప‌రిష్కారానికి కృషిచేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు అన్నారు.

News March 27, 2024

గూడూరు-వెంకటగిరి రోడ్డుపై ప్రమాదం 

image

గూడూరు-వెంకటగిరి రోడ్డుపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటగిరి నుంచి గూడూరు వైపు వస్తున్న కారు.. ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.    

News March 27, 2024

చేనేతలకు 500 యూనిట్ల కరెంట్ ఫ్రీ: CBN

image

పుత్తూరు ప్రజాగళం సభలో చంద్రబాబు(CBN) కీలక ప్రకటన చేశారు. ‘నగరి ఎమ్మెల్యేగా పదేళ్లు ఉన్నా జబర్దస్త్ రోజా ఏం చేయలేదు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా దోచుకున్నారు. గతంలో పవర్‌లూమ్ చేనేత కార్మికులకు విద్యుత్తు ఛార్జీలో సబ్సీడీ ఇచ్చి ఆదుకుంది మేమే. ఈసారి గెలిచిన వెంటనే 500 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అందిస్తాం. నేటం షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులకు బకాయిలు చెల్లిస్తాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

News March 27, 2024

శ్రీకాకుళం: EVMల భ‌ద్ర‌త‌ను స‌మీక్షించిన‌ క‌లెక్ట‌ర్‌

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గోదాముల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ మనజీర్ జిలాని సమూన్, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి బుధవారం త‌నిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా అక్క‌డి భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. గోదాముల‌ను తెరిపించి, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఏర్పాటు చేసిన బ్లాకులను, ఈవీఎంల‌ను ప‌రిశీలించారు.